ఒలంపిక్స్ బాయ్ కాట్ పై అమెరికాకు చైనా వార్నింగ్ బీజింగ్: వచ్చే ఏడాది చైనాలోని బీజింగ్లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్ను అమెరికా బాయ్కాట్ చేసింది. దీనిపై డ్రాగన్ దేశం చైనా రియాక్ట్ అయ్యింది. అమెరికా చేపట్టిన దౌత్యపరమైన బహిష్కరణను చైనా ఖండించింది. దీనిపై ప్రతీకారం తీర్చుకోనున్నట్లు కూడా చైనా హెచ్చరించింది.ఆ దేశ విదేశాంగ మంత్రి జావో లిజియాన్ ఈ అంశం గురించి మీడియాతో మాట్లాడుతూ.. తాము కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని, కానీ వాటికి సంబంధించిన వివరాలను […]
సారథి న్యూస్, హైదరాబాద్: జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం దివంగత మేజర్ ధ్యాన్ చంద్ 115వ జయంతిని పురస్కరించుకుని గచ్చిబౌలిలోని ఆయన విగ్రహానికి క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్ లో భారత్ కు వరుసగా 1928, 1932, 1936లో పసిడి ఫలితాలు అందించి.. హాకీకి ధ్యాన్ చంద్ స్వర్ణయుగం అందించారని కొనియాడారు. ఏటా ఆగస్టు 29న […]
టోక్యో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. వచ్చే ఏడాది ఒలింపిక్స్ను నిర్వహించవద్దని సగానిపైగా టోక్యో ప్రజలు కోరుకుంటున్నారు. ఈ క్రీడల పండుగను పూర్తిగా రద్దుచేయాలని అభిప్రాయపడుతున్నారు. జపాన్కు చెందిన కైడో న్యూస్, టోక్యో ఎంఎక్స్ టెలివిజన్ అనే వార్త సంస్థలు నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేలింది. ఈనెల 26 నుంచి 28 వరకు టెలిఫోన్ ద్వారా జరిపిన సర్వేలో మొత్తం 1,030 మంది పాల్గొన్నారు. ఇందులో 51.7 శాతం మంది ప్రజలు క్రీడలను వాయిదా […]
సారథి న్యూస్, హైదరాబాద్: ఒలింపిక్డే సందర్భంగా హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని తన నివాసం నుంచి ఒలంపిక్స్ఉత్సవాలను మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ప్రారంభించారు. జిమ్నాస్టిక్క్రీడాకారుల విన్యాసాలు చూసి ముగ్ధులయ్యారు. వారిని అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి సాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
టోక్యో: నాలుగేళ్లకు ఓసారి వచ్చే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని ప్రపంచం మొత్తం గుర్తు పెట్టుకునేలా చాలా అట్టహాసంగా నిర్వహిస్తారు. తమ స్థాయి, పరపతి, ప్రతిష్టను ఇతర దేశాలకు చూపెట్టాలనే ఉద్దేశంతో నిర్వాహకులు కూడా భారీమొత్తంలో ఖర్చుచేస్తారు. కానీ టోక్యో ఒలింపిక్స్ ఇందుకు అతీతం కానుంది. కరోనా దెబ్బకు ఒలింపిక్స్ ఏడాది వాయిదా పడడంతో ఇప్పటికే ఖర్చు తడిసి మోపడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవాన్ని కూడా అట్టహాసంగా నిర్వహించాలంటే మరింత ఖర్చు చేయాల్సిన పని. […]
టెక్సాస్: 1956 ఒలింపిక్స్లో మూడు బంగారు పతకాలు సాధించిన బాబీ జో మోరో(84) మరణించారు. టెక్సాస్లోని తన సొంత ఇంట్లో ఆయన చనిపోయారని కుటుంబసభ్యులు ప్రకటించారు. అనారోగ్య కారణాల వల్ల చనిపోయారన్నారు. 1955 అమెచ్యూర్ అథ్లెటిక్ యూనియన్ 100 మటర్ల పందేన్ని గెలుచిన మోరో.. 1950లలో అత్యంత ఆధిపత్య స్ర్పింటర్లలో ఒకరు. 1956లో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరిగిన ఒలింపిక్స్లో మోడో మూడు స్వర్ణాలు సాధించారు. అదే అతడి అత్యంత విజయవంతమైన ఏడాది.
ఐవోసీ సభ్యులతో థామస్ బాచ్ చర్చలు లుసానే: టోక్యో ఒలింపిక్స్ను వాయిదా వేసిన తర్వాత.. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) చీఫ్ థామస్ బాచ్.. తొలిసారి తమ సభ్యులతో వరుసపెట్టి చర్చలు జరిపారు. వైరస్ వ్యాప్తి, కంట్రోలు, ఒలింపిక్స్ నిర్వహణపై సభ్యుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. భాష, టైమ్ జోన్ ప్రకారం సుమారు వంద మంది ఐవోసీ సభ్యులతో మాట్లాడారు. ‘ఒలింపిక్ సీజన్ ఎలా ఉండాలనే దానిపై చర్చలు జరిపాం. టోక్యో ఒలింపిక్స్పై ఎలా ముందుకెళ్లాలి. సన్నాహాకాలు, క్వాలిఫయింగ్ […]
ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ టోక్యో: అనివార్య కారణాలతో వచ్చే ఏడాది ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. గేమ్స్ రద్దవుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ స్పష్టం చేశారు. మరో ఏడాది వాయిదా వేసే అవకాశం ఎంతమాత్రం లేదన్నారు. ‘జపాన్ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. దాదాపు ఐదువేల మందితో కూడిన నిర్వాహక కమిటీని నిరంతరం నడపం చాలా కష్టం. ప్రతి ఏడాది మిగతా క్రీడాసమాఖ్యలు కూడా షెడ్యూల్స్ను మార్చుకోవు. అథ్లెట్లు కూడా […]