ఇళ్ల ప్రారంభోత్సవానికి అధికార యంత్రాంగం సన్నాహాలు అర్హుల జాబితా వెల్లడికి నిర్ణయం సంగారెడ్డి జిల్లాలో 1,367 ఇళ్లు సిద్ధం సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: పేదల ఇంటి కలను సహకారం చేసేందుకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల పరిధిలో 1,367 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. […]
సామాజిక సారథి, సంగారెడ్డి: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో సమాజంలో సకలాంగులతో సమానంగా జీవించేలా ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ రాజార్షిషా అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా మహిళ ,శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఉన్నత స్థాయిలో జీవించడానికి వికలాంగులకు అంగవైకల్యం అడ్డుకారాదని, పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలను సాధిస్తారన్నారు. దివ్యాంగుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక […]
సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: సాయుధ దళాల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ చేయూతనందించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా కోరారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఆయన తన వంతు విరాళం అందజేసి సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు […]
సామాజిక సారథి ,మెదక్ ప్రతినిధి: ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ చందన దీప్తి అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ దినం సందర్భంగా జిల్లా నలుమూలల నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి 17 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వారితో జిల్లా ఎస్పీ చందన దీప్తి నేరుగా మాట్లాడి వారి సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ లకు, ఎస్ఐలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మండలం మాడాపూర్ […]
80శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా కొనసాగుతుందని కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. సోమవారం అందోల్ మండలం సంగుపేట, చౌటకూర్ మండలం ఉప్పరిగూడ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 80 శాతం ధాన్యం కొనుగోలు పూర్తయిందన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో 72 గంటల్లో డబ్బులు పడుతున్నాయని పేర్కొన్నారు. […]
అవార్డు అందించిన కేంద్రమంత్రి మహేష్ శర్మ సామాజిక సారథి, హైదరాబాద్: ఉత్తమ డీసీసీబీ చైర్మన్గా చిట్టి దేవేందర్ రెడ్డి జాతీయ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీసీసీబీలో కెల్లా రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ మెరుగైన పనితీరుతో ఉత్తమ డీసీసీబీ చైర్మన్గా చిట్టి దేవేందర్ రెడ్డికి ఈ అవార్డు దక్కింది. గురువారం ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి మహేష్ శర్మ చేతులమీదుగా చిట్టి దేవేందర్ […]
డాక్టర్ల ఉదాసీన వైఖరి సరికాదు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సామాజిక సారథి, సంగారెడ్డి: జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, తదితర శాఖల అధికారులతో వ్యాక్సినేషన్ పురోగతిపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒమిక్రాన్ తో ముప్పు పొంచి ఉందని, వందశాతం వ్యాక్సినేషన్ […]
సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: వివిధ సమస్యల నిమిత్తం కలెక్టరేట్ కు వచ్చే సందర్శకులు, అర్జీదారుల కోసం జిల్లా అధికార యంత్రాంగం మీసేవ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మీసేవ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ హనుమంతరావు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి కి సంబంధించి మీ సేవలో దరఖాస్తు చేసుకోవడానికి సులువుగా ఉంటుందని అన్నారు. ఆయనవెంట అదనపు కలెక్టర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.