హైదరాబాద్: ఈనెల 4న కౌంటింగ్ నిలిచిపోయిన నేరేడ్మెట్ లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. 668 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. తాజా విజయంతో జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 56కు చేరింది. అయితే ఇతర గుర్తులు ఉన్న 544 ఓట్లలో టీఆర్ఎస్కు 278 ఓట్లు వచ్చాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల కౌటింగ్ సందర్భంగా నిలిచిపోయిన నేరేడ్మెట్ డివిజన్ ఓట్ల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలైంది. ఇతర ముద్రలు ఉన్న 544 ఓట్లను కూడా […]
సారథి న్యూస్, మానవపాడు: నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వ్యక్తులకు దోచిపెట్టేందుకు నల్ల చట్టాలను తీసుకొస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. భారత్బంద్కార్యక్రమంలో భాగంగా మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బెంగళూరు– హైదరాబాద్ హైవేను అఖిలపక్ష నాయకులతో కలిసి దిగ్బంధించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు సంబంధించిన మొండిబకాయిలను రద్దుచేసిందన్నారు. నూతన వ్యవసాయ చట్టంలో […]
మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సారథి న్యూస్, మానవపాడు: మూడు రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంట్లో ఆమోదించి రైతులను రోడ్ల పైకి వచ్చేలా చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్సంపత్కుమార్ అన్నారు. మంగళవారం రైతు సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్ కార్యక్రమాన్ని అలంపూర్ నియోజకవర్గంలో చేపట్టారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు రోడ్డుపైనే బైఠాయించి వంటావార్పుతో అక్కడే భోజనాలు చేశారు. ‘మోడీ.. కేడి, బీజేపీ హఠావో.. […]
సారథి న్యూస్, నెట్ వర్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతుగా రైతుసంఘాల పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన భారత్ బంద్ విజయవంతంగా కొనసాగింది. జోగుళాంబ జిల్లా ఉండవల్లి మండలంలోని అలంపూర్ చౌరస్తా సమీపంలోని హైదరాబాద్– బెంగళూర్ హైవే పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రైతులతో కలిసి నిరసన చేపట్టారు. రాష్ట్ర కన్స్యూమర్ ఫోరం చైర్మన్ తిమ్మప్ప, జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య, […]
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మేమున్నామని నిరూపించారు. పేద వధువుకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రానికి చెందిన సుశీలమ్మ మనవరాలు పెళ్లి ఖర్చుల కోసం సంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సమాజసేవా సంస్థ తరఫున వ్యవస్థాపక అధ్యక్షుడు సురేష్ జ్యోషి సహకారంతో బ్రాహ్మణ సమాజసేవా సంస్థ మండలాధ్యక్షుడు రామచంద్రాచారి రూ.21వేలు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు రూ.11వేల ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గం అధ్యక్షుడు కిషన్రావు దేశ్పాండే, జిల్లా […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో తన పొలం నుంచే తెలంగాణ వాదాన్ని వినిపించిన రైతు పనికర మల్లయ్య తన కుమార్తె పెళ్లి ఆహ్వాన పత్రికను తీసుకుని హైదరాబాద్కు వచ్చి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా సోమవారం ప్రగతిభవన్ లో అందజేశారు. వేడుకలకు ముఖ్యమంత్రిని రావాల్సిందిగా కోరగా.. వారు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తాను కోరుకున్న రైతు తెలంగాణను నడిపిస్తున్నారనే సంతోషంతో నాటి ఉద్యమ సారథి సీఎంను తన కూతురు […]
సారథి న్యూస్, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రచురించిన వృక్షవేదం పుస్తకాన్ని సీఎం కె.చంద్రశేఖర్ రావు సోమవారం ప్రగతి భవన్ లో ఆవిష్కరించారు. ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ సంపాదకత్వంలో మామిడి హరికృష్ణ రచించారు. పుస్తకాన్ని రూపొందించిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ను సీఎం కేసీఆర్అభినందించారు. వృక్షాలను ధైర్యంగా భావించే సంస్కృతి మనదని గుర్తుచేశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, […]
సారథి న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో వరద సహాయం కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరద సహాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయని తెలిపారు. బాధితుల వివరాలు, ఆధార్ నంబర్ ధ్రువీకరణ జరుగుతుందని, ఆ తర్వాత వారి అకౌంట్ లోనే వరద సహాయం డబ్బులు జమవుతాయని చెప్పారు. ఈనెల 7వ తేదీ నుంచి సాయం అందని వారికి మళ్లీ […]