ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేశ్రెడ్డి సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: వచ్చే శాసనసభ ఎన్నికల్లో పార్టీలు ఏదైనా పోటీచేయక మాత్రం తప్పదని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు డాక్టర్ రాజేశ్రెడ్డి వెల్లడించారు. సోమవారం ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి 76వ జన్మదిన వేడుకలను వారి నివాసంలో కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకున్నారు. వెయ్యి మందికి పైగా కార్యకర్తలు చేరి కేక్కట్ చేస్తూ రాజేశ్రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజేశ్రెడ్డి […]
సామాజిసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: తనకు దిగవంత మంత్రి పుట్టపాగ మహేంద్రనాథే తనకు స్ఫూర్తి అని ఎమ్మెల్సీ కూచు కుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇంత మందికి సేవ చేస్తున్నప్పుడు.. స్థితిమంతమైన కుటుంబంలో పుట్టిన నేనేందుకు చేయకూడదో అనే భావనతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తన రాజకీయ అరంగేట్రను గుర్తుచేసుకున్నారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, చివరిదాకా వారితోనే ఉంటానని ప్రకటించారు. తన వారసుడిగా తన కుమారుడుకు వచ్చే […]
అధికారంలో ఉన్నామని విర్రవీగొద్దు కొడుకుపై దాడి జరిగితే ఎమ్మెల్యేతో కాంప్రమైజ్ దళిత సంఘాలను ఆమె భర్త ఏనాడూ పట్టించుకోలేదు ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరిగిల్ల దశరథం సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జడ్పీ చైర్ పర్సన్ కుమారుడు గణేశ్దే ముమ్మాటికీ తప్పని తేలిందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరిగిల్ల దశరథం అన్నారు. చట్టం అందరికీ సమానమేనని జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి కుమారుడు వ్యవహరించిన తీరుపై తాము కూడా విచారణ చేశామని వాస్తవ విషయాలు తెలుసుకున్నామని తెలిపారు. […]
సామాజికసారథి, బిజినేపల్లి: ఓ తండ్రి పంతం, పట్టింపు నైజం.. పోలీసుల పట్టించుకోని తనం.. వెరసి ఓ చిన్నారి ప్రాణం గాల్లో కలిసింది. ఆపరేషన్ పత్రాలపై సకాలంలో సంతకం చేయకపోవడంతో ఆ బిడ్డ కన్నుమూసింది. ఈ విషాదకర సంఘటన ఆదివారం వెలుగుచూసింది. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం గుడ్లనర్వ గ్రామానికి చెందిన మహేశ్వరి, రేవెల్లి గ్రామానికి చెందిన టపా మహేష్ కు మూడేళ్ల క్రితం వివాహమైంది. అన్యోన్యంగా ఉన్న ఆ దంపతులకు కూతురు పుట్టింది. ఆ చిన్నారికి ఇప్పుడు […]
ఛత్రపతి శివాజీ సేన పేరుతో ఓ యువకుడి హుకుం సామాజికసారథి, బిజినేపల్లి: ఒకరు ప్రపంచ మేధావి.. దేశానికే అత్యుత్తమమైన రాజ్యాంగాన్ని అందించినవారు. మరొకరు పీడిత ప్రజలకు చదువులు చెప్పించి చైతన్యం నింపిన మహానుభావుడు. ఆ మహనీయులే భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మరొకరు మహాత్మా జ్యోతిబాపూలే. వారిద్దరి మార్గంలో నడవని వారంటూ ఉండరు. ఆ మహనీయుల విగ్రహాలు ఉండని ఊరంటూ లేదు. ఈ క్రమంలో నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్ పల్లిలో పీడిత, బహుజనవర్గాల ప్రజలు […]
ఒక ఇంట్లో ఇద్దరికి.. ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్ ఆసరా లబ్ధిదారుల ఎంపికలో భారీ అక్రమాలు అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా లిస్టుల తయారీ ఓకే చెబుతున్న అధికారులు.. అర్హులకు అన్యాయం సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పలు సంక్షేమ పథకాల అమలు విమర్శలకు దారితీస్తున్నది. ఏదైనా కొత్త సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడితే గైడ్లైన్ ప్రకారం అధికారులు లబ్ధిదారులను ఎంపికచేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా అధికారపార్టీ […]
నకిలీ కాల్ లెటర్ తో నిరుద్యోగికి టోకరా చాలా మంది నుంచి లక్షలాది రూపాయలు వసూలు దళిత బంధువులో పలువురికి ట్రాక్టర్లు ఇప్పిస్తానని మోసం పడిగాపులు గాస్తున్న బాధితులు సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో ఓ మాయదారి మల్లిగాడు నిరుద్యోగులను నిలువునా ముంచాడు. ఉద్యోగం ఇప్పిస్తానని రూ.4లక్షలు తీసుకుని ఉత్తుత్తి కాల్లెటర్ఇచ్చి ఉడాయించాడు. ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగుచూసింది. బాధితుడి కథనం.. బిజినేపల్లి మండల కేంద్రానికి చెందిన మల్లేశ్ గౌడ్ చిన్న చిన్న దందాలు […]
సామాజికసారథి, నాగర్కర్నూల్ ప్రతినిధి: రాజకీయ లబ్ధి కోసమే అసత్య ప్రచారాలు చేస్తున్న బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ జనసమితి నాయకులు మెడికల్ కాలేజీ విషయంలో మాట్లాడం సిగ్గుచేటని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి అభిమాన్య, తెలంగాణ మాలమహానాడు నాయకులు ఎద్దుల వెంకటేశ్, కొమ్ము మోహన్, వీరేశం, శ్రీనివాస్, రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బాలరాజు, మైనారిటీ నాయకులు రహీం, ఎస్టీ నాయకులు ఆశన్న అన్నారు. శుక్రవారం వారు మీడియాతో […]