సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రాంగోపాల్వర్మ.. తాజాగా విడుదల చేసిన ‘పవర్స్టార్ ’ యూట్యూబ్లో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. దీనిపై అతడు ఊహించినట్టుగానే వివాదం రాజుకున్నది. కొంతకాలంగా కామ్గా ఉన్న పవన్కల్యాణ్ అభిమానులు ట్రైలర్ రిలీజ్కాగానే రెచ్చిపోయారు. సోషల్మీడియాలో ఆర్జీవీపై కామెంట్లు మెదలు పెట్టారు. మరోవైపు పవన్కల్యాన్ను అభిమానించే యువనటుడు నిఖిల్ ‘శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహాశిఖరం తలతిప్పి చూడదు. మీకు అర్థమైందిగా’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ […]
ఆర్జీవీకి కౌంటర్గా పవన్కల్యాణ్ అభిమాని, బిగ్బాస్ ఫేం నూతన్నాయుడు పరాన్నజీవి అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం అతడు వివాదస్పద నటి శ్రీరెడ్డిని అప్రోచ్ అయ్యాడట. అందుకు ఆమె నో చెప్పినట్టు సమాచారం. శ్రీరెడ్డి అంతకుముందే పలుమార్లు పవన్కల్యాణ్పై నోరుపారేసుకున్న విషయం తెలిసిందే. దీంతో పవన్కల్యాన్ అభిమానులు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పరాన్నజీవి చిత్రంలోనూ తన పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండటంతోనే ఆమె నటించేందుకు ఒప్పుకోలేదని టాక్. కాగా […]
సారథిన్యూస్, రామడుగు: కరోనా మహమ్మారి మారుమూల పట్టణాలకు పాకింది. తాజాగా కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నది. బుధవారం నుంచి 4రోజుల పాటు పట్టణంలో సంపూర్ణ లాక్డౌన్ పాటించాలని గ్రామపంచాయతీ పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే కిరాణా దుకాణాలు తెరుస్తామని ఆ సమయంలోనే సరుకులు కొనుగోలు చేయాలని పంచాయతీ పేర్కొన్నది. నిబంధనలు అతిక్రమించినవారికి […]
లక్నో: ఉత్తరప్రదేశ్లో నడిరోడ్డులో ఒక జర్నలిస్ట్పై దుండగులు కాల్పులు జరిపారు. కొద్దిరోజుల క్రితం తన మేనకోడలిని వేధించారని సదరు జర్నలిస్టు ఫిర్యాదు చేశాడు. దీంతో కక్ష పెంచుకున్న ఆకతాయిలు కాల్పులు జరిపిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో విక్రమ్ జోషి ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విక్రమ్ తన కూతురుతో కలిసి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆకస్మికంగా కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధిన దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ […]
ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. ఇకనుంచి ప్రజలు రేషన్ కోసం దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. నేరుగా ప్రభుత్వమే ఇంటింటికీ రేషన్ సరుకులను పంపిణీ చేస్తుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ‘ముఖ్యమంత్రి ఘర్ఘర్ రేషన్ యోజన’ పథకం కింద రేషన్ను పంపిణీ చేయనున్నారు. ఇంటింటికి ప్రభుత్వమే రేషన్ సరుకులను పంపిణీ చేయాలన్న ప్రజల చిరకాల కోరికను తాము నెరవేర్చామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
సంచలన దర్శకుడు ఆర్జీవీకి చుక్కెదురైంది. రూ. 25 చెల్లించి పవర్స్టార్ ట్రైలర్ను చూడాలంటూ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్కు కొంతమంది టిక్కెట్లు కూడా కొన్నారు. కాగా ట్రైలర్ను అఫిషియల్గా రిలీజ్ చేయకముందే కొందరు ఇంటర్నెట్లో లీక్చేశారు. నిజానికి బుధవారం ఉదయం 11:00 గంటలకు ట్రైలర్ విడుదల కావాల్సివుంది. ట్రైలర్ అంతకంటే ముందే నెట్టింట్లో విడుదలైంది. విడుదలకు ముందే లీకు కావడంతో వర్మ విధిలేక ట్రైలర్ ని ఫ్రీగా యూటూబ్లో విడుదల చేశారు. ట్రైలర్ కోసం […]
రెండు వారాలుగా టాలీవుడ్లో ఎక్కడ విన్నా ఈ వార్తే వినిపిస్తోంది. ఏమిటంటారా? మహేష్బాబు, ఎన్టీఆర్ కలిసి నటిస్తారని. ఒక్కోసారి అది నిజం కావొచ్చని కూడా అంటున్నారు ఫిల్మ్నగర్ సర్కిల్స్లో.. ఎందుకంటే ఇప్పుడు స్టార్ హీరోలంతా తమ వే మార్చుకుని మల్టీస్టారర్గా నటించేందుకు ముందుకొస్తున్నారు కాబట్టి. మహేష్, ఎన్టీఆర్ తో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్, రామ్చరణ్ కలయికతో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న […]
భువనేశ్వర్: లాక్డౌన్ కాలంలో పనులు లేక ఇళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డ వలస కూలీలకు బాలీవుడ్ నటుడు సోనూసూద్ సాయం చేసి ఆదుకున్నారు. వేలాది మందికి సొంత ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేసి ఊళ్లకు పంపి తన పెద్ద మనసును చాటుకున్నారు. దూరం వెళ్లాల్సిన వాళ్లకి ఏకంగా ఫ్లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయనకు వేలాది మంది అభిమానులు ఏర్పాడ్డరు. కాగా, సోనూసూద్ సాయంతో కేరళ నుంచి ఒడిశాకు చేరుకున్న ప్రశాంత్ అనే వలస కార్మికుడు […]