సారథి న్యూస్, హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా బుధవారం నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ లో వర్ధంతి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. దేశానికి చేసిన సేవలను మంత్రులు కొనియాడారు. అంతకుముందు 2021కు సంబంధించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, మంత్రి వి.శ్రీనివాస్గౌడ్, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
తెలంగాణ ముద్దుబిడ్డకు భారతరత్న ఇవ్వాల్సిందే కాలం విసిరిన సంకెళ్లతో ముందుకెళ్లారు ప్రతిభాశాలి, రాజకీయాల్లో మేరునగధీరుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సారథి న్యూస్, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కోరారు. పీవీ మన ఠీవీ, ఆర్థిక విధానాల సృష్టికర్త అని కొనియాడారు. ఏడాది కాలం పాటు శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం పీవీకి భారతరత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు 26న(బుధవారం) ‘సాహితీ సౌరభం.. అసమాన దార్శనికత’ పేరుతో తెలంగాణ ముద్దుబిడ్డ, దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు సమాలోచన సభ జరగనుంది. పీవీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఈ సభకు మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షత వహించనున్నారు. రాజ్యసభ సభ్యుడు, ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కె.కేశవరావు, పీవీ తనయుడు ప్రభాకర్ రావు, కూతురు వాణిదేవి, కవి అంపశయ్య నవీన్, రచయిత […]
సారథి న్యూస్, హైదరాబాద్: ‘ఢిల్లీకి రాజునైనా తల్లికి బిడ్డనే’ అన్న పదం మూడు దశాబ్దాల క్రితం రాజకీయాల్లో మార్మోగింది. ఈ మాటలు ఎవరో కాదు మన తొలి తెలుగు ప్రధాని, ఆదర్శనీయుడు అనిపించుకుంటున్న పాములపర్తి వెంకట నరసింహారావు(పీవీ నరసింహారావు) నోటి నుంచి వచ్చాయి. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అటు కాంగ్రెస్ పార్టీలోనూ ఇటు దేశంలోనూ సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో ఢిల్లీ పీఠాన్ని ఆధిరోహించిన బహుభాషా కొవిదుడు, అపర చాణుక్యుడు […]
సారథి న్యూస్, హుస్నాబాద్: బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానిపాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ నరసింహారావు) జన్మించి జూన్ 28వ తేదీ నాటికి వందేళ్లు పూర్తి కావడంతో కుటుంబసభ్యులు శతజయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి వంగర గ్రామంలో 1921 జూన్28న ఆయన జన్మించారు. ఆయన తప్పటడుగుల వేసిన నుంచి యవ్వనం వరకు ఉన్న తన ఇంటినే మ్యూజియంగా చేయాలని పీవీ తనయుడు ప్రభాకర్ రావు సంకల్పించారు. తాను 1952లో నిర్మించిన ఇంట్లో […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 28న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. మంగళవారం ప్రగతిభవన్ లో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 28న హైదరాబాద్ లోని పీవీ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సుమారు 50 దేశాల్లో పీవీ జయంతి వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఉత్సవాల నిర్వహణకు తక్షణమే రూ.10కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఉత్సవాల కమిటీ చైర్మన్, రాజ్యసభ […]