మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ అనే ఓ బ్యానర్ను స్థాపించి వెబ్సీరిస్ను నిర్మిస్తున్న విషయం తెలిసందే. ఆమె తన తల్లి సురేఖ చేతుల మీదగా ఈ ఓ వెబ్సిరీస్ను ప్రారంభించారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ కీలకపాత్ర పోషిస్తుండగా.. ‘ఓయ్’ ఫేమ్ ఆనంద్ రంగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. కొన్నిరోజుల పాటు షూటింగ్ కూడా చేశారు. కానీ కరోనాతో ప్రస్తుతం షూటింగ్ నిలిచిపోయింది. దీంతో సుష్మితా చాలా నిరుత్సాహానికి గురయ్యారట. […]
బెంగళూరు: ప్రభుత్వాలు కరోనా లక్షణాలు ఉన్నవారికి టెస్టులు చేసి.. వారికి వ్యాధి నిర్ధారణ అయితే క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు టెస్టులు చేయించుకొనే సమయంలో తప్పుడు ఫోన్నంబర్లు, అడ్రస్ ఇస్తూ తప్పించుకుపోతున్నారు. దీని వల్ల వారు కరోనాను వ్యాప్తి చేస్తున్నారని ప్రభుత్వాలు భయపడుతున్నాయి. బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) సిబ్బందికి అందుబాటులో లేకుండా పోయిన వారి సంఖ్య ఏకంగా 11 వేల వరకూ ఉన్నట్టు సమాచారం. వాళ్లందరికీ కరోనా పాజిటివ్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 1,640 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇప్పటివరకు 52,466 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా, మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 447 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 3, 37, 771 శాంపిల్టెస్టులు నిర్వహించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 683 నమోదయ్యాయి. అలాగే జయశంకర్ భూపాలపల్లి 24, కామారెడ్డి 56, కరీంనగర్100, మహబూబాబాద్44, మెదక్22, మేడ్చల్30, నాగర్కర్నూల్52, నల్లగొండ 42, పెద్దపల్లి […]
బెంగళూర్: పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో 90 మందికి కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగింది. బెంగళూరు సమీపంలోని థణిసంద్ర పోలీస్ శిక్షణా కేంద్రంలో ఓ కానిస్టేబుల్కి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ట్రైనింగ్ సెంటర్లోని అందరికీ కరోనా ర్యాండమ్ పరీక్ష నిర్వహించారు. ఈ సమయంలో వారిలో 90 మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా చేరిన దాదాపు 400 మంది కానిస్టేబుళ్లు పోలీస్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందుతున్నారు. ప్రైమరీ కాంటాక్ట్లో […]
సారథి న్యూస్ ఆదిలాబాద్: కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఆదిలాబాద్లో ప్రస్తుతం కరోనా కేసులు పేరుగుతున్నాయి. జిల్లాలో రోజుకు పదుల సంఖ్యలో కేసులు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఓఎస్డీ, కలెక్టర్ క్యాంప్ క్లర్క్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న మిగిలిన సిబ్బందికి అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు శుక్రవారం వీరంతా శాంపిల్స్ ఇచ్చారు. కాగా ఇటీవల కలెక్టర్రేట్కు వచ్చినవారిలో […]
ఢిల్లీ: కరోనాతో బాధపడుతూ దవాఖానలో చేరిన ఓ బాలిక(14)ను మరో కరోనా పేషెంట్ లైంగికంగా వేధించాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని కోవిడ్ కేర్సెంటర్లో గురువారం వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన ఓ బాలికకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో కోవిడ్ సెంటర్లో చికిత్సపొందుతున్నది. కాగా అక్కడే చికిత్సపొందుతున్న మరో కరోనా బాధితుడు బాలికపై టాయిలెట్రూంలో లైంగికదాడికి యత్నించాడు. ఈ దృశ్యాన్ని మరో వ్యక్తి తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. బాలిక కేకలు పెట్టడంతో ఇతర రోగులు అక్కడికి […]
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుష ఘటన చోటుచేసుకున్నది. కరోనా నిర్ధారణ అయిన రోగుల ఇండ్లను మున్సిపల్ సిబ్బంది మెటల్తో సీలు చేశారు. బెంగళూరులోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న రెండు కుటుంబాలవారికి కరోనా సోకింది. దీంతో మున్సిపల్ సిబ్బంది వారి ఇండ్ల తలుపులకు ఇనుప రేకులను బిగించి వాటిని మేకులతో కొట్టి బిగించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఘటనపై సోషల్ […]
ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగానే ఉంటున్నదని వైద్యశాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇప్పటివరకు భారత్లో 8 లక్షల మంది కోరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కాగా గత 24 గంటల్లో 49,310 మంది కొత్తగా కరోనా బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 12,87,945 లకు ఎగబాకింది. ఇప్పటివరకు 30,601 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 4,40,135 […]