న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, లోక్జన శక్తి పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ గురువారం సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తన తండ్రి చనిపోయినట్టు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ‘మిస్ యూ పాప్పా’ అంటూ చిరాగ్ ట్వీట్ చేశారు.ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవలే ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఆయన చికిత్స పొందుతూ మరణించారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఆయన […]
సారథి న్యూస్, అమరావతి: అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయిన దుర్గాప్రసాద్కు పేదల నేతగా ప్రజల్లో పేరుంది. నిత్యం ప్రజలతో కలిసిమెలిసి ఉంటే దుర్గాప్రసాద్ నిరాడంబరంగా మెలిగేవారు. తన అనుచరులను నిత్యం పేరుపెట్టి పిలుస్తూ పలకరించేవారు. ఏ కష్టమొచ్చినా వెంబడే స్పందించారు. అలాంటి నేత తమ మధ్య లేకపోవడంతో కార్యకర్తలు నిర్ఘాంతపోయారు. ఇదీ రాజకీయ చరిత్ర..టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పిలుపుతో 26 ఏళ్ల వయస్సులోనే దుర్గాప్రసాద్ రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు ఆయనకు నెల్లూరు మంచి లాయర్గా పేరు ఉండేది. […]
తిరుపతి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ బుధవారం సాయంత్రం కన్నుమూశారు. కొంత కాలంగా కరోనాతో అనారోగ్యంతో బాధపడుతున్న దుర్గాప్రసాద్ చైన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే హఠాత్తుగా గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దుర్గా ప్రసాద్ గతంలో చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో వైఎస్సార్ సీపీలో చేరి తిరుపతి ఎంపీగా విజయం […]
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ (84) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనాతో ఈ నెల 10న ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరినప్పటినుంచి ప్రణబ్ ఆరోగ్యం విషమంగానే ఉన్నది. ఆయనకు ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్ అయినట్టు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయనను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించామని చెప్పారు. ఆయన ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు. ప్రణబ్ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, యువనేత […]
ప్రముఖ సింగర్ కారుణ్య ఇంట్లో విషాదం అలుముకుంది. ఆయన తల్లి జానకి (70) అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు వాడైన కారుణ్య ఇండియన్ ఐడల్ రన్నరప్గా పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కారుణ్య మాతృమూర్తి జానకి కొంతకాలంగా కేన్సర్తో బాధపుడుతున్నట్టు సమాచారం. ఆమె కేంద్రప్రభుత్వం సంస్థ బీడీఎస్ ఉద్యోగం చేసి పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీప్రముఖులు, గాయకులు సంగీతదర్శకులు కారుణ్యకు ఫోన్చేసి ఓదార్చారు. ఆయన మాతృమూర్తి మృతికి సంతాపం తెలిపారు.