సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం 1,896 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 82,647కి చేరింది. కరోనాతో తాజాగా 8 మంది మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 645కు చేరింది. కరోనా బారి పడి ఒక్కరోజే 1,788 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనాను జయించిన వారి సంఖ్య 59,374 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 22,628 ఉన్నాయి. రాష్ట్రంలో తాజాగా 18,035 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. దీంతో […]
సారథి న్యూస్, మహబూబ్నగర్: మహబూబ్నగర్ కు చెందిన చెరుకుపల్లి రామలింగయ్య కరోనాతో మృతిచెందారు. దహన నమస్కారాలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఎవరూ ముందుకురాలేదు. నేనున్నానని.. మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ పీపీఈ కిట్ ధరించి సోమవారం అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్ తో మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం హేయమైనా చర్యగా అభివర్ణించారు. కరోనా ప్రబలిన నాటి నుంచి మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తున్న తీరు మానవీయ విలువలను మంటగలిపేలా ఉందని ఆందోళన […]
సారథి న్యూస్, రామగుండం: కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో శానిటైజేషన్ విధిగా చేయాలని.. కరోనా పేషెంట్లు క్వారంటైన్లో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ఆయన కలెక్టర్, అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జడ్పీచైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావు, ఇంచార్జి కలెక్టర్ భారతి […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సోమవారం 7,665 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 80 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య 2,116కు చేరింది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,35,525కు చేరింది. గత 24 గంటల్లో 46,699 కరోనా టెస్టులు చేశారు. కొత్తగా 6,924 మంది వైరస్ బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,45,636కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 87,112 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 25,34,304 కరోనా నిర్ధారణ పరీక్షలు […]
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. స్థానిక పీహెచ్సీలో సోమవారం 17 మందికి కరోనా పరీక్షలు చేశారు. వారిలో మడూర్, చందాపూర్ గ్రామాలకు చెందిన ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి తెలిపారు. నేటితో మండలంలో 13 మందికి పాజిటివ్ రాగా నలుగురు రికవరీ అయ్యారని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.
సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడులో కరోనా విజృంభిస్తోంది. తాజాగా 44 మందికి కరోనా రాపిడ్ టెస్టులు నిర్వహించగా 14 మందికి కరోనా సోకింది. మానవపాడు -2, కొర్రిపాడు -1, మద్దూరు -2, ఉండవెల్లి మండలంలోని ఉండవెల్లి -1, పుల్లూరు -5, అలంపూర్ క్రాస్ రోడ్డు -2, ఇటిక్యాల మండలంలో – 1 చొప్పున కేసులు నమోదైనట్టు డాక్టర్ దివ్య తెలిపారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, విధిగా […]
మాజీ మిస్ ఇండియా వరల్డ్ నటాషా సూరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆమె హోంక్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటోంది. ఇటీవల ఆమె ముంబై నుంచి పుణె వెళ్లింది. తర్వాత ఆమెకు గొంతునొప్పి, తీవ్రజ్వరం రావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు కరోనా వచ్చినట్టు ఆమె తెలిపారు. ప్రస్తుతం తన కుటుంబసభ్యుల కూడా క్వారంటైన్లో ఉన్నారని చెప్పారు. నటాషా సూరి 2016 మలయాళ సినిమా ‘కింగ్ […]
ఢిల్లీ: కరోనా మహమ్మారి సెలబ్రిటీలను, రాజకీయనాయకులను సైతం వదలడం లేదు. ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రి అమిత్షాకు కరోనా సోకగా.. తాజాగా మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్లో వెల్లడించారు. ‘నేను రెగ్యులర్ పరీక్షల్లో భాగంగా కరోనా టెస్టులు చేయించుకోగా నాకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత వారంరోజులుగా అన్ని కలిసిన వారంతా దయచేసి పరీక్షలు చేయించుకోండి’ అంటూ ఆయన […]