సామాజికసారథి, వెల్దండ: హెడ్ కానిస్టేబుల్ గొప్ప హృదయం చాటుకున్నారు. వైద్యవిద్యార్థినికి కొండంత సాయం అందించారు. ప్రజల రక్షణంలోనే కాదు.. సామాజిక సేవలోనూ ముందుంటామని నిరూపించారు. ఇటీవల వెల్లడించిన నీట్ ఫలితాల్లో ఎంబీబీఎస్ సీటు సంపాదించిన వెల్దండ మండల కేంద్రానికి చెందిన ఆటోడ్రైవర్ ఫ్రాంక్లిన్, అలివేలు దంపతుల కూతురు సృజన వైద్యచదువులకు చేయూతను అందించారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ శేఖర్ సోమవారం తనవంతు సహాయంగా ఎస్సై నర్సింహులుతో కలిసి సదరు […]
సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట్ లో ప్రతి లచ్చయ్య ఇటీవల కరోనతో మృతిచెందాడు. కుటుంబాన్ని ఆదుకునేందుకు యువకులు సేకరించిన రూ.40వేలను మంగళవారం బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కర్ర సత్యప్రసన్న, ఎంపీటీసీ ఎడవెళ్లి నరేందర్, ఉపసర్పంచ్ ఎడవెళ్లి మధుసూదన్ రెడ్డి, ఎక్సైజ్ ఎస్సై విజయ్, సిద్దార్థ, పురాణం రమేష్, టేకు రాజేశం పాల్గొన్నారు.
సారథి న్యూస్, చొప్పదండి: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం దేశాయిపేటలో సోమవారం ‘మేము’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరోనా రోగులకు సాయం అందించారు. కరోనా బాధితుడి కుటుంబానికి 20 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థఫౌండర్ పాకాల మహేశ్గౌడ్, సభ్యులు కల్లేపల్లి లక్ష్మణ్, ముదుగంటి సురేశ్, వెంకటరమణ, ఉపసర్పంచ్ సింగిరెడ్డి వెంకట్ రామ్ రెడ్డి, మహిపాల్, గంగస్వామి పాల్గొన్నారు.
‘సారథి’ కథనానికి విశేష స్పందన సాయం చేసేందుకు ముందుకొచ్చిన దాతలు సారథి న్యూస్, రామడుగు: మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి జీవచ్ఛంలా మారి.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామానికి చెందిన చెందిన అంజలి భర్త రాజేశేఖర్కు సాయం చేసేందుకు పలువురు ముందుకొచ్చారు. ‘ఆపదలో ఉన్నం ఆదుకోండి’ శీర్షికన గత సోమవారం ‘సారథిమీడియా’లో వచ్చిన వార్తా కథనానికి పలువురు ముందుకొచ్చారు. సింగపూర్ లో ఉన్న రామడుగు వాసులు తోట శ్రీనివాస్, […]
సారథిన్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడ్డ 337 మంది జర్నలిస్టులకు రూ. 59 లక్షల 30 వేల రూపాయలు ఆర్థికసాయం అందించామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన 256 మందికి 20 వేల రూపాయల చొప్పున, 51 లక్షల 20 వేల రూపాయలు, హోం క్వారంటైన్ లో ఉన్న 81 మంది జర్నలిస్టులకు పదివేల రూపాయల చొప్పున 8 లక్షల 10 వేల రూపాయలను అందిచామన్నారు. జర్నలిస్టులు ఎవరికైనా […]
సారథి న్యూస్, చొప్పదండి: జన్యుపరమైన వ్యాధితో ఇబ్బందులు బాధపడుతున్న ఓ యువతికి సెల్పాయింట్ యూనియన్ సభ్యులు ఆర్థిక సాయం అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన సిరిపురం ప్రసాద్, రూప కూతురు జాహ్నవి డిగ్రీ చదువుతోంది. ఆమె కొంతకాలంగా జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోంది. వైద్యానికి నెలకు రూ.ఆరువేలు ఖర్చవుతున్నది. తల్లిదండ్రులు పేదరికంతో బాధపడుతున్నారు. దీంతో చొప్పదండి సెల్పాయింట్ యూనియన్ బాధిత కుటుంబానికి రూ.ఆరువేలు ఆర్థికసాయం అందించగా.. కానిస్టేబుల్ శ్రీనివాస్ రూ.వెయ్యి ఆర్థికసాయం అందించారు.
సారథి న్యూస్, మహబూబ్ నగర్: పిడుగుపాటుకు గురై ఇటీవల మరణించిన కుటుంబానికి మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం రూ.40వేల చెక్కు, ఇతర సరుకులను అందజేశారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం మాచన్ పల్లి పంచాయతీ పరిధిలోని రోళ్లగడ్డతండాకు చెందిన భీమ్లా నాయక్, సరోజ దంపతులు గతనెల 28న పిడుగుపాటుకు గురై చనిపోయారు. మంత్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.