యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేశాడు. ‘ఆదిపురుష్’ అనే పాన్ఇండియా మూవీలో తాను నటించబోతున్నట్టు అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ కొత్తచిత్రానికి ‘తనాజీ’ ఫేం ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్హన్కుమార్ , టీసీరిస్వారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 5 భాషల్లో ఈ చిత్రం తెరకెక్కునున్నట్టు సమాచారం. హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానున్నది. ‘ఆదిపురుష్’ అనే ఈ చిత్రం ఇతిహాస కథ […]
తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ప్రముఖ సినీ హీరోయిన్ నిక్కీ గార్లాని కరోనా బారిన పడ్డారు. స్వయంగా ఆమె ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. తనకు కరోనా సోకిందని.. హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పింది. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించింది. నిక్కి తెలుగులో సునీల్ హీరోగా నటించిన కృష్ణాష్టమి చిత్రంలో నటించింది. పలు తమిళ చిత్రాల్లోనూ ఆమె నటించింది. ప్రస్తుతం లారెన్స్ నటిస్తున్న రంగస్థలం తమిళ్ రీమేక్లో […]
అరగంట నిడివి ఉన్న ఓ పాత్రలో నటించేందుకు హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ రూ. 70 లక్షలు తీసుకున్నట్టు సమచారం. రానా హిందిలో నటిస్తున్న ‘ హాథీ మేరీ సాథీ’ అనే చిత్రంలో కాజల్ ఓ ఆదివాసి మహిళ పాత్రను చేస్తున్నది. ఈ సినిమాలో అరగంట సేపే కాజల్ పాత్ర ఉంటుందట. అతిథి పాత్రే అయినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో కాజల్ ఏమాత్రం తగ్గలేదట. ఆ పాత్ర చేసినందుకు రూ.70 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. అయితే ఈ పాత్రలో గ్లామర్డోస్ […]
సారథిన్యూస్, హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు, వైసీపీ నేత పృథ్విరాజ్కు కరోనా అంటుకుంది. పదిరోజుల నుంచి ఆయన తీవ్రజ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. దీంతో వైద్యుల సూచనమేరకు పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. వైద్యుల సూచన మేరకు తాను 15 రోజులు క్వారంటైన్లో ఉంటానని చెప్పారు.
మిల్కీ బ్యూటీ తమన్నా, యువహీరో గోపిచంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘సీటీమార్’ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశలో ఉన్నట్టు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని యోచిస్తున్నారట నిర్మాతలు. అందుకోసం ఇప్పటికే ఓ ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ను కూడా వారు సంప్రదించినట్టు సమాచారం. లాక్డౌన్తో సినీపరిశ్రమ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. కానీ కొంతమంది నిర్మాతలకు తెలివిగా ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషా నేర్చుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఇప్పటికే కొన్ని వందల తెలుగు మీడియం స్కూళ్లు మూతపడ్డాయి. అదే సమయంలో ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల సంఖ్య విపరీతంగా పెరిగాయి. ఏపీలో అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం తీసుకొస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై విపక్షాలతో పాటు తెలుగు భాషాభిమానులు కూడా భగ్గుమన్నారు. దీనిపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఇప్పుడు ప్రపంచమంతా ఇంగ్లిష్ వైపే మొగ్గుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు […]
సారథిన్యూస్, హైదరాబాద్: ఇంటర్మీడియట్ తెలుగు పాఠ్యప్రణాళికను తెలంగాణ ఇంటర్బోర్డు మార్చబోతున్నది. ఇందుకోసం నిపుణుల కమిటీని నియమించింది. తెలంగాణ పదాలు, సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది(2020-21) ఫస్టియర్లో చేరబోయే విద్యార్థులకు ఈ కొత్త పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. 2021-22 విద్యా సంవత్సరానికి ద్వితీయ సంవత్సరంలోనూ కొత్త పాఠ్య ప్రణాళికతో పుస్తకాలు రూపొందుతాయి. తెలంగాణ రచయితలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇంటర్బోర్డు వర్గాలు తెలిపాయి.
బాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకున్న ‘క్వీన్’ చిత్రాన్ని దక్షిణాదిన నాలుగు భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కంగనాకు ఎంతో పేరుతెచ్చి పెట్టింది. ఆమె జాతీయ అవార్డును అందుకున్నది. కాగా తెలుగు రీమేక్లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా.. తమిళంలో కాజల్ నటించింది. కాగా ఆర్థికసమస్యతో ఈ చిత్రం విడుదల ఆగిపోయింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో చిత్రీకరణ పూర్తిచేసుకున్నప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు […]