Breaking News

Day: December 5, 2021

రైల్వే స్టేషన్ లో కొండముచ్చు హల్ చల్

రైల్వే స్టేషన్ లో కొండముచ్చు హల్ చల్

సామాజిక సారథి‌, మధిర: ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్ లో ఓ కొండముచ్చు హల్ చల్ చేస్తోంది. శుక్ర, శనివారాల్లో ఓ కొండముచ్చు 8మందిపై దాడి చేసి గాయపరిచింది. ఓ కొండముచ్చు రైల్వే స్టేషన్ కు వచ్చే ప్రయాణికులతో పాటు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని భయాందోళనకు గురిచేస్తోంది. శుక్రవారం కొండముచ్చు దాడిలో ఐదుగురు గాయపడగా, శనివారం రాత్రి ఓ కానిస్టేబుల్,  రైల్వే స్టేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగిపై దాడి చేయడంతో పట్టాలపై పడి గాయాల పాలయ్యాడు. […]

Read More
పేదల కోసమే సహాయనిధి

పేదల కోసమే సహాయనిధి

ఎమ్మెల్యే ఆరూరి రమేష్​ సామాజిక సారథి, ఐనవోలు: ప్రైవేట్​ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే పేదలను ఆదుకోవడమే సీఎం సహాయనిధి లక్ష్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఐనవోలు మండలంలోని ఫున్నెలు, వనమాల కనిపర్తి గ్రామాల్లో 14 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.11.32లక్షల చెక్కులను శనివారం అందజేశారు. అత్యవసర సమయంలో ప్రైవేట్​ఆస్పత్రుల్లో వైద్యసేవలు పొంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అభాగ్యులు, నిరుపేదలకు అండగా నిలుస్తుందని, కరోనా కాలంలో ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ […]

Read More
ఉనికి చాటుకున్న మావోయిస్టులు

ఉనికి చాటుకున్న మావోయిస్టులు

సామాజిక సారథి, ఏటూరు నాగారం: పీఎల్జీఏ 21వ వార్షిక వారోత్సవాలు డిసెంబర్ 2నుంచి డిసెంబర్10 వరకు జరుపుకోవాలని మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఏజెన్సీ సరిహద్దు ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలతో అడవులను జల్లడ పడుతున్నారు. రహదారులు, గోదావరి పరీవాహక ప్రాంతాలపై డేగ కన్నుతో సోదాలు నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి మావోయిస్టులు వారి ఉనికిని చాటుకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం […]

Read More
అందెల శ్రీరాములుకు సన్మానం

అందెల శ్రీరాములుకు సన్మానం

సామాజిక సారథి, మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మీర్​పేట్ కార్పొరేషన్ లెనిన్ నగర్ లో జరిగిన సత్యనారాయణస్వామి వ్రతపూజా కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్​చార్జ్​అందెల శ్రీరాములు పాల్గొన్నారు. మీర్​పేట్​కార్పొరేటర్ మోడల బాలకృష్ణ కుటుంబసభ్యులు నిర్వహించిన పూజలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అందెలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Read More