Breaking News

CM KCR

జోగుళాంబ సన్నిధిలో సీఎం కుటుంబసభ్యులు

జోగుళాంబ సన్నిధిలో సీఎం కుటుంబసభ్యులు

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల(మానవపాడు): అష్టాదశశక్తి పీఠాల్లో ఒకటైన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ జోగుళాంబ అమ్మవారిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబసభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్​ సతీమణి కల్వకుంట్ల శోభ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ ​సతీమణి శైలిమ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. సహస్ర కలశాభిషేకంలో పాల్గొని అమ్మవారి నిజరూప దర్శనం చేసుకున్నారు. ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం […]

Read More
ఇందిరమ్మ ఇస్తే కేసీఆర్ గుంజుకుంటుండు

ఇందిరమ్మ ఇస్తే సీఎం కేసీఆర్ గుంజుకుంటుండు

ఉద్దండాపూర్ గ్రామస్తులకు న్యాయం చేయాలి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రైతులతో ముఖాముఖి సారథి న్యూస్​, జడ్చర్ల: నాటి ఇందిరమ్మ ప్రభుత్వం దళిత, గిరిజన పేదప్రజలకు భూములు ఇస్తే సీఎం కేసీఆర్ గుంజుకుంటున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో పర్యటించారు. రైతులతో మాట్లాడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్దండాపూర్ గ్రామస్తులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని […]

Read More
జీహెచ్​ఎంసీ మేయర్​గా గద్వాల విజయలక్ష్మి

జీహెచ్​ఎంసీ మేయర్​గా గద్వాల విజయలక్ష్మి

డిప్యూటీ మేయర్​గా మోతే శ్రీలతరెడ్డి ఎన్నిక నూతన పాలకవర్గాన్నిఅభినందించిన మంత్రులు, ఎమ్మెల్యేలు సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్​మేయర్ గా టీఆర్ఎస్​నుంచి గెలుపొందిన బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా తార్నాక టీఆర్ఎస్ కార్పొరేటర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి చేతులమీదుగా ధ్రువీకరణపత్రాలను గురువారం అందుకున్నారు. వారిని డిప్యూటీ స్పీకర్​ తిగుళ్ల పద్మారావుగౌడ్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, తలసాని […]

Read More
విశ్వనగరానికి పేరు తీసుకొద్దాం

విశ్వనగరానికి పేరు తీసుకొద్దాం

అన్ని కులాలు, మతాలను ప్రేమించండి ప్రజాజీవితంలో మంచిపేరు తెచ్చుకోవాలి సంయమనం, సహనం, సాదాసీదాగా ఉండాలి మేయర్​, డిప్యూటీ మేయర్​, కార్పొరేటర్లతో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, హైదరాబాద్: విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచేలా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటుపడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ మేయర్ […]

Read More
నల్లగొండ గోసవడ్డది

నల్లగొండ గోసవడ్డది

ఫ్లోరైడ్​ బాధితులను ఎవరూ పట్టించుకోలేదు ఇంటింటికీ నీళ్లిచ్చి వారి బాధలు తీర్చినం గోదావరి నీటితో జిల్లారైతుల కాళ్లు కడుగుతం బీజేపీ వారు సంస్కారం నేర్చుకోవాలి సహనానికి కూడా హద్దు ఉంటది.. టైం వస్తే తొక్కిపడేస్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగ ధన్యవాదసభలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, నల్లగొండ: అనాదిగా నల్లగొండ జిల్లా నష్టాలు, కష్టాలకు గురైందని, ఎవరూ పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యపాలకులు చిన్నచూపు చూశారని ధ్వజమెత్తారు. నాగార్జునసాగర్ ​డ్యాం ఏలేశ్వరం […]

Read More
‘ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేయడమే’

‘ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యవస్థను అపహాస్యం చేయడమే’

సారథి న్యూస్, రామాయంపేట: ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఓట్లేసి గెలిపించిన సీఎం కుర్చీని ఎడమకాలు చెప్పుతో సమానమని చెప్పిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యన్ని, రాజ్యాంగ వ్యవస్థను అవమానించినట్లేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. ఫామ్ హౌస్ ను వదలని.. ప్రగతి భవన్ ను దాటని ముఖ్యమంత్రి రాజీనామా చేసి చేతనైనవారికి పాలన వ్యవస్థను అప్పగించాలని హితవుపలికారు. సోమవారం ఆయన నిజాంపేట మండల కేంద్రంలో బిర్యానీ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఆ […]

Read More
జోగుళాంబదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు రండి

జోగుళాంబదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు రండి

సారథి న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 12 నుంచి 16వ తేదీ వరకు అలంపూర్ లో జరిగే జోగుళాంబదేవి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆయన కలిసిన వారిలో దేవాదాయశాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ​గువ్వల బాలరాజ్​, ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాశ్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Read More
ఆరోగ్యంగానే ఉన్నా.. నేనే కొనసాగుతా

ఆరోగ్యంగానే ఉన్నా.. నేనే ఉంటా

తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు ఉండబోదు క్లారిటీ ఇచ్చిన సీఎం కె.చంద్రశేఖర్​రావు టీఆర్ఎస్​ కార్యవర్గ సమావేశంలో వెల్లడి సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని టీఆర్ఎస్​అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టత ఇచ్చారు. ఈ అంశంపై కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. సీఎంగా తానే కొనసాగుతానని తేల్చిచెప్పారు. ఆదివారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా తానే ఉంటానని అసెంబ్లీ సాక్షిగా ఇంతకుముందే చెప్పినా ఎందుకు […]

Read More