Breaking News

Day: July 6, 2020

అది బీజేపీ ఎన్నికల వ్యూహమేనా?

అది బీజేపీ ఎన్నికల వ్యూహమేనా?

సారథి న్యూస్, హైదరాబాద్: తాము చేయాల్సిన పని చేయకుండా ఇతరులపై నిందలు మోపడం బీజేపీకి కొత్తేమీకాదు.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సి.కిషన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంపై గుప్పిస్తున్న విమర్శలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా భావించవచ్చు. హైదరాబాద్ మహానగరం డేంజర్ జోన్​లో ఉందని ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్న ఆయన కేంద్రం రాష్ట్రానికి ఎలాంటి సాయాలూ చేయలేదన్న విషయాలను మాత్రం ప్రస్తావించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి వెంటీలేటర్లు అడిగితే కేవలం 50 ఇచ్చి చేతులు […]

Read More
బంధం.. బాధ్యతలు.. ఎన్నో ప్రశ్నలు

బంధం.. బాధ్యతలు.. ఎన్నో ప్రశ్నలు

బంధం, బాధ్యతలు, చుట్టూ సవాళ్లు.. ఇదీ ఇప్పుడు కుటుంబాలను కుంగదీస్తున్న తీరు. ఈ చట్రంలో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు… పెరుగుతున్న కలహాలు ఎన్నో ప్రశ్నలను ఉదయిస్తున్నాయి. కుటుంబం పునాదులను కూల్చేస్తున్నాయి. ప్రేమ సాక్షిగా వెలగాల్సిన మనుషులు దానికి వింత భాష్యాలు చెప్పుకుంటూ మానవత్వానికే మచ్చతెస్తున్నారు. అన్నీ అమరి ఉన్నా ఇంకా ఏదో చాలదన్న భావన. పొరుగింటి పుల్లకూర రుచి అనే నైజం.. తాను సుఖపడితే చాలు మిగతా అంతా తర్వాత సంగతి అనే విచిత్ర ధోరణి వెరసి […]

Read More
‘సుక్క’ చిన్నబోయింది. ఆకలికి చిక్కి పోయింది

‘సుక్క’ చిన్నబోయింది.. ఆకలికి చిక్కి పోయింది

సారథి న్యూస్, శ్రీకాకుళం: ఆమె..ఒకప్పుడు ఎమ్మెల్యే. ప్రజలకు దీనబంధు. కష్ట జీవుల కళ్లల్లో చిరుదీపం. కారు లేదు. జేజేలు కొట్టే కార్యకర్తలు లేరు. వెన్నంటే తిరిగే పోలీసులు లేరు. కేవలం కూలి పనికి వెళ్లడానికి కాలినడకే దిక్కు. ఆమె ఎవరో కాదు ఏపీలోని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే సుక్క పగడాలమ్మ. ప్రస్తుతం ఈ సుక్క చిన్నబోయింది. ఆకలికి చిక్కిపోయింది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం ముక్తాపురం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సుక్క పగడాలమ్మ ప్రస్తుతం నిరాడంబర […]

Read More
మద్యం ఆదాయమే మస్త్​

మద్యం ఆదాయమే మస్త్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా దెబ్బకు ప్రపంచమే తలకిందులైంది. ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగామని భావిస్తున్న దేశాలు కూడా వైరస్‌ కాటుకు కకావికలమయ్యాయి. అందులో తెలంగాణ ప్రభుత్వం కూడా ఒకటి. లాక్‌డౌన్‌ కాలంలో పరిశ్రమలు, దుకాణాలతో పాటు అన్నిరంగాలు మూసివేశారు. దీంతో వ్యాపారం జరగలేదు. రాష్ట్రానికి రావాల్సిన పన్నులు కూడా రావడం లేదు. ఉన్న డబ్బంతా ఊడ్చుకుపోయింది. దీంతో ప్రభుత్వం ఉద్యోగుల జీతాల్లో కూడా కోత విధించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఇప్పుడు లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత […]

Read More

అవన్నీ పుకార్లే

ఇండియన్​2, పుష్ప చిత్రాల్లో తాను స్పెషల్​సాంగ్స్​ చేయడం లేదని ఆర్​ఎక్స్​100 ఫేమ్​ పాయల్​ రాజ్​పుత్​ స్పష్టం చేశారు. తాను ఆ రెండు చిత్రాల్లో స్పెషల్​ సాంగ్స్​ చేస్తున్నానంటూ కొందరు పుకార్లు పుట్టించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సోషల్​మీడియాలో ఓ పోస్ట్​ పెట్టారు. ‘ప్రస్తుతం నేను కొన్ని కథలు వింటున్నాను. కథ నచ్చితే సినిమా చేస్తాను. ఆ విషయాన్ని స్వయంగా నేనే ప్రకటిస్తాను. కాబట్టి అప్పటివరకు నా మీద అనవసర పుకార్లు పుట్టించి మీ సమయం వృథా […]

Read More

ఆచార్య చిత్రంలో మాజీ నక్సలైట్​గా చెర్రీ

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో రామ్​చరణ్​ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే చెర్రీ ఈ చిత్రంలో మాజీ నక్సలైట్​గా కనిపించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం లాక్​డౌన్​​తో షూటింగ్ కు బ్రేక్ పడింది. కాగా ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 40 శాతం షూటింగ్​ పూర్తయ్యింది. ఆచార్యలో మెగాస్టార్​ సరసన కాజల్​ నటిస్తున్నది. త్వరలో ఫిల్మ్​సిటీలో మొదలయ్యే షూటింగ్​లో ఆమె పాల్గొననున్నది. రెజీనా ఓ […]

Read More
రామోజీ ఫిల్మ్​సిటీలో చైతూ సినిమా చిత్రీకరణ

ఫిల్మ్​సిటీలో ‘లవ్​స్టోరీ’ షూటింగ్​

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్​స్టోరీ’ చిత్ర షూటింగ్​ రామోజీ ఫిల్మ్​సిటీలో జరుగనున్నది. ఫిదా తర్వాత చాలా గ్యాప్​ తీసుకొని శేఖర్​కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సాయిపల్లవి నటిస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో అగష్టు మొదటివారం నుంచి రామోజీఫిల్మ్​సిటీలో షూటింగ్​ జరుగనున్నట్టు సమాచారం. ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నది.

Read More
శర్వానంద్​ కొత్తసినిమా అజయ్​భూపతితో

‘మహాసముద్రం’లో హీరోగా శర్వానంద్​

ఆర్జీవీ శిష్యుడు, మొదటి సినిమాతోనే తెలుగు ఫిల్మ్​ ఇండస్ర్టీలో ప్రకంపనలు సృష్టించిన అజయ్​ భూపతి కొత్త చిత్రం మహాసముద్రంలో యువనటుడు శర్వానంద్​ హీరోగా చాన్స్​ కొట్టేశాడు. మహాసముద్రం స్ర్కిప్ట్​ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. పలు కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోతూ వస్తున్నది. తాజాగా శర్వానంద్​ ఈ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. కాగా హీరోయిన్​గా రాశీఖన్నా ఎంపికైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కరోనా పరిస్థితులు ఓ కొలిక్కిరాగానే సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, […]

Read More