సారథిన్యూస్, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లాలో కరోనా అంతకంతకూ విస్తరిస్తున్నది. తాజాగా 13 కొత్తకేసులు నమోదైనట్టు డీఎంహెచ్వో సుధాకర్ లాల్ తెలిపారు. నాగర్కర్నూల్ పట్టణంలో ఇటీవల కరోనాతో మృతిచెందిన విలేకరి సోదరికి, అతని కోడలుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. నాగర్కర్నూల్ మండలం పెద్దాపూర్కు చెందిన ఓ మహిళకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని ఓ దవాఖానలో డయాలసిస్ చేయించుకుంటున్నది. తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లిలో మరో ముగ్గురికి కరోనా సోకింది. అచ్చంపేట పట్టణంలో నలుగురికి, బల్మూర్ మండలం […]
సారథిన్యూస్, ఖమ్మం: మావోయిస్టుల పేరుతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమంది యువకులు ఓ ముఠాగా ఏర్పడి మావోయిస్టుల మంటూ సింగరేణి మహాలక్ష్మి క్యాంప్ హెచ్ఆర్ మేనేజర్కు ఫోన్చేసి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో మేనేజర్ వారికి డబ్బులు ఇచ్చాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదుచేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు సదురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
సారథిన్యూస్, గోదావరిఖని: సింగరేణి ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ స్పెషల్ ఇన్సెంటివ్, ప్రత్యేక ప్యాకేజీ చెల్లించాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు సింగరేణి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కడారి సునీల్, రీజియన్ కార్యదర్శి శనిగల శ్రీనివాస్, నగర అధ్యక్షుడు శనిగరపు చంద్రశేఖర్, ఏఐటీయూసీ సింగరేణి ఏరియా ఆసుపత్రి విభాగం ఏఐటీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు దుర్గాప్రసాద్, […]
ఓ వైపు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం. మరోవైపు పార్టీ గుర్తింపుపై కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు, ఇంకోపక్క రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై హైకోర్టు వ్యాఖ్యలు. వీటితోనే జగన్ సర్కారు సతమతమవుతుంటే.. ఇప్పుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సీఎంవో మాజీ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పీవీ రమేష్ వ్యాఖ్యలు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. శుక్రవారం ఆయన ట్వీట్ చేసిన అంశాలు ఏపీలోని రాజకీయ, అధికారవర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి. […]
సావిత్రి ఫేమ్ నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వైజయంతి సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణే నటించనున్నది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ట్విట్టర్లో తెలియజేశాడు. టాలీవుడ్లో దీపికా తొలిసారి నటిస్తున్నారు. ‘రాజు స్థాయికి సరిపోయే రాణిని తేవాలి కదా, అందుకే చాలా ఆలోచించి దీపికాను ఎంపికచేశాం. ఇక పిచ్చెక్కిద్దాం’ అంటూ నాగ్అశ్విన్ ట్వీట్ చేశారు. ఈ […]
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. మోదీ దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ చురుకుగా ఉంటూ రాజకీయ, పాలనాపరమైన విషయాలను ప్రజలతో పంచుకుంటారు. తాజాగా ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతాలో 60 మిలియన్ల (6కోట్లు) ఫాలోవర్స్ మైలు రాయిని చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఫాలోవర్స్ను కలిగి ఉన్న రాజకీయ నాయకుల్లో మోదీ […]
జంషడ్పూర్: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని ఓ విద్యార్థిని నిరూపించింది. జార్ఘండ్ రాష్ట్రం జంషడ్పర్కు చెందిన నందితా హరిపాల్ సీబీఎస్ఈ 12 వతరగతిలో ని ఆర్ట్స్ విభాగంలో 83.8 శాతం మార్కులు సాధించి టాపర్గా నిలిచింది. నందిత తండ్రి టైలర్గా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారి కుటుంబం పేదరికంలో మగ్గుతున్నది. కూతురు నందిత జంషడ్పూర్ ఉమెన్స్ కళాశాలలో విద్యనభ్యసించింది. ‘నేను టాపర్గా నిలుస్తానని కలలో కూడా ఊహించలేదు. ఫలితాలు చూసి నాతోపాటు కుటుంబసభ్యులు ఎంతో సంతోషించారు. నేను […]
జైపూర్: రాజస్థాన్ రాజకీయాలు రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. సీఎం అశోక్ గెహ్లాట్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. సచిన్ పైలట్కు అనుకూలంగా ఉన్న 19 మంది ఎమ్మెల్యేలపై ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేసింది. మరోవైపు అశోక్గెహ్లాట్కు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్ జైపూర్లోని ఫెయిర్మౌంట్లో ఉంచింది. ఈ క్రమంలో ఆదివారం సరదాగా కొందరు ఎమ్మెల్యేలు అంత్యాక్షరి ఆడుతూ కనిపించారు. మరికొందరు తంబోలా ఆడుతూ, టీవీ చూస్తూ […]