రవితేజ నటించిన ఇడియట్ చిత్రంలోని ‘చూపుల్తో గుచ్చి, గుచ్చి చంపకే’ అనే పాటను తెలియని సంగీత ప్రియులు ఉండరంటే అతీశయోక్తి కాదేమో. అయితే ఈ పాటను ఓ బాలీవడ్ మ్యూజిక్ డైరెక్టర్ కాపీ కొట్టాడు. ట్యూన్ను యాజ్ ఇ టీజ్గా దించేశాడు. ఆ పాటలో నటించింది మరెవరో కాదు.. కియారా అద్వాని. ఈ అమ్మడు ఇప్పటికే ‘భరత్అనే నేను’ ‘వినయవిధేయరామ’ చిత్రంలో నటించి మెప్పించింది. కియారా ప్రస్తుతం బాలీవుడ్లో ‘ఇందూకి జవానీ’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో […]
సారథి న్యూస్, హైదరాబాద్: నివాసం ఉండటానికి, స్థిరమైన ఉపాధిని కల్పించడంలోనూ హైదరాబాద్ నగరమే అత్యత్తమని ఓ సర్వే తేల్చింది. దేశవ్యాప్తంగా ఉన్న 34 నగరాలపై ఈ సర్వే నిర్వహించగా.. హైదరాబాద్ చాలా సేఫ్సిటీ అని తేలింది. విశ్వనగరంగా పేరుతెచ్చుకున్న హైదరాబాద్ ఇప్పటికే పలు సర్వేల్లో బెస్ట్సిటీగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తాజాగా హాలిడిఫై.కామ్ నిర్వహించిన సర్వేలో 34 అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ నంబర్వన్ గా నిలిచింది. మనదేశంలో నివాసయోగ్యమైన. సుస్థిరాభివృద్ధఙ చెందిన నగరాలపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది […]
హైదరాబాద్ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన కారణంగా విద్యుత్ బిల్లులో రికార్డు చేయలేదని.. ఆ సమయంలో అధికంగా వచ్చిన విద్యుత్ బిల్లులు తగ్గేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు, శ్రీశైలం పవర్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంపై శాసనసభలో స్వల్ప కాలిక చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘కోవిడ్ సందర్భంలో విద్యుత్ బిల్లులు రికార్డు చేయలేదు […]
తాడేపల్లి: ‘అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దది. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ కూడా ఈ స్కామ్లో ఉన్నారు. అమరావతి అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరాం. సీబీఐ విచారణతో అందరిజాతకాలు బయటకొస్తాయి’ అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాలు కొనుగోలు చేశారు. ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నది. ఫైబర్ గ్రిడ్ పేరుతో […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం (24గంటల్లో) 2,058 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 1.60లక్షలు దాటాయి. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 984కు చేరింది. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 1,60,571 గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 277 కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు 51,247 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో 2,180 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు […]
సారథిన్యూస్, రామడుగు: పేదరికం ఆ కుటుంబాన్ని చిదిమేసింది. విధి వెక్కిరించింది. చిన్న వయసులోనే ఇద్దరు పిల్లల నా అనేవాళ్లకు దూరమై అనాథలయ్యారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారం గ్రామానికి చెందిన గుర్రం వనిత (17), గుర్రం నవీన్ కుమార్(6)ల తల్లిదండ్రులు నాలుగేండ్ల క్రితం ఓ ప్రమాదంలో చనిపోయారు. దీంతో వాళ్ల నాన్నమ్మే పిల్లలిద్దరినీ పెంచి పోషించింది. సోమవారం వాళ్ల నాన్నమ్మ కూడా తుదిశ్వాస విడిచింది. దీంతో వీరు అనాథలయ్యారు. ప్రస్తుతం ఆ చిన్నారులు దిక్కుతోచని స్థితిలో […]
సారథి న్యూస్, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం దేశాయిపేటలో సోమవారం ‘మేము’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా రోగులకు సాయం అందించారు. కరోనా బాధితుడి కుటుంబానికి 20 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థఫౌండర్ పాకాల మహేశ్గౌడ్, సభ్యులు కల్లేపల్లి లక్ష్మణ్, ముదుగంటి సురేశ్, వెంకటరమణ, ఉపసర్పంచ్ సింగిరెడ్డి వెంకట్ రామ్ రెడ్డి, మహిపాల్, గంగస్వామి పాల్గొన్నారు.
సారథి న్యూస్ రామడుగు: ప్రధాన్ మంత్రి గ్రామీణ్ డిజిటల్ సాక్షరతా అభియాన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోలి రామయ్యపల్లి గ్రామంలో అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 14 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారందరికీ ఉచితంగా కంప్యూటర్, డిజిటల్ లావాదేవీలు, కిసాన్ క్రెడిట్కార్డుకు దరఖాస్తు చేసుకునే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించినట్టు అధికారులు చెప్పారు. కార్యక్రమంలో కేంద్రప్రభుత్వ అధికారులతో పాటు సర్పంచ్ ఉప్ప రాధమ్మ, ఉపసర్పంచ్ కనకయ్య, […]