Breaking News

SURYAPETA

పెద్దగట్టు జాతర తేదీలు ఖరారు

పెద్దగట్టు జాతర తేదీలు ఖరారు

సారథి న్యూస్​, సూర్యాపేట: రెండేళ్లకు ఒకసారి జరిగే.. తెలంగాణ రెండో అతిపెద్ద కుంభమేళాగా భావించే లింగమంతుల జాతరకు నగారా మోగింది. జాతర నిర్వహణపై సూర్యాపేటలోని క్యాంపు ఆఫీసులో గురువారం దేవాదాయశాఖ అధికారులు, యాదవ కులపెద్దలు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తో మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అందరి సలహాలు, సూచనలు తీసుకుని జాతర తేదీలను ఖరారు చేశారు. వేడుక ప్రారంభానికి 15 రోజులు ముందు అంటే 2021 ఫిబ్రవరి 14న ఆదివారం దిష్టిపూజ […]

Read More
సంక్షేమ పథకాలు అందరికీ అందాలి

సంక్షేమ పథకాలు అందరికీ అందాలి

సారథి న్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో తుంగతుర్తి నియోజకవర్గ నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకులతో ఆదివారం సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. ముఖ్య​అతిథులుగా విద్యుత్​శాఖ మంత్రి జి.జగదీశ్వర్​రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా చూడాలని కోరారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా రైతు కమిటీ అధ్యక్షుడు కోఆర్డినేటర్ […]

Read More

వాన ఎక్కువైంది జర భద్రం

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాలలో గత రెండ్రోజులగా కురుస్తున్న వర్షాలతో రోడ్ల మీద నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మునగాల ఎస్సై సత్యనారాయణగౌడ్​ సూచించారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు మునగాల మండలంలోని తాడువాయి నుంచి తాడువాయి తండా మధ్యలో ఉన్న అలుగు ఉధృతంగా ప్రవహిస్తున్నదన్నారు. ఈ మార్గాల గుండా వెళ్లే ప్రజలు ప్రత్యామ్నాయ దారులు చూసుకోవాలని ఆయన కోరారు. అదే విధంగా మునగాల నుంచి గణపవరం, తిమ్మారెడ్డిగూడెం, కొక్కిరేణి, వెల్దండ, చీదేళ్ల, తంగెళ్ల గూడెం, […]

Read More
బాధితురాలిని తరలించాలంటూ ధర్నా

బాధితురాలిని తరలించాలంటూ ధర్నా

సారథి న్యూస్, నడిగూడెం(సూర్యాపేట): సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో ఒక మహిళకు కరోనా పాజిటివ్​ అని తేలింది. కాగా ఆమె తన సొంత ఇంట్లో హోం క్వారంటైన్​లో ఉంటుంది. ఈ సందర్భంలో ఆమె నివాసముంటున్న వీధిలోని ప్రజలు శనివారం బాధితురాలిని అక్కడి నుంచి తరలించాలంటూ స్థానిక తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా ప్రాంతానికి చేరుకున్న అధికారులు, పోలీసులు ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయిస్తామని చెప్పినప్పటికీ స్థానికులు వినకపోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావారణం నెలకొంది. రోడ్డుపైనే […]

Read More

జూలై 3న మహాధర్నా

సారథిన్యూస్​, కోదాడ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 3న తలపెట్టిన ఐక్య కార్మిక సంఘాల ధర్నాను జయప్రదం చేయాలని కార్మికసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఐక్యకార్మిక సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎం ముత్యాలు ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు ఉదయగిరి, ఐఎన్టీయూసీ నాయకులు కే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

హైదరాబాద్​కు చేరిన కల్నల్​ కుటుంబసభ్యులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అమరజవాన్​ కల్నల్​ సంతోష్ బాబు సతీమణి, పిల్లలు బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్​పోర్టు​కు చేరుకున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ వారిని రిసీవ్​ చేసుకున్నారు. అమరజవాన్ కుటుంబసభ్యులతో సీపీ, ఇతర పోలీస్​ అధికారులు చాలా సేపు వారితో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. వారిని ప్రత్యేక వాహనంలో సూర్యాపేటకు తీసుకెళ్లనున్నారు. మంగళవారం చైనా బలగాల దొంగ దెబ్బకు కల్నల్​ సంతోష్​బాబు అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో […]

Read More

కల్నల్ సంతోష్ బాబు త్యాగం వెలకట్టలేనిది

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఇండియా– చైనా సరిహద్దులో చోటుచేసుకున్న ఘర్షణలో మంగళవారం సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మృతిపై సీఎం కేసీఆర్​ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ చేసిన ప్రాణత్యాగం వెలకట్టలేనిదన్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతోష్ మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవడం నుంచి అంత్యక్రియల వరకు ప్రతి కార్యక్రమంలోనూ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీశ్​ రెడ్డిని ఆయన ఆదేశించారు.

Read More

కాల్పుల్లో సూర్యాపేట ఆర్మీ ఆఫీసర్​ మృతి

సారథిన్యూస్​, సూర్యాపేట: భారత్‌ – చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన ఆర్మీ అధికారి మృతిచెందారు. సూర్యాపేటకు చెందిన సంతోష్​ కుమార్​ భారత్​​-చైనా సరిహద్దులో కల్నల్​గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం ఇరుదేశాల బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో సంతోష్ ప్రాణాలు కోల్పోయాడు.​ ఆర్మీ అధికారులు సూర్యాపేటలోని ఆయన కుటుంబసభ్యులకు మరణవార్తను తెలిపారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్‌(4) ఉన్నారు. సంతోష్‌ కోరుకొండ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు.  సంతోష్‌ మరణ […]

Read More