Breaking News

Month: November 2020

తుంగభద్ర పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు

తుంగభద్ర పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు

సారథి న్యూస్, అలంపూర్ ​(జోగుళాంబ గద్వాల): ఈనెల 20వ తేదీ నుంచి జరిగే తుంగభద్ర నది పుష్కరాల నేపథ్యంలో ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ సోమవారం అలంపూర్ లోని పుష్కర ఘాట్ ను, జోగుళాంబ ఆలయాల సముదాయాన్ని సందర్శించారు. పుష్కర ఘాట్ ప్రాంతంలో వీఐపీ పార్కింగ్, సాధారణ భక్తుల వాహనాలకు పార్కింగ్, అలాగే వృద్ధులు, దివ్యాంగులకు కల్పించే ఉచిత పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. అమ్మవారి ఆలయం, స్వామివారి ఆలయంలోకి వచ్చే మార్గాలు, బయటకు వెళ్లే మార్గాలను గుర్తించి […]

Read More
హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేయండి

హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేయండి

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల జిల్లా: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ​ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్​ చేశారు. సోమవారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు అమరవాయి గ్రామంలో మాజీ ఎంపీపీ జయమ్మ ప్రకాష్ గౌడ్ ​నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయలేదని మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుపోతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తుంగభద్ర నదికి […]

Read More
దళిత సర్పంచ్​పై దాడిచేసిన వారికి శిక్షించాలి

దళిత సర్పంచ్​పై దాడిచేసిన వారిని శిక్షించాలి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: దళిత సర్పంచ్​పై దాడిచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దళిత బహుజన హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సంగమేశ్వర్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు తుకారాం, దళిత సంఘాల జేఏసీ నాయకులు విజయ్​కుమార్​ మాట్లాడుతూ.. చిలపల్లి గ్రామంలో దళిత సర్పంచ్​పై దాడిచేయడం హేయమైన చర్య అని అన్నారు. రాష్ట్రంలో దళిత ప్రజాప్రతినిధులపై రాజకీయ నాయకులు దాడిచేస్తుంటే సామాన్యులకు రక్షణ ఎక్కడుందని ప్రశ్నించారు. […]

Read More
హక్కుల కోసం కలిసిరావాలి

హక్కుల కోసం కలిసిరావాలి

పాలకొండ: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని వైఎస్సార్​సీపీ, టీడీపీ ప్రశ్నించాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల కోసం కలిసి పోరాటానికి సిద్ధంకావాలని సీపీఎం శ్రీకాకుళం జిల్లా పాలకొండ కమిటీ కార్యదర్శి దావాల రమణారావు పిలుపునిచ్చారు. రాజకీయ ప్రచార యాత్ర సందర్భంగా పాలకొండలో ఇంటింటా కరపత్రాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో దూసి దుర్గారావు, రాము, పి.బాలు, గిరి, సీహెచ్ ఈశ్వరరావు, రాజా, ఏడుకొండలు పాల్గొన్నారు.

Read More
కరెంట్ ఆఫీసర్లు సతాయిస్తుండ్రు

కరెంట్ ఆఫీసర్లు సతాయిస్తుండ్రు

సారథి న్యూస్, నారాయణఖేడ్, కంగ్టి: ప్రమాదాలకు నిలయంగా ఇంటిపై వేలాడుతున్న వైర్లను తొలగించాలని, సంబంధిత కరెంట్ ​ఆఫీసర్లకు విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దెగుల్ వాడీ గ్రామస్తులు ఆదివారం మండల కేంద్రంలోని విద్యుత్​సబ్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. స్తంభాల కింద వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని ఏఈ మోతిరాంకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని సర్పంచ్ చంద్రవ్వ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా […]

Read More
బైడెన్​కు జైకొట్టిన అమెరికన్లు

బైడెన్​కు జైకొట్టిన అమెరికన్లు

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ అభ్యర్థి జోసెఫ్‌ రాబినెట్‌ బైడెన్‌ జూనియర్‌ 46వ అధ్యక్షుడిగా విజయం సాధించారు. ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలి మహిళ, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ రికార్డు సృష్టించారు. ఎలక్టోరల్‌ కాలేజీలోని 538 ఓట్లకు గాను మేజిక్‌ ఫిగర్‌ 270 కాగా, 284 ఓట్లు బైడెన్‌ కు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 214 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించి పరాజయం పొందారు. అధ్యక్షుడిగా […]

Read More
కేంద్రం నుంచి పైసా తీసుకొచ్చారా?

కేంద్రం నుంచి పైసా తీసుకొచ్చారా?

బీజేపీ ఎంపీలను ప్రశ్నించిన మంత్రి కె.తారకరామారావు సారథి న్యూస్, హైదరాబాద్: మానవ తప్పిదాలతో చెరువులు, నాలాలు కబ్జాకు గురికావడంతో ఇటీవల కురిసిన భారీవర్షాలకు విశ్వనగరం హైదరాబాద్​ నీట మునిగిందని మున్సిపల్ ​శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నా ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ​ముందుచూపుతో నష్టాన్ని నివారించగలిగామని అన్నారు. వరదల సమయంలో తక్షణ రక్షణ […]

Read More
రైతాంగాన్ని ఆదుకోవాలి

రైతాంగాన్ని ఆదుకోవాలి

సారథి న్యూస్, ఖ‌మ్మం: ప్రత్యేక రాష్ట్రంలో సాగునీటి రంగం పూర్తిగా అధోగతి పాలైందని సీఎల్పీ నేత మల్లు భ‌ట్టి విక్రమార్క విమర్శించారు. సీఎల్పీ సార‌థ్యంలోనూ ప్రాజెక్టును ప‌రిశీలించేందుకు ఈనెల 18న కల్వకుర్తికి వెళ్తున్నట్లు భట్టి చెప్పారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఈనెల 11న ఖమ్మం జిల్లాలో ట్రాక్టర్లతో భారీర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వర్​రావు, ఖ‌మ్మం న‌గ‌ర […]

Read More