సారథి, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత పల్లెప్రగతి కార్యక్రమం కరీంనగర్ జిల్లా రామడుగు మండల వ్యాప్తంగా గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆయా గ్రామాల్లో నాయకులు, ప్రత్యేకాధికారులు పాల్గొని మొక్కలు నాటి పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. కొరటపల్లి గ్రామంలో ప్రత్యేకాధికారి మౌనిక ఆధ్వర్యంలో ఎంపీపీ కల్గెటి కవిత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నిర్దేశించిన ప్రకారం మొక్కలు నాటాలని, పాడుబడిన ఇండ్లను పూడ్చివేయాలని, శానిటేషన్ పనులు చేపట్టాలని సూచించారు. ప్రతిఇంటిలో ఆరు మొక్కలు నాటాలని ఎంపీపీ […]
ఫొటోలకు ఫోజులు వద్దు.. పనులు చేయండి ప్రజలను భాగస్వాములు చేయండి జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య సారథి, మానవపాడు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 4వ విడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య కోరారు. బుధవారం మానవపాడు ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎంపీపీ కోట్ల అశోక్ రెడ్డి అధ్యక్షతన ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్పర్సన్, జిల్లా అదనపు కలెక్టర్ […]
సారథి, చొప్పదండి: పల్లెలు ప్రగతి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని కరీంనగర్జిల్లా చొప్పదండి ఎంపీపీ చిలుక రవీందర్ అన్నారు. గురువారం చొప్పదండి మండలంలోని రాగంపేట గ్రామంలో బుధవారం సాయంత్రం నుంచి గురువారం వరకు పల్లెనిద్ర పేరున పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తున్న పంచాయతీల ప్రగతి పర్యవేక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొక్కల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని తెలిపారు. ఖాళీస్థలాల్లో విరివిగా పెంచాలని సూచించారు. రాగంపేటలో ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్ […]
సారథి ప్రతినిధి, జగిత్యాల: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ సూచించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలని ఆకాంక్షించారు. శుక్రవారం జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ లో ఆమె మాట్లాడారు. గ్రామ, మండలస్థాయిలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు అయ్యేలా చూడాలని కోరారు. నీడనిచ్చే మొక్కలు, పూలమొక్కలు, ఔషధం(హెర్బల్) మొక్కలను పెంచి వచ్చే హరితహారంలో నాటేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైకుంఠధామం పనులను పూర్తయ్యేలా […]
సారథి, పెద్దకొత్తపల్లి(కొల్లాపూర్): గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఎంపీడీవో కృష్ణయ్య సూచించారు. బుధవారం స్థానిక ఎంపీడీవో ఆఫీసులో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతుల కల్లాలు, వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, పలు రకాల పనుల పురోగతిపై మాట్లాడారు. వానాకాలంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
సారథి, రాయికల్: కరీంనగర్ జిల్లా రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను జగిత్యాల జిల్లా డీఆర్డీఏ విజిలెన్స్ విభాగం అసిస్టెంట్ మేనేజర్ దేవేందర్ రెడ్డి, డీఆర్డీఏ జిల్లా ఎస్బీఎం కన్సల్టెంట్ జి.చిరంజీవి శుక్రవారం పరిశీలించారు. వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్, సానిటరీ వర్క్, పరిశుభ్రత, నర్సరీ, పల్లెప్రకృతి వనం పనులను పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన పనులపై సంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఇనుముల రమేష్, ఎంపీవో శ్రీనివాస్, సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, ఉపసర్పంచ్ అన్నవేణి వేణు, […]
సారథి న్యూస్, నిజాంపేట: తడి, పొడి చెత్తసేకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పల్లెప్రగతి పనులను యాప్ లో నమోదు చేయాలని మెదక్ జిల్లా సీఈవో వెంకట శైలేష్ సూచించారు. శుక్రవారం మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో ఆయన పర్యటించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి దిశగా ప్రయాణిస్తాయని అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటలక్ష్మి, సర్పంచ్ కృష్ణవేణి, మధుసూదన్ రెడ్డి, ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు పాల్గొన్నారు
సారథి న్యూస్, ములుగు: ప్రజావిజ్ఞప్తుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ముగులు జిల్లా అడిషనల్కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో అధికారులతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఈ–ఫైలింగ్ ద్వారా ప్రభుత్వ కార్యాకలాపాలు నిర్వహించాలని సూచించారు. ప్రజావాణికి అధికారులంతా తప్పనిసరిగా నివేదికలతో రావాలని సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 1,842 విజ్ఞప్తులు రాగా, 1,335 పరిష్కరించినట్లు వివరించారు. పల్లెప్రగతి పనులు వెంటవెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జడ్పీ సీఈవో […]