Breaking News

Month: July 2020

శ్రీశైలానికి కొనసాగుతున్నవరద

శ్రీశైలానికి కొనసాగుతున్నవరద

జూరాల 11 గేట్లు ఎత్తివేత కొనసాగుతున్న వరద ఉధృతి సారథి న్యూస్​, కర్నూలు: ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం డ్యాంకు వరద ఉధృతి కొనసాగుతోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పిత్తికి నీటిని దిగువకు వదులుతున్నారు. గురువారం జూరాల ప్రాజెక్టు స్పిల్‌ వే నుంచి 73,502 క్యూసెక్కులు, పవర్‌ హౌస్‌ ద్వారా 33,282 క్యూసెక్కులను మొత్తం 1,06,784 క్యూసెక్కులను కిందకు వదిలారు. 11 […]

Read More
ఉస్మానియాను సందర్శించిన మంత్రి తలసాని

ఉస్మానియాను సందర్శించిన మంత్రి తలసాని

సారథి న్యూస్​, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లోపలికి వర్షపు నీరు వచ్చిన నేపథ్యంలో గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. అక్కడ బిల్డింగ్ మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హాస్పిటల్ ప్రాంగణంలో తిరిగి పర్యవేక్షించారు. మంత్రి హాస్పిటల్ వెలుపల పేషెంట్ వార్డులను పర్యవేక్షించారు వైద్యులతో పేషంట్ స్థితిగతులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య అధికారులు సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్లు తదితరులు మంత్రి వెంబడి […]

Read More

నిత్యావసర వస్తువులు పంపిణీ

సారథి న్యూస్​, రామడుగు: కరోనా లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఓ స్వచ్చందసంస్థ ఆదుకుంది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని జెబెల్​ అలీ ప్రాంతంలోని లేబర్​ క్యాంపు​లో తలదాచుకుంటున్న పేదలకు ఎల్లాల శ్రీనన్న సేవాసమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సేవాసమితి ఉపాధ్యక్షుడు బాలు బొమ్మిడి, మీడియా కోఆర్డినేటర్​ చిలుముల రమేశ్​, ముఖ్య సలహాదారులు మోహన్ రెడ్డి, అశోక్ జంగం, సోషల్ మీడియా కోర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్, మాల్యాల, జెబెల్ […]

Read More

బీజేపీని బలోపేతం చేద్దాం

సారథి న్యూస్, రామడుగు: భారతీయ జనతాపార్టీని బలోపేతం చేద్దామని కరీంనగర్​ జిల్లా రామడుగు మండలాధ్యక్షుడు కరుణాకర్​రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్​ జిల్లా రామడుగు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు ఒంటెల కరుణాకర్​రెడ్డి, ఉపాధ్యక్షుడిగా అంబటి నర్సింగరావు, కారుపకల అంజి, ఏముండ్ల కుమార్, తారకొండ ఐలయ్య, ప్రధానకార్యదర్శులుగా తోట, కృష్ణ, రమేశ్​, చంద్రమౌళి, కార్యదర్శి గుంట అశోక్, చింతాపంటి అశోక్, సిరిమల్ల మదన్మోహన్, దమ్మయ్య భూపతి, కోశాధికారి గంట్లా శరత్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా స్వామి, శ్రీధర్, కనకయ్య, […]

Read More

రైతుల కోసం వేలకోట్లు

సారథి న్యూస్​, హుస్నాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల కోసం వేలకోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్​కుమార్​ పేర్కొన్నారు. గురువారం హుస్నాబాద్, అక్కన్నపేట మండలం పందిల్ల, జనగాం గ్రామాల్లో రైతు వేదికలకు భూమి పూజ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి వేల కోట్లు వెచ్చిస్తున్నారన్నారు. దేశానికే వెన్నెముకయిన అన్నదాతల్లో నూతన వ్యవసాయ విధానాలు అమలు కావడానికి ఈ వేదికలు తొడ్పతయన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీపీలు మానన, లక్ష్మి, జడ్పీటీసీలు […]

Read More
బీజేపీ డిమాండ్​

దవాఖాన ఎప్పడు కడతరు

సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్​లో 50 పడకల దవాఖానకు ఎప్పడు కడతారని బీజేపీ కౌన్సిలర్​ దొడ్డి శ్రీనివాస్​ ప్రశ్నించారు. గురువారం ఆయన కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​లో మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్​లో 50 పడకల దవాఖాన కడతామని మూడేండ్ల క్రితమే చెప్పినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదన్నారు. ప్రజలు ఏం ఇబ్బంది వచ్చినా దూరప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు శంకర్, ప్రభాకర్ రెడ్డి, సంతోష్, విద్యాసాగర్, వేణుగోపాల్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Read More
స్కూళ్ల ఓపెనింగ్ పై త్వరలోనే నిర్ణయం

స్కూళ్ల ఓపెనింగ్ పై త్వరలోనే నిర్ణయం

విద్యావేత్తలు, విషయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుందాం విద్య పేరుతో జరుగుతున్న దోపిడీని అరికడదాం యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాలు పాటించాలి ఆగస్టు 17నుంచి ఇంజనీరింగ్ విద్యాసంవత్సరం విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, హైదరాబాద్: విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసేందుకు దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలుచేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. స్కూళ్లను ప్రారంభించే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు […]

Read More
వరవరరావుకు కరోనా పాజిటివ్​

వరవరరావుకు కరోనా పాజిటివ్​

సారథిన్యూస్​, హైదరాబాద్: ​ విప్లవరచయిత, విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ముంబైలోని సెయింట్​ జార్జ్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ప్రధాని మోడీ హత్యకు కుట్రపన్నారనే కేసులో వరవరరావును ముంబై పోలీసులు 2018లో అరెస్ట్​ చేశారు. అనంతరం ఈ కేసును ఎన్​ఐఏకు (నేషనల్​ ఇన్విస్టిగేషన్​ ఏజెన్సీ) అప్పగించారు. ముంబైలోని తలోజా జైలులో ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో […]

Read More