Breaking News

నిజాంపేట

సన్నాలకు గిట్టుబాటు ధర ప్రకటించాలే

సన్నాలకు గిట్టుబాటు ధర ప్రకటించాలే

సారథి న్యూస్, రామాయంపేట: రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు గిట్టుబాటు ధర కల్పించాలని బీజేపీ నిజాంపేట బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. సోమవారం పార్టీ ఆధ్వర్యంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ ​చేస్తూ స్థానిక తహసీల్దార్ జయరామ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్నవరికి రూ.2,500, పత్తికి రూ.8,000, అలాగే నీట మునిగిన పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వివరించారు. కార్యక్రమంలో […]

Read More
చివరి గింజ దాకా కొంటాం

చివరి గింజ దాకా కొంటాం

సారథి న్యూస్, రామాయంపేట: రైతుల నుంచి చివరి గింజ దాకా కొనుగోలు చేస్తామని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్(డీఏవో) పరుశురాం నాయక్ అన్నారు. అన్నదాతలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయన మెదక్​జిల్లా నిజాంపేట మండలకేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక సబ్ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం మొత్తం ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు గురించి ఆరాతీయాలని […]

Read More
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామంలో ఆదివారం సీఎం రిలీఫ్​ఫండ్ చెక్కులను ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు బాల్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. దొంతర బోయిన సత్తయ్యకు రూ.90వేలు, గొల్ల పోచవ్వ కూతురుకు రూ.60వేల చెక్కులను అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేష్, వార్డ్ సభ్యుడు రవీందర్, గ్రామస్తులు తిర్మలయ్య, శ్రీను, మల్లేశం పాల్గొన్నారు.

Read More
రామారావు మహరాజ్ కు ఘననివాళి

రాంరావు మహరాజ్ కు ఘననివాళి

సారథి న్యూస్, రామాయంపేట: రాజయోగి రాంరావు మహరాజ్ చిత్రపటానికి మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని జెడ్ చెర్వు గ్రామ సర్పంచ్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.

Read More
పుస్తెమట్టెల అందజేత

పుస్తెమట్టెల అందజేత

సారథి న్యూస్, రామాయంపేట: నిజాంపేట మండలంలోని నందగోకుల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన దొరలగల్ల యాదయ్య కూతురు పెళ్లికి నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ శుక్రవారం పుస్తెమట్టెలు అందజేశారు. కార్యక్రమంలో నార్లపూర్ ఎంపీటీసీ సభ్యుడు రాజిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గురుగల శ్రీనివాస్, నిజాంపేట ఉపసర్పంచ్ కొమ్మట బాబు పాల్గొన్నారు.

Read More
వడ్ల కొనుగోళ్లు షురూ

వడ్ల కొనుగోళ్లు షురూ

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నస్కల్, రాంపూర్, చల్మేడ గ్రామాల్లో శుక్రవారం రామాయంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు సెంటర్లను చైర్మన్ బాదె చంద్రం, నిజాంపేట ఎంపీపీ సిద్ధరాములు కలసి ప్రారంభించారు. రైతులు ఈ కొనుగోలు సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘ఏ’ గ్రేడ్ వరి ధాన్యానికి రూ.1,888, సాధారణ రకానికి రూ.1,868 కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఈవో నర్సింలు, సొసైటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు గౌస్, […]

Read More
పంట ఎండింది.. గుండె మండింది

పంట ఎండింది.. గుండె మండింది

సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతన్నలు వేసిన సన్నరకం వరి దోమకాటు బారినపడింది. చేసేదిలేక రైతులు బుధవారం పంటకు నిప్పంటించారు. నిజాంపేట మండలంలోని చల్మెడ గ్రామానికి చెందిన రైతు దొంతరబోయిన మధుకు చెందిన ఎకరాన్నర పొలంలో దోమకాటుకు పంట నాశనమైంది. మందులు కొట్టి పంటను బతికించుకోలేక నిప్పంటించాడు. ఈ సన్నరకం వరి వేసిన నాలాంటి రైతులు ఎందరో బలవుతున్నారని, ప్రభుత్వం స్పందించి దోమకాటుకు బలైన రైతులను ఆదుకోవాలని దొంతర బోయిన మధు, […]

Read More
భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు

భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు

సారథి న్యూస్, నిజాంపేట: మెదక్ ​జిల్లా నందిగామలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం దుర్గామాత బోనాలను భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యుడు లద్ధ సురేష్ మాట్లాడుతూ .. ప్రతి ఇంటి నుంచి బోనాలను సర్వంగా సుందరంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించామని తెలిపారు. అనంతరం ఊర రేణుక పోచయ్య ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లద్ధప్రీతి రాజగోపాల్, ఉపసర్పంచ్ గెల్లు రాజాం, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బిజ్జ సంపత్, విగ్రహ దాత […]

Read More