తెలుగులో ‘హార్ట్ ఎటాక్, క్షణం’ సినిమాలు ఆదాశర్మకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ‘సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్’ వంటి హిట్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. రీసెంట్గా రాజశేఖర్ సినిమా ‘కల్కి’లో హీరోయిన్గా కూడా ఆకట్టుకుంది. అయినా తెలుగులో ఆశించిన అవకాశాలు ఆమెకు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్లో అడపాదడపా సినిమాలను చేస్తోంది. అయితే తెలుగు అభిమానులు నా నుంచి ఓ మంచి సినిమా కోరుకుంటున్నారు, అందుకే ఈ సినిమాకు సంతకం చేశానంటోంది ఆదాశర్మ. […]
సారథి న్యూస్, కర్నూలు: ‘కరోనాకు ఎవరు కూడా బయపడొద్దు.. ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుంది’ అని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ అన్నారు. మంగళవారం జీజీహెచ్ లోని బ్లడ్ బ్యాంక్ లో ప్లాస్మా దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరానాతో ఎవరూ ఇబ్బందులు పడకూడదని, చావులు ఉండకూడదని, కరోనాతో పోరాడి విజేతలైన వారు ప్లాస్మాను దానం చేయాలని కోరారు. కరోనా పాజిటివ్వస్తే హోం క్వారంటైన్లో ఉండి నిరంతరం వైద్యుల సూచనలు, సలహాలు తీసుకోవాలని సూచించారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ముస్లింలు ఇంట్లోనే ఉండి ప్రార్థనలు చేసుకోవాలని తెలంగాణ డిప్యూటీ హోం మినిస్టర్మహమూద్అలీ సూచించారు. మంగళవారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే పండుగను ముస్లిం సోదరులు ప్రత్యేక జాగ్రత్తలతో జరుపుకోవాలని సూచించారు. భౌతిక దూరం పాటించాలని, ప్రతిఒక్కరూ తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని, తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. బక్రీద్ సందర్భంగా బలిచ్చే పశువుల వ్యర్థాలను తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేశామని […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మంగళవారం 7,948 మందికి కరోనా పాజిటివ్ నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,297కు చేరింది. ఒకే రోజు 3,064 మంది కరోనా బాధితుల డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 56,527 కరోనా యాక్టివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొత్తగా కరోనాతో 58 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 1,148కు చేరింది. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 740, చిత్తూరు 452, ఈస్ట్గోదావరి 1367, గుంటూరు 945, కడప 650, […]
సారథిన్యూస్, రామగుండం: సింగరేణిలోని బొగ్గును దొంగిలించనవారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ పేర్కొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో సింగరేణిలో తరుచుగా బొగ్గును దొంగిలిస్తున్న దుస్స దేవేందర్పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. అనంతరం సదరు నిందితుడిపై కేసునమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
సారథిన్యూస్, ఖమ్మం: కరోనా బాధితులకు సాయం చేస్తూ, కరోనా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్న ప్రముఖ సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాసరావు దంపతులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కాగా వీరిద్దరూ మద్దులపల్లి కరోనా కేర్సెంటర్లో చికిత్సపొందుతున్నారు. అక్కడ వారిని ఎవరూ పట్టించుకోకపోవడం, వైద్యం సరిగ్గా అందకపోవడంతో తమకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి పువ్వాడ అజయ్ను కోరారు. వెంటనే స్పందించిన మంత్రి వీరిద్దరినీ ప్రత్యేక అంబులెన్స్లో హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్లోని మమత […]
సారథిన్యూస్, నల్లగొండ: కరోనా పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. సన్నిహితులు, స్నేహితులే కదా అని పార్టీలకు వెళితే కరోనా అంటించుకోవడం ఖాయమని పేర్కొన్నారు. విందు, వినోదాలతోనే కరోనా అధికంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. మన చుట్టే ఎంతోమంది కరోనా రోగులు ఉండొచ్చన్నారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. త్వరలో గ్రామీణప్రాంతాల్లోనూ టెస్టులు చేస్తామాని చెప్పారు. మంగళవారం ఆయన వర్తక, వాణిజ్య సంఘాలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడి కోసం […]
సారథిన్యూస్, రంగారెడ్డి: ఓ వివాహిత హత్యకు గురైంది. కాగా ఆమెను చంపింది తొమ్మిదో భర్త కావడం విశేషం. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా పహాడిషరీఫ్ పరిధిలోని శ్రీరామ కాలనీలో చోటుచేసుకున్నది. వరలక్ష్మి (35)ని కొంతకాలం క్రితం శ్రీరామ కాలనీకి చెందిన నాగరాజు (36) వివాహం చేసుకున్నాడు. కాగా వరలక్ష్మి అప్పటికే ఎనిమిది పెళ్లిళ్లు చేసుకొని.. వేర్వేరు కారణాలతో భర్తలకు విడాకులు ఇచ్చింది. నాగరాజు ఆమెకు తొమ్మిదోభర్త. కాగా ఇటీవల భార్య, భర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. మంగళవారం […]