మాడ్రిడ్: కీలక సమయంలో కళ్లు తిరిగే పెనాల్టీ కార్నర్తో గోల్ సాధించినా.. ప్రత్యర్థి ఆటగాళ్లను అడ్డుకోలేకపోయిన ఎఫ్సీ బార్సిలోనా.. లా లిగా టోర్నీలో మూడో డ్రాతో సంతృప్తి పడింది. దీంతో అట్లెటికో మాడ్రిడ్తో జరిగిన ఫుట్బాల్ లీగ్ మ్యాచ్ను 2–2తో డ్రాగా ముగించింది. బార్సిలోనా తరఫున డియాగో కోస్టా(11వ ని.), లియోనల్ మెస్సీ(50వ ని.) గోల్స్ చేయగా, సాల్ నిగుయెజ్ (19, 62వ ని.) అట్టెటికోకు గోల్స్ అందించాడు. ప్రస్తుతం రియల్ మాడ్రిడ్ 32 మ్యాచ్ల్లో 71 […]
లండన్: జాతి వివక్షకు వ్యతిరేకంగా ఫార్మూలా వన్ కూడా గళం కలిపింది. ఈ సీజన్లో తాము పాల్గొనే ప్రతి రేస్లో బ్లాక్ కార్లతో బరిలోకి దిగుతామని ఎఫ్–1 టీమ్ మెర్సిడెజ్ ప్రకటించింది. వరల్డ్లో ఎక్కడా జాతి వివక్ష ఉండకూడదని టీమ్ ప్రిన్సిపల్ టొటోవోల్ఫ్ వెల్లడించాడు. సాధారణంగా మెర్సిడెజ్ కార్లన్నీ సిల్వర్ రంగులో ఉంటాయి. ‘జాతి, వర్ణ వివక్షపై నోరు మెపకుండా ఉండకూడదు. జాతి వివక్షపై మా సంకల్పం, ప్రతిబింబించేలా మేం నలుపు రంగు కార్లతో సర్క్యూట్పై దూసుకుపోతాం. […]
దిగ్జజ నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ (71) కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మృతిచెందారు. గతనెల 20న ఆమె శ్వాసకోసం ఇబ్బందులతో ముంబైలోని గురునానక్ దవాఖానలో చేరారు. అనంతరం ఆమె పరిస్థితి మెరుగుపడటంతో డిశ్చార్జి చేశారు. ఇంతలోనే ఆమె కన్నుమూయడంతో బాలీవుడ్ సినీపరిశ్రమలో విషాదం నెలకొన్నది. సరోజ్ఖాన్ దాదాపు రెండువేల పాటలకు సరోజ్ఖాన్ కొరియోగ్రాఫ్ అందించారు. దేవదాస్లోని డోలారే డోలాకు ఆమె కొరియోగ్రఫీ చేశారు. శ్రీదేవి నటించిన […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఫలానా పట్టణంలో బాలిక అదృశ్యం.. ఫలానా గ్రామం నుంచి కనిపించకుండాపోయిన ఇద్దరు మహిళలు. పాఠశాల నుంచి మాయమైన విద్యార్థినులు.. ఇలాంటి వార్తలు ప్రతిరోజూ పేపర్లు, టీవీల్లో చూస్తూనే ఉంటాం. ఇలా ఇంటినుంచి మాయమైన వారు దేశం మొత్తంలో లక్షో, పదిలక్షల మందో ఉంటారని అనుకుంటాం. కానీ, ఈ 50ఏళ్ల కాలంలో అలాంటివారు నాలుగు కోట్ల 58లక్షల మంది ఉన్నారట. అది కూడా మహిళలు. ఇంతమంది కనిపించకుండా పోయారట. ఇది కేవలం ఇండియాలోనే. వినడానికి […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఏపీలో అధికార పక్షానికి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఒకటి ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రూపంలో ఉంటే.. మరోటి టీడీపీ అవినీతి విధానాలకు ఉదాహరణగా చూపిన పోలవరం అంశం. ఈ రెండూ ఇప్పుడూ సీఎం వైఎస్ జగన్ శిబిరంలో టెన్షన్ రేపాయి. కొంతకాలంగా వైఎస్సార్సీపీకి చెందిన నరసరాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీ విధానాలకు, ముఖ్యంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏం […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనాతో ఇండియాకు ఎగుమతి కష్టాలు మొదలయ్యాయా.. ఈ ఆర్థిక సంవత్సరం పరిస్థితి మరింత దిగజారనుందా.. నానాటికీ ఎగుమతులు క్షీణిస్తున్నాయా.. అవుననే సమాధానం వస్తుంది ఆర్థికరంగ నిపుణుల నుంచి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత ఎగుమతులు 10 శాతం తగ్గే అయ్యే అవకాశాలున్నాయని ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈఓ) అంచనా వేసింది. కరోనా వైరస్ వల్ల గడిచిన ఏప్రిల్లో 60 శాతం, మే మాసంలో 36 శాతం ఎగుమతులు క్షీణించాయనీ.. దీంతో పోల్చితే ప్రస్తుత […]
సారథి న్యూస్, గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు నీటిఉద్ధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షంతో వరద నీరు చేరుతోంది. 9.516 టీఎంసీలకు గానూ 5.638 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద చేరుతోంది. గతేడాది జులైతో పోలిస్తే నీటి నిల్వ గరిష్ఠంగా ఉంది. దీంతో ఆయకట్టు రైతులకు ఆశలు చిగురిస్తున్నాయి. 2019లో ఇదే సమయానికి 1.75 టీఎంసీల నీటిమట్టం ఉండగా, ప్రస్తుతం 5.638టీఎంసీల నీటి నిల్వ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి ఎంత మాత్రం ఆగడం లేదు. ష్ట్రంలో అత్యధికంగా గురువారం ఒకేరోజు 1,213 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్కేసుల సంఖ్య 18,570 కు చేరాయి. తాజాగా 8 మంది మృతిచెందారు. ఇలా ఇప్పటి వరకు వ్యాధిబారినపడి 275 మంది చనిపోయారు. 987 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 998 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 48, మేడ్చల్ 54, ఖమ్మం 18, వరంగల్ […]