ఇండస్ట్రీలోనూ.. పాలిటిక్స్ లోనూ తిట్టుకోవడం.. కలిసిపోవడం కామన్ అయిపోయినట్టుంది. మొన్నటికి మొన్న బాలయ్యబాబును ఉద్దేశించి నాగబాబు ఏకంగా యూట్యూబ్ లో తన అక్కసు అంతా వెళ్లబెట్టారు. ఇప్పుడేమో తన తమ్ముడు, బాలయ్య కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ .. ‘2 బ్రదర్స్ కలిసి .. నా తమ్ముడు అలాగే మరొకరు మరొక తల్లి కొడుకు ..సోదర సమానుడు నందమూరి లయన్ను పవర్ స్టార్ కలిసిన రోజు..’ అంటూ కొటేషన్ తో సహా పోస్ట్ చేశారు. అప్పుడే […]
సారథిన్యూస్, అమరావతి: వైఎస్సార్ ఆసరా పేరుతో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకానికి జగనన్న టోకరా అనే పేరుపెట్టుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘జగన్ మోహన్రెడ్డి ఆసరా పేరుతో మహిళలను మోసగిస్తున్నారు. డ్వాక్రా మహిళలంతా ఆసరా సొమ్ముతోనే బతుకుతున్నట్లు జగన్ తొత్తులు మాట్లాడుతున్నారు. ఈ పథకం జగన్మోహన్రెడ్డి కొత్తగా తీసుకురాలేదు. గత ప్రభుత్వంలోనే చంద్రబాబు డ్వాక్రా మహిళలకు రూ. 5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు […]
తాడేపల్లి: ‘అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దది. టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ కూడా ఈ స్కామ్లో ఉన్నారు. అమరావతి అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్రాన్ని కోరాం. సీబీఐ విచారణతో అందరిజాతకాలు బయటకొస్తాయి’ అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో బినామీ పేర్లతో 4 వేల 69 ఎకరాలు కొనుగోలు చేశారు. ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నది. ఫైబర్ గ్రిడ్ పేరుతో […]
అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో డిపోలకే పరిమితమైన సిటీ ఆర్టీసీ బస్సు సర్వీసులు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్డౌన్ సడలింపు తర్వాత జిల్లాల మధ్య బస్సులు తిరుగుతున్నా నగరాలు, పట్టణాల్లో మాత్రం సిటీ బస్సులు నడపడం లేదు. ఈనెల 7న సిటీ బస్సులను షురూ చేసేందుకు సన్నాహాలు చేసినా చివరి నిమిషంలో వాయిదాపడింది. దీంతో త్వరలో ప్రధాన నగరాల్లో సిటీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సంస్థ కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో […]
సారథిన్యూస్, అమరావతి: జగన్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు వైఎస్సార్సీపీ గుండాలు తనను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. వాళ్ల బెదిరింపులకు తాను బెదిరిపోయే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. తనకు రోజుకు 10 సార్లు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీతో తొక్కించి చంపుతామని బెదిరించినట్లు ఉమ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రోత్సాహంతోనే వైసీపీ మంత్రులు బెదిరిస్తున్నారని చెప్పారు. తనకు బెదిరింపు కాల్స్ […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం(24 గంటల్లో) 9,999 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,47,686కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 77 మంది మృతిచెందారు. మొత్తంగా ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,779కు చేరింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో 44,52,128 వ్యాధి నిర్ధారణ టెస్టులు చేశారు. గత 24 గంటల్లో 71,137 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఒకేరోజు 11,069 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. […]
సారథిన్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి, జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను గురువారం యువ ఎమ్మెల్యేలు ఎంఏ హఫీజ్ఖాన్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ గురువారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే పెండింగ్ పనులను పూర్తిచేయాలని ఇన్చార్జ్ మంత్రి అనిల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా, ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్ఖాన్ తెలిపారు.
అమరావతి: ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి శాసనరాజధానిగా వద్దంటూ ఆయన పేర్కొన్నారు. ‘పేదలకు అమరావతిలో ఇళ్లస్థలాలు కూడా ఇవ్వనివ్వకుండా ఇక్కడి రైతుల కోర్టుకెక్కి అండుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతిని శాసనరాజధానిగా కూడా పెట్టవద్దు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ విషయాన్ని నేను స్వయంగా సీఎం జగన్మోహన్రెడ్డికి చెప్పాను’ సీఎం జగన్ పేదలపక్షపాతిగా పనిచేస్తుంటే.. నీచుడైన చంద్రబాబు అడ్డుకుంటున్నాడని.. కోర్టులకు ఎక్కి అడ్డంకులు సృష్టిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబును ఏదో ఒకరోజు […]