సారథి న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ ఎల్బీనగర్లోని శాతవాహన కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి కన్న కొడుకుని హత్య చేసి ఆత్మహత్య చేసుకుంది. భువనగిరి జిల్లా వలిగొండ మండలం వరకట్పల్లికి చెందిన శంకరయ్య, మమత దంపతులు కొంత కాలంగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాతవాహన కాలనీలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కొడుకు రియాన్ష్(3) ఉన్నాడు. సోమవారం రాత్రి మమత కుమారుడి చేతిని గాయపరిచి అనంతరం మూడంతస్తుల భవనం పైనుంచి దూకి అత్మహత్యకు పాల్పడింది. తీవ్ర […]
వర్మకు జరిమాన విధించిన తెలంగాణ ప్రభుత్వం
తనపై తప్పుడు వార్తలు రాస్తే కేసు పెడతానంటూ శ్రద్ధాదాస్ మీడియాను హెచ్చరించారు. శ్రద్ధాదాస్ బిగ్బాస్ సీజన్ 4లో పాల్గొనబోతుందంటూ ఇటీవల ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పలు తెలుగు వెబ్సైట్లలోనూ ఈ వార్తను ప్రచురించారు. దీంతో శ్రద్ధాదాస్ ఫైర్ అయ్యారు. ‘బిగ్బాస్ నిర్వాహకులు ఎవరూ తనను సంప్రదించలేదు. నేను కూడా బిగ్బాస్లో చేరతానని ఎప్పడూ ప్రకటించలేదు. అయినా ఇటువంటి తప్పడు వార్తలు ఎందుకు ప్రచురించారు’ అంటూ ఆమె ఫైర్ అయ్యారు. మరోసారి తనపై తప్పుడు […]
సారథి న్యూస్ : రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే సాధారణం కంటే వర్షపాతం నమోదైంది. పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రాయలసీమలో ఈ సారి వర్షాల తీవ్రత అధికంగానే ఉంది. కాగా నేటి నుంచి అయిదు రోజుల పాటు తెలంగాణ, కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ రోజు, రేపు ఉరుములతో కూడిన భారీ […]
సారథి న్యూస్, కోదాడ : సూర్యాపేట జిల్లా సాలార్జంగ్పేటకు చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్ రావడంతో కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరాడు. కానీ పరిస్థితి విషమించి సోమవారం ఆస్పత్రిలోనే చనిపోవడంతో అతడి మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి బంధువులు ముందుకు రాకపోవడంతో మునిసిపల్ కమిషనర్ ఆదేశానుసారం అధికారులు, సిబ్బంది సహాయంతో రాత్రి 8 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ దండు శ్రీను , హెల్త్ అసిస్టెంట్ మేరిగ అశోక్, జవాన్లు సిబ్బంది […]
సారథిన్యూస్, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన అయిన ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు రాజీనామా చేశారు. తాను కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నానని అందుకే రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు. కాగా ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో జరిగిన పరిణామాల వల్లే అతడు రాజీనామా చేసినట్టు సమాచారం. తెలంగాణలోని పలువురు వైద్యులు కరోనా పరిణామాలతో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల జూనియర్ డాక్టర్లు ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. […]
కిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచమైన నటుడు శ్యామ్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని కోడంబాక్కంలో శ్యామ్ పోకర్ క్లబ్ను నిర్వహిస్తున్నాడు. ఈ క్లబ్ను అతడు గ్యాంబ్లింగ్ చేస్తూ పలువురిని మోసగించినట్టు పోలీసులకు ఫిర్యాదులందాయి. దీంతో పోలీసులు శ్యాంను అదుపులోకి తీసుకున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం, ఊసరవెల్లి , కత్తి, వంటి సినిమాలో శ్యాం నటించాడు. ఇతడు తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.