Breaking News

శ్రీశైలం

శ్రీశైలం మల్లన్న దర్శనానికి సర్వం సిద్ధం

శ్రీశైలం మల్లన్న దర్శనానికి సర్వం సిద్ధం

శ్రీశైలం: ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనాలు శుక్రవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి స్థానికులకు స్వామి, అమ్మవారి దర్శన భాగ్యం కల్పించనున్నారు. 15వ తేదీ నుంచి యథావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తులు ముందస్తుగానే www.srisailamonline.com వెబ్​సైట్​లో దర్శన టికెట్లు బుక్​చేసుకోవాలని ఈవో తెలిపారు

Read More
సాక్షిగణపతికి విశేష అభిషేకం

సాక్షిగణపతికి విశేష అభిషేకం

శ్రీశైలం: లోకకల్యాణం కోసం శ్రీశైలం దేవస్థానంలో బుధవారం ఉదయం సాక్షిగణపతికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష పుష్పార్చన, నివేదన కార్యక్రమాలు జరిపించారు. వైదిక సంప్రదాయాల్లో గణపతి అభిషేకానికి ప్రాముఖ్యం ఉంది. ఈ అభిషేకం ద్వారా అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలి, విజయం లభిస్తుందని చెబుతుంటారు. అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులు ఆలోచనా శక్తి పెరిగి విద్య బాగా వస్తుంది చెబుతుంటారు. శ్రీశైల క్షేత్ర పరివార ఆలయాల్లో సాక్షిగణపతి ఆలయానికి […]

Read More
మల్లన్న సన్నిధికి కృష్ణవేణి

మల్లన్న సన్నిధికి కృష్ణవేణి

జూరాల వద్ద కృష్ణమ్మ పరవళ్లు 25 గేట్లు ఎత్తి.. 2.02లక్షల క్యూసెక్కుల నీటి విడుదల శ్రీశైలం రిజర్వాయర్​కు తరలివస్తున్న వరద నీరు సారథి న్యూస్, కర్నూలు/మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు బిరబిరా మంటూ కృష్ణవేణి శ్రీశైలం మల్లన్న సన్నిధికి చేరుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యాం నిండుకుండలా మారి జలకళ సంతరించుకుంది. దీంతో గేట్లు ఎత్తివేయడంతో జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద […]

Read More
భ్రమరాంబదేవికి ఊయలసేవ

భ్రమరాంబదేవికి ఊయల సేవ

సారథి న్యూస్, శ్రీశైలం: లోకకల్యాణం కోసం పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం శ్రీశైలం భ్రమరాంబదేవి అమ్మవారి ఊయల సేవను వైభవంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి విశేషంగా స్తోత్రం, త్రిశతి, ఖడ్గమాల, సహస్ర నామపూజ, స్వామివారికి సహస్రనామార్చన జరిపించారు. చివరగా ఊయలసేవ నిర్వహించారు. స్వామి, అమ్మవారికి విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో దర్శనాలను పూర్తిగా నిలిపివేశామని, అర్చకస్వాములు భౌతిక దూరం పాటిస్తూ ఊయలసేవ విశేషార్చనలు జరిపించామని […]

Read More
సాగర్​కు జలకళ

సాగర్​కు జలకళ

సారథి న్యూస్​, నాగార్జునసాగర్‌ : నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం గురువారం సాయంత్రం క్రస్ట్‌గేట్లను తాకింది. ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు వద్ద విద్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌కు 40,259 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో గురువారానికి క్రస్ట్​గేట్ల లెవల్‌ (546 అడుగుల)కు నీటిమట్టం చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 13 రోజులుగా వరద వస్తుండగా, సాగర్‌ నీటిమట్టం రోజుకు ఒక అడుగు చొప్పున […]

Read More

శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద

సారథి న్యూస్​, కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 85,230 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 40,259 క్యూసెక్కులుగా ఉంది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా…ప్రస్తుతం నీటి మట్టం 853.80 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను… ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 88.8820 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6 […]

Read More
శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద

శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద

సారథి న్యూస్​, శ్రీశైలం : ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్​లోకి ఇన్‌ఫ్లో 56,614 క్యూసెక్కులు కాగా… అవుట్ ఫ్లో 38,140 క్యూసెక్కులుగా ఉంది. అలాగే జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం నీటి మట్టం 848.70 అడుగులుగా నమోదు అయ్యింది.ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 77.1732 టీఎంసీలు కాగా.. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలుగా ఉంది. వరద నీటి ప్రవాహంతో […]

Read More
శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు

శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు

సారథి న్యూస్, శ్రీశైలం(కర్నూలు): శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెరుగుతోంది. వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం జలాశాయానికి మరింత వరద వచ్చింది. ఈ సీజన్‌లో ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణ అధికారులు విద్యుదుత్పత్తి ప్రారంభించారు. 3 టర్బయిన్ల ద్వారా 0.474 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్ కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్​ఉత్పత్తిని ప్రారంభించలేదు. శ్రీశైలలం జలాశయానికి ప్రస్తుతం ఇన్ ఫ్లో 77,534 క్యూసెక్కులు కొనసాగుతోంది. రిజర్వాయర్​పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, […]

Read More