Breaking News

RAMADUGU

పేదలకు సరుకులు పంపిణీ

పేదలకు సరుకులు పంపిణీ

సారథి, రామడుగు: కరోనా మహమ్మారి పేదల బతుకులను ఛిద్రం చేసింది. ఈ సమయంలో బడుగు జీవులకు ఆపన్నహస్తం అందిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు ఎందరో మహానుభావులు. ఆదరణ సేవాసమితి, సర్వ్ టూ సొసైటీ సంయుక్తంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తీర్మాలపూర్ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. వారి చదువు పూర్తయినందున ఏదైనా ఉద్యోగ అవకాశం ఇప్పించే ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే కొక్కెరకుంట గ్రామంలో […]

Read More
భాగ్యురాలికి ఎన్నారై ఆసరా

అభాగ్యురాలికి ఎన్నారై సాయం

సారథి, రామడుగు: తల్లిదండ్రులు కోల్పోయి అనాథగా మారిన ఎన్నారై ఒకరు సాయం చేశారు. రామడుగు మండలం తీర్మాలపూర్ గ్రామానికి చెందిన చెవుటు వీణాకు రైజింగ్ సన్ యూత్ క్లబ్ అమెరికాకు చెందిన ప్రముఖ ఎన్నారై జమలమడక అమృత సహకారంతో రూ.15వేల ఆర్థిక సహాయం అందజేశారు. యువజన సంఘం సభ్యులు శనివారం ఆమెకు ఇచ్చారు. ఈ సందర్భంగా రైజింగ్ సన్ యూత్ క్లబ్ అధ్యక్షుడు గజ్జెల అశోక్, బాధిత కుటుంబానికి ఆపన్నహస్తం అందించిన ఎన్నారై జమలమడక అమృతకు కృతజ్ఞతలు […]

Read More
కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పేదలకు అండ

కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పేదలకు అండ

సారథి, రామడుగు: కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ 45 మంది లబ్ధిదారులకు రూ.45,05,200 విలువైన చెక్కులను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నివర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆడపిల్లల పెళ్లి పేదలు అప్పుచేసి చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా ప్రతిఒక్కరికీ రూ.లక్ష నూట పదహార్లు నేరుగా అందిస్తున్నారని పేర్కొన్నారు. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో నాయకులంతా గుమికూడి చెక్కులు […]

Read More
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి

సారథి, రామడుగు: మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ రామడుగు మండలాధ్యక్షుడు అమిరిశెట్టి సుధాకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఎన్టీఆర్ 98వ జయంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లుగా భావించి కూడు, గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో టీడీపీని స్థాపించారని గుర్తుచేశారు. మద్యపాన నిషేధం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, జనతావస్త్రాలు, పటేల్ పట్వారీ […]

Read More
వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్

వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గుండిగోపాల్ రావుపేట ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలోని వ్యాక్సినేషన్ సెంటర్ ను కలెక్టర్ శశాంక బుధవారం సందర్శించి వ్యాక్సినేషన్ తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతిఒక్కరూ వాక్సిన్ వేసుకునేలా మోటివేషన్ చేయాలని సూచించారు. కరోనా పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలు రావడం లేదని, అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని సర్పంచ్, ఉపసర్పంచ్, వైస్ ఎంపీపీ కలెక్టర్ శశాంకను కోరారు. ఆయన వెంట ఎంపీడీవో మల్హోత్రా, తహసీల్దార్ కోమల్ రెడ్డి, ఎంపీవో సతీష్ రావు, రామడుగు […]

Read More
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి

సారథి, రామడుగు: రైతులకు అసౌకర్యం కలిగించకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ నిర్వాహకులకు చూచించారు. మండలంలోని వెదిర ఫ్యాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ కోమల్ రెడ్డి తో కలిసి సందర్శించారు. ఇప్పటివరకు ఎంత మొత్తంలో కొనుగోలు చేశారనే విషయాలను నిర్వాహకుల నుంచి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జేసీ దృష్టికి తెచ్చారు. ఆయన వెంట మండల […]

Read More
మెడికల్ కాలేజ్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా?

మెడికల్ కాలేజ్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా?

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లాకు మెడికల్ కాలేజీకి ఉంటే కరోనా విషయంలో ఈ పరిస్థితి ఉండేదా? అని కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు ప్రశ్నించారు. మంగళవారం రామడుగు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ మాట కూడా ఎత్తకపోవడం జిల్లా ప్రజలను మోసం చేసినట్లు కాదా? అని ప్రశ్నించారు. మంత్రి గంగుల కమలాకర్, జిల్లా ఎమ్మెల్యేలు కనీసం జిల్లా ప్రజల ఆరోగ్య అవసరాల […]

Read More
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గోపాల్ రావు పేట్ లో ప్రతి లచ్చయ్య ఇటీవల కరోనతో మృతిచెందాడు. కుటుంబాన్ని ఆదుకునేందుకు యువకులు సేకరించిన రూ.40వేలను మంగళవారం బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కర్ర సత్యప్రసన్న, ఎంపీటీసీ ఎడవెళ్లి నరేందర్, ఉపసర్పంచ్ ఎడవెళ్లి మధుసూదన్ రెడ్డి, ఎక్సైజ్ ఎస్సై విజయ్, సిద్దార్థ, పురాణం రమేష్, టేకు రాజేశం పాల్గొన్నారు.

Read More