Breaking News

హుస్నాబాద్

వాగులో చిక్కిన డ్రైవర్.. శ్రమించిన రెస్క్యూ టీం

వాగులో చిక్కిన డ్రైవర్.. శ్రమించిన రెస్క్యూ టీం

సారథి న్యూస్, హుస్నాబాద్: వాగు నీటిలో కొట్టుకుపోయిన లారీడ్రైవర్ ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. చివరికి ఆచూకీ లభించకపోడంతో వెనుదిరిగాయి. ఇటీవల కురిసిన భారీవర్షాలకు సిద్దిపేట జిల్లా కొహెడ మండలం బస్వాపూర్ గ్రామ సమీపంలోని మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం తెల్లవారుజామున వరంగల్లు వైపునకు లారీ(టీఎస్ 02 యూబీ 1,836) వెళ్తోంది. ఈ క్రమంలో డ్రైవర్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముదిమడక శంకర్(37) ఎప్పటిలాగే వెళ్లేందుకు ప్రయత్నించగా లారీ ఒక్కసారిగా […]

Read More
చెరువులు, కుంటలకు జలకళ

చెరువులు, కుంటలకు జలకళ

సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పల్లెచెరువు, మాదిగవాని కుంట, కొత్తచెరువు, పందిల్ల, అక్కన్నపేట మండలంలోని చౌటపల్లి, మల్లంపల్లి, నక్కలకుంట, తాళ్లచెరువు, కొహెడ మండలంలోని బస్వాపూర్, శనిగరం, బెజ్జంకి మండలం బేగంపేట పాతచెరువు, దాచారం, బెజ్జంకి క్రాసింగ్, గుగ్గిళ్ల, ముత్తన్నపేట, మద్దూర్ మండల పరిధిలోని కుటిగల్, గాగిళ్లపూర్, బైరాన్​పల్లి గ్రామాల్లోని పలు చెరువులు, కుంటలు నిండి […]

Read More

పోలీస్ ​గస్తీ మరింత పటిష్టం

సారథి న్యూస్, హుస్నాబాద్ : గ్రామాల్లో రాత్రి వెళల్లో పోలీస్​గస్తీని పటిష్ఠం చేయాలని ఏసీపీ సందేపొగు మహేందర్ అన్నారు. గురువారం కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన డివిజన్ స్థాయి నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలతో అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. దర్యాప్తలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ రఘు, […]

Read More
చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయండి

చేర్యాలను రెవెన్యూ డివిజన్​ చేయండి

సారథి న్యూస్, హుస్నాబాద్: చేర్యాలను రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్​ చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా చేర్యాలలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అన్ని అర్హతలు ఉన్న చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్​గా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, చిరంజీవులు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ జెడ్పీటీసీ కళావతి, బీజేపీ మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమారాణి, ఫార్వర్డ్​ బ్లాక్ పార్టీ జిల్లా కార్యదర్శి బీరన్న, […]

Read More

కులంపేరుతో దాడి

సారథి న్యూస్​, హుస్నాబాద్: గిరిజన మహిళా ఎంపీటీసీని కులంపేరుతో దూషించడమే కాక.. దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కపూర్ నాయక్ తండా సర్పంచ్ బానోతు సంతోష్ నాయక్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ కు వినతిపత్రం అందజేశారు. అక్కన్నపేట మండలం గండిపల్లిలో 11న గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో ఎంపీటీసీ బానోత్ ప్రమీలను సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్ భర్త మరి కొంత మంది అసభ్య పదజాలంతో దూషించడమే కాగా […]

Read More

రాజగృహపై దాడి అమానుషం

సారథి న్యూస్, హుస్నాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​కు చెందిన రాజగృహంపై దాడులు చేయడం అమానుషమని దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా కో కన్వీనర్​ సదన్​ మహారాజ్​ పేర్కొన్నారు. గురువారం దళితసంఘాల ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్​ జిల్లా అక్కన్నపేట మండల తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ముంబై నగరంలో ఉన్న అంబేద్కర్ చారిత్రక నివాస గృహంపై కొంతమంది ఉన్మాదులు దాడి చేయడం రాజ్యాంగ విలువలను […]

Read More
వీధి కుక్కలను తరలించండి

వీధి కుక్కలను తరలించండి

సారథి న్యూస్, హుస్నాబాద్: హుస్నాబాద్​మున్సిపాలిటీలో వీధికుక్కలు కాలనీవాసులు, చిన్నారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని, వాటిని వెంటనే తరలించాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్ బుధవారం మున్సిపల్​ అధికారులను కోరారు. పందులు, కుక్కలను తరలించాలని గతంలో తీర్మానించినా అది కాగితాలకే పరిమితమైందన్నారు. సీజనల్ వ్యాధుల విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి వార్డులో దోమల మందు పిచికారీ చేయాలని కోరారు.

Read More
భార్య మరణాన్ని జీర్ణించుకోలేక..

భార్య మరణాన్ని జీర్ణించుకోలేక..

సారథి న్యూస్, హుస్నాబాద్: తోడు లేని జీవితం అంతలోనే ముగిసింది.. కడ దాకా నీడగా ఉండాల్సిన భార్య అర్ధాంతరంగా కన్నుమూయడంతో ఆ హృదయం కన్నీటితో బరువెక్కింది. భార్య చనిపోయిన పదవ రోజునే ఆ భర్త గుండె ఆగిపోయింది. మరికొన్ని గంటల్లో ద్వాదశ దినకర్మ జారగల్సి ఉన్న ఆ ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన సోమవారం హుస్నాబాద్ పట్టణంలో ప్రతి ఒక్కరినీ కంట కన్నీరు పెట్టించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన కొత్తపల్లి లక్ష్మి […]

Read More