అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంసెట్ సహా అన్ని రకాల ఎంట్రెన్స్లను వాయిదా వేసింది. కరోనా సమయంలో సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి సూచనలతో ఎంసెట్, ఐసెట్, ఈసెట్, లాసెట్, ఎడ్సెట్, పీజీ సెట్లతో కలిపి మొత్తం 8 సెట్ల ఎగ్జామ్స్ను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం ప్రకటించారు. దీనికి సంబంధించి త్వరలోనే పరీక్షల తేదీలను వెల్లడిస్తామని తెలిపారు. సెప్టెంబర్ మూడవ వారంలో ఎంసెట్ నిర్వహిస్తామని, దీనికి సంబంధించిన పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. డిగ్రీ, […]
ఎవరు అంగీకరించినా.. అంగీకరించకపోయినా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కులప్రాతిపదికననే నడుస్తాయన్నది సుస్పష్టం. గెలుపు ఓటముల్లోనూ కులాల ప్రభావం అధికంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఇక అధికారంలోకి వచ్చినవారు తమ సామాజికవర్గం వారిని అందలం ఎక్కించడం.. ఇతర కులస్థులను ముఖ్యంగా ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్న కులాలకు చెందినవారిపై వివక్ష చూపించడం సర్వసాధారణమే. అయితే రాజ్యాంగబద్ధమైన పదవులను ప్రభుత్వాలు గౌరవించాలి. వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వ్యవహరించాలి. ఇది రాజ్యాంగంలో పొందుపరచిన మౌలిక అంశం. ప్రజాప్రతినిధులు సైతం ఈ నిబంధనను పాటిస్తామంటూ […]
సారథి న్యూస్, విజయవాడ: ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి జూన్ 30 నాటికి ముగిసిందని, మరో మూడునెలల పాటు పెంచుతున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జులై 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొత్త కార్డులను జారీచేయడం లేదా, కరోనా పరిస్థితి ఇలాగే ఉంటే మరోసారి కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టులు ఈ విషయాన్ని గమనించి సంబంధిత జిల్లా సమాచార పౌర […]
సారథి న్యూస్, కర్నూలు: ప్రతి ఒక్కరి అభ్యున్నతే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ కార్యదర్శి మధుకర్ జి, బైరెడ్డి శబరి, రాష్ట్ర కార్యదర్శి హరీశ్ బాబు, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు రామస్వామి, పార్టీ నాయకులతో కలిసి పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఇంటింటికి తిరిగి దేశ ప్రజల కోసం ప్రధాని నరేంద్రమోడీ 2.0 ప్రభుత్వం చేపట్టిన పథకాలను వివరించారు. దేశంలోని ప్రతి […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి 11వేల మార్క్ దాటింది. శుక్రవారం ఒకే రోజు 605 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇతర రాష్ట్రా నుంచి వచ్చిన వారి కేసు 34, ఇతరదేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 11,489కు చేరింది. యాక్టివ్ కేసులు 6,147కు చేరాయి. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారు 5,196 మంది ఉన్నారు. ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కంటైన్ మెంట్ జోన్ లో లాక్ డౌన్ ప్రక్రియను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ జె. నివాస్ ఆదేశించారు. సోమవారం పాతపట్నంలో పర్యటించిన ఆయన స్థానిక తహసీల్దార్ ఆఫీసులో అధికారులతో సమీక్షించారు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరూ ఇళ్లలోనే గృహనిర్బంధంలోనే ఉండాలన్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలని ఆదేశించారు. సమావేశంలో పాలకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి టీవీఎస్ జీ కుమార్, తహసీల్దార్లు పి.రమేష్ బాబు, సురేష్, కాళీప్రసాద్ […]
సారథి న్యూస్, శ్రీకాకుళం : మానవ సమాజ రక్షణకు కలిసికట్టుగా కరోనా మహ్మారిని తరిమేద్దామని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. శనివారం ఆర్ బీ గెస్ట్ హస్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలని కోరారు. రాజకీయాలకు తావు లేకుండా విపత్తును ఎదుర్కోవడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాలను ప్రజలు తప్పకుండా పాటించాలన్నారు.