Breaking News

Month: July 2020

అంతా వర్మ అనుకున్నట్టే..

సంచలనాలకు కేరాఫ్​ అడ్రస్​ అయిన దర్శకుడు రాంగోపాల్​వర్మ.. తాజాగా విడుదల చేసిన ‘పవర్​స్టార్​ ’ యూట్యూబ్​లో ఓ రేంజ్​లో వైరల్​ అవుతోంది. దీనిపై అతడు ఊహించినట్టుగానే వివాదం రాజుకున్నది. కొంతకాలంగా కామ్​గా ఉన్న పవన్​కల్యాణ్​ అభిమానులు ట్రైలర్​ రిలీజ్​కాగానే రెచ్చిపోయారు. సోషల్​మీడియాలో ఆర్జీవీపై కామెంట్లు మెదలు పెట్టారు. మరోవైపు పవన్​కల్యాన్​ను అభిమానించే యువనటుడు నిఖిల్​ ‘శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహాశిఖరం తలతిప్పి చూడదు. మీకు అర్థమైందిగా’ అంటూ ట్వీట్​ చేశాడు. ఈ ట్వీట్​ […]

Read More

‘పరాన్నజీవి’కి నో చెప్పిన శ్రీరెడ్డి

ఆర్జీవీకి కౌంటర్​గా పవన్​కల్యాణ్ అభిమాని, బిగ్​బాస్​ ఫేం నూతన్​నాయుడు పరాన్నజీవి అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం అతడు వివాదస్పద నటి శ్రీరెడ్డిని అప్రోచ్​ అయ్యాడట. అందుకు ఆమె నో చెప్పినట్టు సమాచారం. శ్రీరెడ్డి అంతకుముందే పలుమార్లు పవన్​కల్యాణ్​పై నోరుపారేసుకున్న విషయం తెలిసిందే. దీంతో పవన్​కల్యాన్​ అభిమానులు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పరాన్నజీవి చిత్రంలోనూ తన పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండటంతోనే ఆమె నటించేందుకు ఒప్పుకోలేదని టాక్​. కాగా […]

Read More
కరోనాతో ఏడుగురు మృతి

రామడుగులో కరోనా కల్లోలం

సారథిన్యూస్, రామడుగు: కరోనా మహమ్మారి మారుమూల పట్టణాలకు పాకింది. తాజాగా కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో రెండు కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనట్టు వైద్య అధికారులు వెల్లడించారు. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నది. బుధవారం నుంచి 4రోజుల పాటు పట్టణంలో సంపూర్ణ లాక్​డౌన్​ పాటించాలని గ్రామపంచాయతీ పిలుపునిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే కిరాణా దుకాణాలు తెరుస్తామని ఆ సమయంలోనే సరుకులు కొనుగోలు చేయాలని పంచాయతీ పేర్కొన్నది. నిబంధనలు అతిక్రమించినవారికి […]

Read More

జర్నలిస్టుపై కాల్పులు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నడిరోడ్డులో ఒక జర్నలిస్ట్‌పై దుండగులు కాల్పులు జరిపారు. కొద్దిరోజుల క్రితం తన మేనకోడలిని వేధించారని సదరు జర్నలిస్టు ఫిర్యాదు చేశాడు. దీంతో కక్ష పెంచుకున్న ఆకతాయిలు కాల్పులు జరిపిఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్​లోని ఘజియాబాద్​లో విక్రమ్​ జోషి ఓ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విక్రమ్​ తన కూతురుతో కలిసి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆకస్మికంగా కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధిన దృశ్యాలు దగ్గరలో ఉన్న సీసీ […]

Read More

ఢిల్లీలో ఇంటికే రేషన్​

ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకున్నది. ఇకనుంచి ప్రజలు రేషన్​ కోసం దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. నేరుగా ప్రభుత్వమే ఇంటింటికీ రేషన్​ సరుకులను పంపిణీ చేస్తుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ‘ముఖ్యమంత్రి ఘర్​ఘర్​ రేషన్​ యోజన’ పథకం కింద రేషన్​ను పంపిణీ చేయనున్నారు. ఇంటింటికి ప్రభుత్వమే రేషన్​ సరుకులను పంపిణీ చేయాలన్న ప్రజల చిరకాల కోరికను తాము నెరవేర్చామని సీఎం అరవింద్​ కేజ్రీవాల్ చెప్పారు.

Read More

పవర్​స్టార్​ ట్రైలర్​ లీక్​ చేసిందెవరు?

సంచలన దర్శకుడు ఆర్జీవీకి చుక్కెదురైంది. రూ. 25 చెల్లించి పవర్​స్టార్​ ట్రైలర్​ను చూడాలంటూ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్​కు కొంతమంది టిక్కెట్లు కూడా కొన్నారు. కాగా ట్రైలర్​ను అఫిషియల్​గా రిలీజ్​ చేయకముందే కొందరు ఇంటర్​నెట్​లో లీక్​చేశారు. నిజానికి బుధవారం ఉదయం 11:00 గంటలకు ట్రైలర్ విడుదల కావాల్సివుంది. ట్రైలర్ అంతకంటే ముందే నెట్టింట్లో విడుదలైంది. విడుదలకు ముందే లీకు కావడంతో వర్మ విధిలేక ట్రైలర్ ని ఫ్రీగా యూటూబ్​లో విడుదల చేశారు. ట్రైలర్ కోసం […]

Read More
వాళ్లిద్దరూ కలిస్తే

వాళ్లిద్దరూ కలిస్తే

రెండు వారాలుగా టాలీవుడ్​లో ఎక్కడ విన్నా ఈ వార్తే వినిపిస్తోంది. ఏమిటంటారా? మహేష్బాబు, ఎన్టీఆర్​ కలిసి నటిస్తారని. ఒక్కోసారి అది నిజం కావొచ్చని కూడా అంటున్నారు ఫిల్మ్​నగర్​ సర్కిల్స్​లో.. ఎందుకంటే ఇప్పుడు స్టార్ హీరోలంతా తమ వే మార్చుకుని మల్టీస్టారర్​గా నటించేందుకు ముందుకొస్తున్నారు కాబట్టి. మహేష్, ఎన్టీఆర్‌ తో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావాల‌ని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ క‌ల‌యిక‌తో రాజ‌మౌళి ‘ఆర్ఆర్ఆర్‌’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న […]

Read More
సోనూసూద్‌.. మా దేవుడు

సోనూసూద్‌.. మా దేవుడు

భువనేశ్వర్‌‌: లాక్‌డౌన్‌ కాలంలో పనులు లేక ఇళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డ వలస కూలీలకు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ సాయం చేసి ఆదుకున్నారు. వేలాది మందికి సొంత ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేసి ఊళ్లకు పంపి తన పెద్ద మనసును చాటుకున్నారు. దూరం వెళ్లాల్సిన వాళ్లకి ఏకంగా ఫ్లైట్లు ఏర్పాటు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయనకు వేలాది మంది అభిమానులు ఏర్పాడ్డరు. కాగా, సోనూసూద్‌ సాయంతో కేరళ నుంచి ఒడిశాకు చేరుకున్న ప్రశాంత్‌ అనే వలస కార్మికుడు […]

Read More