జేఈఈ మెయిన్, అడ్వాన్స్, నీట్ అభ్యర్థులకు నిపుణుల సూచనలు పరీక్షల్లో సమయ సద్వినియోగమే కీలకం ప్రణాళికతో కూడిన సంసిద్ధత అవసరం చిన్నజాగ్రత్తలతో ఒత్తిడిని జయించండి పాజిటివ్ఆలోచనలతో సత్ఫలితాలు :: కె.నరహరిగౌడ్, సామాజిక సారథి, ప్రత్యేక ప్రతినిధి ఇంటర్మీడియట్.. విద్యార్థుల జీవితంలో ముఖ్యమైన మలుపు. ఇక్కడే తమ బిడ్డ జాగ్రత్తగా అడుగు వేయాలనీ, సురక్షితంగా ఒడ్డుకు చేరాలని ఏ తల్లితండ్రులైనా కోరుకుంటారు. డాక్టర్, ఇంజనీర్కావాలనుకునే వారి కలలు సాకారం చేరుకోవాలన్నా ఈ చౌరస్తా దాటాల్సిందే. ఐఐటీ, ఎన్ఐటీ, తదితర […]
మా కూతురుకు ఏమైందో చెప్పండి మాధవి తల్లిదండ్రుల కన్నీటివేదన ప్రతిభ కాలేజీ ఎదుట ఆందోళన కలెక్టర్, ఎస్పీ న్యాయం చేయాలని వేడుకోలు సామాజికసారథి, మహబూబ్నగర్: ‘చిన్నప్పటి నుంచి బిడ్డను అల్లారుముద్దుగా పెంచుతున్నాం. ఏ కష్టం రాకుండా చూసుకున్నాం. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాం. డాక్టర్అయితనంటే మీ కాలేజీలో నేర్పించాం. లక్షలు చేర్పించాం. కాలేజీకి వచ్చిన బిడ్డ మాయమైంది. చెట్టంతా ఎదిగి కూతురు మమ్ముల్ని సాకుతదనుకుంటే శవమై వచ్చింది. ఏం జరిగిందో అంతుచిక్కడం లేదు. ఎలా చనిపోయిందో.. ఏమైందో చెప్పండి. […]
న్యూఢిల్లీ: నీట్, జేఈఈ పరీక్షలు యధాతథంగానే జరుగుతాయని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఆగస్టు 17న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించడం కుదరదని తేల్చిచెప్పింది. నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని ఆరురాష్ట్రాల మంత్రలు వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టి వేసింది. కాగా, ఇప్పటికే జేఈఈ మెయిన్స్-2020 పరీక్షలు సెప్టెంబర్ 1న ప్రారంభమయ్యాయి. 6వ తేదీ వరకూ జరగనున్నాయి. ఈనెల 13న నీట్ పరీక్ష జరగనుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు, పలు […]
హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్లో ఎగ్జామ్ జరగనుంది. ఇందుకోసం తెలంగాణలో 79, ఏపీలో 23 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈసారి జరిగే ఎంసెట్ కు 1,43,165 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సెప్టెంబర్3 నుంచి ఈనెల 7వ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే ఎంసెట్ నిర్వహించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఎగ్జామ్సెంటర్లకు వచ్చే అభ్యర్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించడంతో […]
ఢిల్లీ: నీట్, జేఈఈను ఆపాలంటూ విపక్షాలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నాయి. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విపక్ష పార్టీల సీఎంలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నీట్, జేఈఈ అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. ఆమె మొదటి నుంచి ఈ పరీక్షలను రద్దు చేయాలని కోరుతున్నారు. ఇటీవలే ప్రధాని మోడీకి లేఖ […]
న్యూఢిల్లీ: జేఈఈ, నీట్ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందుగా నిర్ణయించన ప్రకారమే పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో జేఈఈ, నీట్ను వాయిదా వేయాలని 11 మంది విద్యార్థులు సుప్రీంను ఆశ్రయించారు. సోమవారం వారి పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పలు కీలకవ్యాఖ్యలు చేసింది. పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులు నష్టపోతారని కోర్టు అభిప్రాయపడింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. వచ్చే […]