సామాజిక సారథి, అచ్చంపేట: నల్లమల ప్రాంతమైన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో బీఎస్పీని బలోపేతం చేస్తామని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా కార్యదర్శి అడ్వకేట్ శ్రీనివాసులు అన్నారు. ఇతర పార్టీల నుంచి ఎంతో మంది పార్టీలో చేరుతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేస్తున్న సెక్టార్ కమిటీల నిర్మాణంలో భాగంగా శుక్రవారం పదర మండలంలో పలు కమిటీలను ఎన్నుకున్నారు. పదద, చిట్లంకుంట సెక్టార్ కమిటీల అధ్యక్షులుగా ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా లోకేష్, మరుకొందయ్య ఎన్నికయ్యారు. కార్యక్రమంలో పార్టీ […]
అధికారులపై పెట్రోల్ పోసిన మహిళారైతు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ రంగప్రవేశంతో సద్దుమణిగిన వివాదం సారథి, అచ్చంపేట: నాగర్కర్నూల్ జిల్లా నల్లమలలో పోడు భూముల వివాదం మరోసారి రగిలింది. అటవీశాఖ అధికారులు, ఆదివాసీ గిరిజనుల మధ్య అగ్గిరాజేసింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. అమ్రాబాద్ మండలం మాచారంలో 20 ఆదివాసీ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అదే గ్రామంలో సుమారు 60 ఎకరాల పోడు భూములను సాగుచేసుకుంటూ ఎన్నో ఏళ్లుగా జీవనోపాధి పొందుతున్నారు. […]
సారథి, అచ్చంపేట: తమ భూములకు రక్షణ కల్పించాలని నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం అంబగిరి గ్రామానికి చెందిన గిరిజన రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అటవీశాఖ అధికారులు గిరిజన రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ గతంలో ఉన్న ఫారెస్ట్ హద్దు కాకుండా సాగుభూముల్లో జేసీబీతో బౌండరీ తీయడానికి రావడంతో గిరిజనులు అడ్డుకున్నారు. ఈ భూములకు 2006లో అటవీహక్కుల చట్టం ప్రకారం దాదాపు 12 మంది రైతులకు పట్టాలిచ్చారు. అప్పటి నుంచి వారు వ్యవసాయం చేసుకుంటూ జీవనం […]
సారథి న్యూస్, అచ్చంపేట: మహాశివరాత్రి సందర్భంగా గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ నల్లమలలోని భౌరాపూర్ చెంచుపెంటలో భ్రమరాంబదేవి, మల్లిఖార్జున స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ దంపతులు, కలెక్టర్ ఎల్.శర్మన్ దంపతులు పాల్గొన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని చెంచులు తమ ఆరాధ్యదైవంగా భావించే భ్రమరాంభ, మల్లిఖార్జున స్వామి కల్యాణఘట్టాన్ని జరిపిస్తుంటారు. నల్లమల నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
సారథి న్యూస్, కొల్లాపూర్: ఈనెల 28న కొల్లాపూర్ లో జరిగే స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభను సక్సెస్ చేయాలని స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ సీనియర్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. శుక్రవారం కొల్లాపూర్ నియోజకవర్గంలో గ్రామ కమిటీల నిర్మాణంలో భాగంగా ఎల్లూర్ గ్రామంలో గడపగడపకు తిరిగి జ్ఞానయుద్ధభేరి సభ ఆవశ్యకతను తెలిపారు. బోరబండతండా, అంజనగిరి తండాల్లో గురుకులాలు, చదువు అవసరాన్ని వివరించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని కృష్ణానది ఒడ్డున ఉన్న ఎర్రగట్టు బొల్లారం మొలచింతలపల్లి, […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: శ్రీశైలం ఘాట్ రోడ్డు వద్ద 50 అడుగుల లోతులో ఉన్న లోయలో వ్యాన్పడింది. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట వద్ద మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లోయలో పడిన క్షతగాత్రులను పోలీసులు, విద్యుత్ సిబ్బంది వెలికి తీస్తున్నారు.క్షత్రగాత్రులను హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు.
సారథి న్యూస్, అచ్చంపేట: ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నల్లమల సమీప ప్రాంత చెరువులు, కుంటలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు సభావత్ వెంకట్రాములు దంపతులు డిండి వాగులో బుధవారం సాయంత్రం చిక్కుకున్నారు. వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. వారిని రక్షించేందుకు ముఖ్యమంత్రి, సీఎస్లతో ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడి హెలిక్యాప్టర్ సాయం కోరారు. ప్రస్తుతం వారు డిండి వాగు మధ్యలోనే ఉండిపోయారు. […]
సారథి న్యూస్, నాగర్కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో ప్రసిద్ధిచెందిన కాకతీయుల కాలం నాటి ప్రతాపరుద్రుడి కోట ప్రాంతాన్ని పర్యాటక హబ్ గా మార్చనున్నట్లు కలెక్టర్ ఎల్. శర్మన్ ప్రకటించారు. ఆదివారం అటవీశాఖ అధికారులతో కలిసి సుమారు 280 అడుగుల ఎత్తున్న కోటను కాలినడకన సందర్శించి కలియ తిరిగారు. పరిసర ప్రాంతాల వివరాలను జిల్లా అటవీశాఖ అధికారి కిష్టగౌడ్ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ.. నల్లమల అటవీ ప్రాంతంలో 700 ఏళ్లకు […]