Breaking News

నవోదయ

వట్టెం నవోదయ ఆభివృద్ధికి ఎంపీ హామీ

వట్టెం నవోదయ ఆభివృద్ధికి ఎంపీ హామీ

సామాజిక సారథి, బిజినేపల్లి: వట్టెం నవోదయ విద్యాలయం ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలోని ప్రతిభావంతులైన విద్యార్థులను తీర్చిదిద్దాలని నాగర్ కర్నూల్ ​ఎంపీ పి.రాములు ఆకాంక్షించారు. శుక్రవారం నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్, అధ్యాపకులు భాస్కరాచారి హైదరాబాద్ లో ఆయనను కలిసి బొకే ఇచ్చి, శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ రాములు మాట్లాడుతూ.. వట్టెం నవోదయ విద్యాలయంలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్థిరపడి గుర్తింపు పొందడం అభినందనీయమన్నారు. […]

Read More
‘హిమాలయాలకు చెమట పడుతుంది’ ఆవిష్కరణ

‘హిమాలయాలకు చెమట పడుతుంది’ ఆవిష్కరణ

సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా జవహర్ నవోదయ విద్యాలయం తెలుగు అధ్యాపకుడు, ప్రముఖకవి శేషం సుప్రసన్నాచార్యులు రచించిన ‘హిమాలయాలకు చెమట పడుతుంది’ కవితా సంకలనం ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం కరీంనగర్​ అడినషనల్​ కలెక్టర్​ జీవీ శ్యాంప్రసాద్ లాల్ తన క్యాంపు ఆఫీసులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రసన్న కవిత్వంలో అనేక సామాజికాంశాలు ఉండటమే కాకుండా వారు నేర్చుకున్న సంస్కృతభాష ప్రభావం, పురాణేతిహాసాల ప్రయోగాలు విస్తృతంగా ఉన్నాయని, పదప్రయోగం అనిర్వచనీయమని కొనియాడారు. పుస్తక పరిచయకర్త, […]

Read More
ఆగస్టు 11న నవోదయ 6వ తరగతి ప్రవేశపరీక్ష

ఆగస్టు 11న నవోదయ 6వ తరగతి ప్రవేశపరీక్ష

సారథి, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా వట్టెం జవహర్ ​నవోదయ విద్యాలయం 6వ తరగతిలో ప్రవేశానికి ఆగస్టు 11న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇన్​చార్జ్ ​ప్రిన్సిపల్ ​బి.కవిత, ఎగ్జామ్​ ఇన్​చార్జ్ ​వి.భాస్కరాచారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు www.navodaya.gov.in అనే వెబ్​సైట్ నుంచి హాల్​టికెట్ ను డౌన్​లోడ్ ​చేసుకోవాలని కోరారు. ఉమ్మడి మహబూబ్ నగర్​ జిల్లాలోని 26 కేంద్రాల్లో ఎగ్జామ్​నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 6వ తరగతిలో ప్రవేశపరీక్ష రాసేందుకు 4,151 మంది విద్యార్థులు దరఖాస్తు […]

Read More
ఐసొలేషన్ సెంటర్ గా నవోదయ విద్యాలయం

ఐసొలేషన్ సెంటర్ గా నవోదయ విద్యాలయం

సారథి, చొప్పదండి: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటుకు చొప్పదండి పట్టణంలోని నవోదయ విద్యాలయాన్ని అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, డీపీవో వీరబుచ్చయ్య సోమవారం పరిశీలించారు. ఐసొలేషన్ ఏర్పాటునకు అన్నిరకాల వసతులు ఉన్నందున ఎంపిక చేసినట్లు తెలిపారు. తహసీల్దా్ర్ అంబటి రజిత, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, వైద్యాధికారి రమాదేవికి నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. పనులు వెంటనే ప్రారంభించేలా ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమంలో నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ మంగతాయారు, ఎంపీవో జగన్మోహన్ రెడ్డి, రెవెన్యూ ఇన్ […]

Read More
నవోదయ ఉపాధ్యాయుడికి గౌరవ పురస్కారం

నవోదయ ఉపాధ్యాయుడికి గౌరవ పురస్కారం

సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్​కర్నూల్ ​జిల్లా వట్టెం నవోదయ విద్యాలయంలో తెలుగు ఉపాధ్యాయుడు శేషం సుప్రసన్నాచార్యులుకు కర్ణాటకలోని విజయనగరం విరూపాక్ష స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం జరిగిన ప్రతిష్ఠాత్మక జాతీయ సంగీత నృత్య సాహిత్య కార్యక్రమంలో సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు గౌరవ పురస్కారం ప్రదానం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ​కోలా వేంకటేశ్వర్​రావు మాట్లాడుతూ.. సుప్రసన్నాచార్యులు బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు సాహిత్యంలో విశేషకృషి చేశారని, పద్యకవిత వచనకవితా ప్రక్రియల్లో కవితారచన చేయడంలో సవ్యసాచి అని కొనియాడారు. […]

Read More
‘నవోదయ’ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

‘నవోదయ’ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

సారథి న్యూస్, బిజినేపల్లి: నవోదయ విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని అఖిల భారత నవోదయ విద్యాలయాల ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నాగర్​కర్నూల్ ​ఎంపీ పి.రాములును బుధవారం కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరాచారి మాట్లాడుతూ.. 2004 జనవరికి ముందు విధుల్లో చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్​సౌకర్యం కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తడి తీసుకురావాలని కోరారు. సుదీర్ఘకాలంగా జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో […]

Read More
‘‘నవోదయ’’లో ప్రవేశాలకు నోటిఫికేషన్​

‘నవోదయ’లో ప్రవేశాలకు నోటిఫికేషన్​

సారథి న్యూస్, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం నవోదయ విద్యాలయంలో 2020––21 అకాడమిక్ ఆరవ తరగతిలో చేరేందుకు విద్యార్థుల ప్రవేశపరీక్షకు శుక్రవారం నోటిఫికేషన్​విడుదలైందని ప్రిన్సిపల్ ​వీరరాఘవయ్య తెలిపారు. ఆరవ తరగతిలో 80 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లా పరిధిలో ఐదవ తరగతి చదివిన విద్యార్థులు ఆన్​లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. సీబీఎస్​ఈ బోధన ఉంటుంది. […]

Read More