Breaking News

రామడుగు

‘హరితహారం’ పట్ల నిర్లక్ష్యం వద్దు

‘హరితహారం’ పట్ల నిర్లక్ష్యం వద్దు

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో జగిత్యాల ప్రధాన రహదారిపై హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, డీఆర్డీవో లంకల శ్రీలతరెడ్డి తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు హరితహారం కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీఓ, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

Read More
పెట్రో ధరలు తగ్గించాలి

పెట్రో ధరలు తగ్గించాలి

సారథి, రామడుగు: పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి సృజన్ కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా రామడుగు అంబేడ్కర్ చౌరస్తాలో ఎడ్లబండితో నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధర కాకుండా అన్నిరకాల నిత్యావసర వస్తువుల ధరలు పెంచి అన్నివర్గాల ప్రజలపై భారం మోపుతున్నారన మండిపడ్డారు. చిరువ్యాపారులు, రైతులపై పెట్రోల్, డీజిల్ […]

Read More
ఈటల చేరిక వేళ స్వీట్ల పంపిణీ

ఈటల చేరిక వేళ స్వీట్ల పంపిణీ

సారథి, రామడుగు: మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సందర్భంగా మంగళవారం స్థానిక ఆ పార్టీ నేతలు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలో బీజేపీ మండలాధ్యక్షుడు ఒంటెల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మత్స్య సెల్ మండలాధ్యక్షుడు బొజ్జ తిరుపతి స్వీట్లు పంచిపెట్టారు. ఈటల రాజేందర్ రాకతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎడవెల్లి రామ్, మండల ఉపాధ్యక్షుడు ఎడవెల్లి లక్ష్మణ్, కట్ట రవీందర్, […]

Read More
విత్తన దుకాణాల్లో తనిఖీ

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లి, రంగసాయిపల్లి కొక్కరకుంట గ్రామాల్లోని ఎరువులు, విత్తనాల విక్రయ దుకాణాలను మండల వ్యవసాయాధికారి యాస్మిన్ సోమవారం తనిఖీ చేశారు. షాపుల్లో నిల్వ ఉన్న స్టాక్, విత్తనాల లైసెన్సులు, పీసీ స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. డీలర్లు ఎరువులు, విత్తనాలను ఎమ్మార్పీకే విక్రయించాలని సూచించారు. రైతులకు డీలర్ల సంతకంతో కూడిన రసీదు తప్పకుండా ఇవ్వాలని ఆదేశించారు. లైసెన్సు ఉన్న షాపుల్లో మాత్రమే రైతులు ఎరువులు, విత్తనాలు కొనాలని కోరారు.

Read More
పేదలకు సరుకులు పంపిణీ

పేదలకు సరుకులు పంపిణీ

సారథి, రామడుగు: కరోనా మహమ్మారి పేదల బతుకులను ఛిద్రం చేసింది. ఈ సమయంలో బడుగు జీవులకు ఆపన్నహస్తం అందిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు ఎందరో మహానుభావులు. ఆదరణ సేవాసమితి, సర్వ్ టూ సొసైటీ సంయుక్తంగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తీర్మాలపూర్ గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. వారి చదువు పూర్తయినందున ఏదైనా ఉద్యోగ అవకాశం ఇప్పించే ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. అలాగే కొక్కెరకుంట గ్రామంలో […]

Read More
భాగ్యురాలికి ఎన్నారై ఆసరా

అభాగ్యురాలికి ఎన్నారై సాయం

సారథి, రామడుగు: తల్లిదండ్రులు కోల్పోయి అనాథగా మారిన ఎన్నారై ఒకరు సాయం చేశారు. రామడుగు మండలం తీర్మాలపూర్ గ్రామానికి చెందిన చెవుటు వీణాకు రైజింగ్ సన్ యూత్ క్లబ్ అమెరికాకు చెందిన ప్రముఖ ఎన్నారై జమలమడక అమృత సహకారంతో రూ.15వేల ఆర్థిక సహాయం అందజేశారు. యువజన సంఘం సభ్యులు శనివారం ఆమెకు ఇచ్చారు. ఈ సందర్భంగా రైజింగ్ సన్ యూత్ క్లబ్ అధ్యక్షుడు గజ్జెల అశోక్, బాధిత కుటుంబానికి ఆపన్నహస్తం అందించిన ఎన్నారై జమలమడక అమృతకు కృతజ్ఞతలు […]

Read More
కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పేదలకు అండ

కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పేదలకు అండ

సారథి, రామడుగు: కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ 45 మంది లబ్ధిదారులకు రూ.45,05,200 విలువైన చెక్కులను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నివర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆడపిల్లల పెళ్లి పేదలు అప్పుచేసి చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా ప్రతిఒక్కరికీ రూ.లక్ష నూట పదహార్లు నేరుగా అందిస్తున్నారని పేర్కొన్నారు. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో నాయకులంతా గుమికూడి చెక్కులు […]

Read More
ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి

సారథి, రామడుగు: మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ రామడుగు మండలాధ్యక్షుడు అమిరిశెట్టి సుధాకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఎన్టీఆర్ 98వ జయంతి వేడుకలను టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లుగా భావించి కూడు, గూడు గుడ్డ అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో టీడీపీని స్థాపించారని గుర్తుచేశారు. మద్యపాన నిషేధం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, జనతావస్త్రాలు, పటేల్ పట్వారీ […]

Read More