– బీమాను అందజేసిన బ్యాంక్ మేనేజర్ సునీత సామాజిక సారథి, యాచారం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, సురక్ష బీమా యోజన పథకాన్ని ఖాతాదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని నందివనపర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) మేనేజర్ సునీత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని నందివనపర్తి ఎస్ బీఐ బ్యాంకులో అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన కందికంటి చంద్రమ్మకు బ్యాంక్ ఖాత ఉందన్నారు. సదరు మహిళ 17 […]
మానోపాడు: ఒకవైపు కరోనా మహమ్మారి ఇంకా ప్రబలుతుంటే కొందరేమో సామాజిక దూరం, మాస్కు ధరించకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానోపాడు మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు దగ్గర బ్యాంకు రుణాలపై మహిళా సంఘాలకు, సమైక్య అధికారులు ఎస్బీఐ బ్యాంక్ సిబ్బంది అవగాహన కల్పించారు. అయితే ఈ సమావేశానికి100 మంది దాకా హాజరయ్యారు. అయితే వారేవరూ మాస్కు ధరించకపోవడం, భౌతికదూరం పాటించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.
డిగ్రీ అర్హతతో ఎస్బీఐలో 3,850 జాబ్స్ దరఖాస్తుల స్వీకరణ జూలై 27 నుంచే.. పెద్దసంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేస్తోంది. మొత్తం 3,850 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణ సర్కిల్లోనూ ఖాళీలు ఉన్నాయి. గుజరాత్, తెలంగాణ సర్కిల్కు 550 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణతో పాటు గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.ముఖ్యమైన తేదీలుదరఖాస్తు […]
సారథి న్యూస్, కర్నూలు : నంద్యాల మండలం చాపిరేవుల టోల్ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి సజీవదహనం అయ్యాడు. గూడ్స్ కొరియర్ లారీని కారు ఢీ కొనడంతో జరిగిన ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి కారులో ప్రయాణిస్తూన్న ఎస్బీఐ ఉద్యోగి శివకుమర్ సజీవదహనం అవగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడిన వ్యక్తిని పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.