Breaking News

Month: December 2020

మర్కుక్ ఠాణా ప్రారంభం

మర్కుక్ ఠాణా ప్రారంభం

సారథి న్యూస్​, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా మర్కుక్ పోలీస్ స్టేషన్ ను హోంశాఖ మంత్రి మహమూద్​అలీ, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు శుక్రవారం ప్రారంభించారు. హోంమంత్రి మహమూద్​ అలీ పోలీస్​ అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, ఫారెస్ట్​కార్పొరేషన్​ చైర్మన్​ వంటేరు ప్రతాప్​రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, టీఆర్​ఎస్​ నాయకులు పాల్గొన్నారు.

Read More
వైభవంగా గోరెటి వెంకన్న కూతురు పెళ్లి

వైభవంగా గోరెటి వెంకన్న కూతురు పెళ్లి

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్​లో శుక్రవారం జరిగిన ప్రజావాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న కూతురు వివాహానికి సీఎం కె.చంద్రశేఖర్​రావు ముఖ్య​అతిథిగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, మున్సిపల్​, ఐటీశాఖ మంత్రి కె. తారక రామారావు, మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి, నాగర్​కర్నూల్​ ఎంపీ పోతుగంటి రాములు, ఎల్​బీ నగర్​ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్​రెడ్డి, నిజామాబాద్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎంపీ మందా జగన్నాథం తదితరులు హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Read More
చకచకా పల్లె ప్రగతి పనులు

చకచకా పల్లె ప్రగతి పనులు

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట మండలం బూరుగుపల్లిలో శుక్రవారం పల్లె ప్రకృతి వనం పనులను సర్పంచ్​ సరిత మల్లేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రకృతివనం చుట్టూ ఫెన్సింగ్​ చుట్టి తొందరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రమావత్ రాజు, ఈజీఎస్ ఏపీవో సుధాకర్, టీఎస్ సుభాష్, విఠల్​ నాయక్​, విజయ్, కోటయ్య పాల్గొన్నారు.పల్లె ప్రగతి పనులపై ఆరామండలంలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర […]

Read More
మెగా పెళ్లిసందడి

మెగా పెళ్లిసందడి

నటుడు నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో కుటుంబసభ్యుల సమక్షంలో బుధవారం సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు నిహారిక మెడలో జొన్నలగడ్డ వెంకటచైతన్య మూడుముళ్లు వేశాడు. చైతన్యతో ఏడడుగులు నడిచిన కొణిదెల నిహారిక కాస్తా జొన్నలగడ్డ ఇంటి కోడలు అయింది. రాజస్థాన్ లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్ లో ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నూతన వధూవరులు సంప్రదాయ వస్త్రాలతో ముస్తాబై […]

Read More
సిద్దిపేటలో కేసీఆర్​నగర్​

సిద్దిపేటలో కేసీఆర్​ నగర్​

సారథి న్యూస్, హైదరాబాద్: సిద్దిపేటలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వివిధ అభివృద్ధి పనులకు గురువారం ప్రారంభోత్సవం చేయనున్నారు. సిద్దిపేటలో నిర్మించిన డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్ల సముదాయానికి కేసీఆర్ నగర్ గా నామకరణం చేయబోతున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ.. రూ.163 కోట్ల వ్యయంతో 2,460 ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. తొలి విడతలో 1, 341 ఇళ్లు, రెండో విడత వెయ్యి ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ […]

Read More
ఘనంగా సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ ​జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియాగాంధీ 74వ పుట్టినరోజు వేడుకలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. సోనియాగాంధీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత అని పార్టీ పట్టణాధ్యక్షుడు నసిరుద్దీన్ అన్నారు. ఆమెకు రాష్ట్రం రుణపడి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో కల్వకుంట సొసైటీ మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, మహేందర్ గౌడ్, హబీబ్, సాధిక్, స్వామి, శాదుల్ పాల్గొన్నారు.

Read More
ములుగు కలెక్టరేట్ కు కొత్త వెలుగు

ములుగు కలెక్టరేట్ కు కొత్త వెలుగు

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లా కలెక్టరేట్ సుందరీకరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కార్యాలయం చుట్టూ గడ్డి పరిచి అందమైన పూలమొక్కలను నాటారు. ఆడిటోరియం చుట్టూ మొక్కలు నాటారు. వాహనాల పార్కింగ్ కోసం షెడ్డు నిర్మాణం కూడా పూర్తయింది. టాయిలెట్ బ్లాక్ నిర్మాణం చేపట్టారు. నీటి ట్యాంకు, పెద్ద సంప్​నిర్మాణం పూర్తయింది. వివిధ అవసరాలకు వచ్చే ప్రజానీకానికి కార్యాలయ ఆవరణలో వెయిటింగ్​హాలును ​ఏర్పాటు చేశారు. కార్యాలయం ప్రహరీ ఎత్తు పెంచి, భద్రతను మరింత పటిష్టం చేస్తున్నారు. భద్రత, […]

Read More
బడుగు బలహీనవర్గాల అభివృద్ధే ధ్యేయం

బడుగు బలహీనవర్గాల అభివృద్ధే ధ్యేయం

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని ఎదగాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో పెద్దశంకరంపేట మండలంలోని మార్కెట్ పల్లి గ్రామానికి చెందిన యాదగిరికి ఆస్పత్రి ఖర్చుల కోసం రూ.15వేల సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయరామరాజు, సర్పంచ్ రమ్యఅశోక్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు దత్తు తదితరులు పాల్గొన్నారు.

Read More