Breaking News

ప్రకాశం

లారీ ఢీకొని యువకుడు మృతి

సారథి న్యూస్, హుస్నాబాద్: వేగంగా వస్తున్న లారీ ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో చోటుచేసుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కొండసముద్రంకు చెందిన తాటిపర్తి చంద్రమౌళి(37) శనివారం హస్నాబాద్​కు వచ్చాడు. కాగా పట్టణంలోని నాగారం వద్ద రోడ్డు దాటుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రమౌళి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు లారీ డ్రైవర్​ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

Read More
ప్రకాశం పంతులు జీవితం ఆదర్శం

ప్రకాశం పంతులు జీవితం ఆదర్శం

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ జి.వీరపాండియన్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్​సమావేశ మందిరంలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ జి.వీరపాండియన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, జేసీ3(సంక్షేమం) సయ్యద్ ఖాజామోహిద్దీన్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జి.వీరపాండియన్ మాట్లాడుతూ.. తమిళనాడు, సమైక్యాంధ్ర రాష్ట్రాలకు తొలి సీఎంగా ఎన్నికై […]

Read More