సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఉద్యోగులంతా కలిసి కట్టుగా పనిచేయాలని ఆ సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్ చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం ఆయన పెద్దపల్లి జిల్లా మేడిపల్లి ఓపెన్కాస్ట్ను సందర్శించి అక్కడ జరుగుతున్న ఓవర్ బర్డెన్ పనులను పరిశీలించారు. వానకాలంలో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులకు, కార్మికులకు పలు సూచనలు చేశారు. ఓవర్ బర్డెన్ తరలింపు పనులను వేగవంతంగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అర్జీ-1 ఏరియా మేనేజర్ గోవిందారావు, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి , […]
సారథిన్యూస్, గోదావరిఖని: సింగరేణి సంస్థను ప్రైవేట్పరం కాకుండా కాపాడుకుందామని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దపల్లి జిల్లాలోని ఆర్జీవన్ ఏరియాలో సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. కార్మికహక్కులను కాపాడుకొనేందుకు ప్రతి కార్మికుడు ఉద్యమించాలని కోరారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని బొగ్గుపరిశ్రమలను ప్రైవేట్పరం చేసేందుకు కేంద్రప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో కార్మికసంఘం నాయకులు మెండె శ్రీనివాస్, నంది నారాయణ, బీ రవి, మెండయ్య, ఓదెలు, […]
సారథి న్యూస్, రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా ఆస్పత్రిని బుధవారం సింగరేణి జీఎం నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రామగుండం ఏరియా-1 లోని కొందరు ఉద్యోగులకు కరోనా ప్రబలింది. వారంతా రామగుండం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సింగరేణిలోని ఉద్యోగులు, వారికుటుంబసభ్యులు విధిగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. రామగుండం ఏరియా ఆస్పత్రిలో ప్రతి రోజు 200 మందికి కరోనా టెస్టులు నిర్వహించి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారని […]
సారథి న్యూస్, రామగుండం: ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అన్నిరంగాల్లోనూ అద్భుతాలు సాధించవచ్చని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ పేర్కొన్నారు. సోమవారం మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో ఓ జాతీయ సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. మైనింగ్ ఇంజినీరింగ్ నిపుణులు, వివిధ శాఖల అధికారులు ఈ సదస్సులో పాల్లొన్నారు. వారంపాటు ఈ వీడియో కాన్ఫరెన్స్ కొనసాగనున్నది. కార్యక్రమంలో మైనింగ్ సేఫ్టీ (సౌత్ సెంట్రల్ జోన్) డిప్యూటీ డైరెక్టర్ మలయ్ టికేదార్, డిప్యూటీ డెరెక్టర్ ఆఫ్ మైన్ […]
సారథి న్యూస్, గోదావరిఖని: సింగరేణిలో పనిచేస్తున్న ఓ కార్మికుడు కరోనా లక్షణాలతో మృతిచెందాడు. దీంతో గురువారం సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికులు విధులను బహిష్కరించారు. సింగరేణిలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యాజమాన్యం వెంటనే లాక్డౌన్ ప్రకటించాలని సింగరేణి ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సారయ్య, గని కార్యదర్శి కే రంగారావు కోరారు. సింగరేణి ఆర్జీవన్ డివిజన్లోని జీడీకే రెండవ గనిలో పనిచేస్తున్న టామర్ కార్మికుడు బుధవారం కరోనా లక్షణాలతో మృతిచెందాడు. దీంతో కార్మికవర్గం ఒక్కటైంది.
సారథిన్యూస్, గోదావరిఖని: సింగరేణిలో లాక్డౌన్ ప్రకటించి కార్మికుల ప్రాణాలు కాపాడాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్, సీఐటీయూ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణిలో కరోనా వైరస్ లక్షణాలతో కార్మికులు చనిపోతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు విధులు నిర్వర్తించడానికి ఎంతో భయపడతున్నారని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ […]
సారథిన్యూస్, హైదరాబాద్: సీఎం కేసీఆర్ హామీమేరకు సింగరేణికి చెందిన కార్మికులకు రూ.210 కోట్లు వెచ్చించి నూతన క్వార్టర్లు నిర్మించి ఇస్తామని సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్ బోర్డు డైరెక్టర్లు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. సింగరేణి విద్యాసంస్థలకు రూ. 45 కోట్లు కేటాయించేందుకు, సింగరేణిలో ప్రత్యేకపర్యావరణశాఖ ఏర్పాటు చేసేందుకు బోర్డు డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. సమావేశంలో బోర్డు సభ్యులు వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ సీఎండీ రాజీవ్ రంజన్ మిశ్రా, కేంద్ర బొగ్గు […]
సారథిన్యూస్, గోదావరిఖని: సింగరేణి ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ స్పెషల్ ఇన్సెంటివ్, ప్రత్యేక ప్యాకేజీ చెల్లించాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు సింగరేణి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కడారి సునీల్, రీజియన్ కార్యదర్శి శనిగల శ్రీనివాస్, నగర అధ్యక్షుడు శనిగరపు చంద్రశేఖర్, ఏఐటీయూసీ సింగరేణి ఏరియా ఆసుపత్రి విభాగం ఏఐటీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు దుర్గాప్రసాద్, […]