నేటినుంచి రైతుబంధు నిధులు విడుదల యాసంగి పెట్టుబడి కోసం ఖాతాల్లో జమ 66.61 లక్షల మంది రైతులకు రూ.7,645.66 కోట్లు సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుబంధు సొమ్మును ఈనెల 28వ తేదీ నుంచి నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. యాసంగి పంట పెట్టుబడులకు సంబంధించి నిధులు పంపిణీ చేయనుంది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఏడు విడతల్లో రూ.43,036.63 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమచేశారు. ఈ సీజన్ […]
ఆలయాభివృద్ధి చిరస్థాయిగా ఉంటుంది సీఎం కేసీఆర్ పై బాలయ్య ప్రశంసలు సామాజికసారథి, యాదాద్రిభువనగిరి: యాదాద్రి పునర్నిర్మాణంలో సీఎం కేసీఆర్ చొరవ ప్రశంసనీయమని ఎమ్మెల్యే, నటుడు బాలయ్య కొనియాడారు. సోమవారం ఉదయం అఖండ సినీబృందం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నది. అఖండ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో బాలకృష్ణతో పాటు నటీనటులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్యకు దేవస్థానం అధికారులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయ […]
బీఎస్పీ నకిరేకల్ ఇన్ చార్జి ప్రియదర్శిణి మేడి సమస్యలు పరిష్కరించాలంటూ స్థానికులతో కలసి ధర్నా సామాజిక సారథి, చిట్యాల: నకిరేకల్ నియోజక వర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని, స్థానిక ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఎస్పీ నియోజకవర్గ ఇన్ చార్జి మేడి ప్రియదర్శిణి ఆరోపించారు. చిట్యాలలోని సుందరయ్య నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను ఆమె సోమవారం పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే కాలనీలో సమస్యలు పరిష్కారం కావడంలేదని స్థానిక ప్రజలతో కలిసి ఆమె ధర్నా చేశారు. […]
జూబ్లీహిల్స్లోని ఇంటివద్ద ఉద్రిక్తత ఉదయం నుంచే మోహరించిన పోలీసులు ఎర్రవెల్లి వెళ్లేందుకు ప్రయత్నించగా అదుపులోకి జగిత్యాలలో జీవన్ రెడ్డి, శ్రీధర్బాబు కూడా అరెస్ట్ సామాజికసారథి, హైదరాబాద్: తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రవెల్లికి వెళ్లకుండా జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటివద్దకు ఉదయం నుంచే పోలీసులు చేరుకుని నిర్బంధించారు. దీంతో కాంగ్రెస్కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. సోమవారం ఎర్రవల్లిలో […]
సామజిక సారథి, ములుగు ప్రతినిధి: నిబంధనల ప్రకారమే విద్యాశాఖలో బదిలీలు చేపడుతున్నామని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణాదిత్య తెలిపారు. జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖలో చేపడుతున్న బదిలీలపై సోమవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఖాళీల ఆధారంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపడుతామని చెప్పారు. ఉపాధ్యాయుల జాబితాను సబ్జెక్టు వారిగా తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియను భౌతికంగా నిర్వహించాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్టో) నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా బదిలీల ప్రక్రియ నిర్వహించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పర్వతరెడ్డి, మురళి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తా నుంచి నల్లవెల్లి చౌరస్తా వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట ప్రధాన రహదారిపై ఇటీవల రూ.50 లక్షల నిధులతో నిర్మించిన వీధి వ్యాపారుల షెడ్లను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కుర్మయ్య, మున్సిపాలిటీ చైర్ పర్సన్ కల్పన, కమిషనర్ గోనె అన్వేష్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: అంగన్వాడి టీచర్ల సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, ఆ ఆలోచనను విరమించుకుని నెలకు రూ.26 వేల వేతనం అమలు చేయాలని, పెన్షన్ […]