Breaking News

జోగుళాంబ గద్వాల

పూరి గుడిసె దగ్ధం.. ఆస్తినష్టం

పూరి గుడిసె దగ్ధం.. ఆస్తినష్టం

కేటీదొడ్డి(మానవపాడు): జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం పాగుంట గ్రామంలో గురువారం విద్యుత్ షాక్ సర్క్యూట్ సంభవించడంతో రమేష్ కు చెందిన పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. టీవీ, రెండు క్వింటాళ్ల బియ్యం, దుస్తులు, సామాన్లు కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.రెండులక్షల ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ ​సుభాషిణిరెడ్డి సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని బాధితుడు రమేష్​ కోరాడు.

Read More
రూ.10వేల ఆర్థిక సాయం అందజేత

రూ.10వేల ఆర్థిక సాయం అందజేత

సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన బోయ దంతేశ్వరి కుమార్తె కుటుంబాన్ని ఆదివారం జడ్పీటీసీ కాశపోగు రాజు పరామర్శించి రూ.10వేల ఆర్థిక సాయం అందజేశారు. దంతేశ్వరి కుమార్తె నివాస గుడిసె ఇటీవల కరెంట్ ​షార్ట్​సర్క్యూట్​తో కాలిపోయింది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే అబ్రహం దృష్టికి తీసుకెళ్లడంతో ఆర్థిక సాయం చేశారు. ఆయన వెంట తనగల సర్పంచ్ రాణి, ఎంపీపీ భర్త రాజు, టీఆర్ఎస్ నాయకులు రాముడు, జయ్యన్న, […]

Read More
‘పరిహారం ఇవ్వకుండా..పైప్​లైన్​వేయొద్దు’

‘పరిహారం ఇవ్వకుండా.. పైప్​లైన్​ వేయొద్దు’

సారథి న్యూస్, మానవపాడు: పరిహారం ఇవ్వకుండా తమ పొలాల గుండా హెచ్​పీసీఎల్​ గ్యాస్ ​పైప్​లైన్​వేయొద్దని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆదివారం ఆందోళనకు దిగారు. తగిన పంట నష్టపరిహారం ఇవ్వకుండా కోర్టు నోటీసులు పంపించి దౌర్జన్యంగా పైప్​లైన్​ వేయడం ఏమిటని ప్రశ్నించారు. మిరప పంట, పత్తి పనులు పూర్తయ్యే వరకు సమయం ఇవ్వాలని కోరినా ఇవ్వడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

Read More
భూసారం పెంచుదాం

భూసారం పెంచుదాం

సారథి న్యూస్, మానవపాడు: సేంద్రియ ఎరువుల వాడకంతో భూసారం పెరుగుతుందని వ్యవసాయ సంచాలకుడు సక్రియ నాయక్ రైతులకు సూచించారు. శనివారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దఆముదాలపాడు గ్రామంలో ‘భూసార పరీక్ష.. సుస్థిర వ్యవసాయం’పై అలంపూర్​డివిజన్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భావితరాలకు అవసరమైన భూములను అందిద్దామని పిలుపునిచ్చారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. ప్రతి గ్రామంలో భూసార పరీక్షలు తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మానవపాడు మండల […]

Read More
అనంతపురంలో బర్డ్​ఫ్లూ కలకలం

అనంతపురంలో బర్డ్​ ఫ్లూ కలకలం

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: పక్షులు, కోళ్లను బర్డ్​ఫ్లూ మహమ్మారి కబళిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పౌల్ట్రీ రైతులను వణికిస్తోంది. క్రమంగా దక్షిణాది రాష్ట్రాలకు కూడా బర్డ్​ఫ్లూ మహమ్మారి పాకినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం గ్రామంలో ఉన్నట్టుండి 20 నుంచి 30 నాటుకోళ్లు ఒకేరోజు చనిపోవడం కలకలం రేపింది. ఈ కోళ్లకు బర్డ్​ఫ్లూ వచ్చిందా? మరేదైనా కారణమా? అని బాధిత పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత […]

Read More
ఘనంగా వివేకానంద జయంతి

ఘనంగా వివేకానంద జయంతి

సారథి న్యూస్​, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆఖండ భారతదేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన విశ్వవిఖ్యాత తత్వవేత్త, గొప్పవ్యక్తి అని కొనియాడారు. వివేకానంద తన జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం అంకితం చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో పుల్లూరు గ్రామపెద్దలు చల్లా గిరిధర్ రెడ్డి, కలుగోట్ల పీఏసీఎస్​ చైర్మన్ గజేందర్ రెడ్డి, సర్పంచ్ నారాయణమ్మ, ఎంపీటీసీ సభ్యులు […]

Read More
మల్దకల్ తిమ్మప్ప.. నీవే దిక్కప్ప!

మల్దకల్ తిమ్మప్ప.. నీవే దిక్కప్ప!

సారథి న్యూస్, మల్దకల్(జోగుళాంబ గద్వాల): ఆ ఊరు వాసులు తిరుపతి వెళ్లరు.. గ్రామస్తులు భవనం రెండవ అంతస్తు కూడా నిర్మించరు.. కాదని ఎవరైన నిర్మాణానికి పూనుకుంటే అనర్థాలు జరిగిపోతాయని అందరిలోనూ అనమానం. స్థానికంగా వెలసిన తిమ్మప్పస్వామిని తమ ఇష్టదైవంగా కొలుస్తారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఆదిశిలాక్షేత్రమైన మల్దకల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కొలిచేవారి కొంగుబంగారంగా వెలుగొందుతున్నాడు. భక్తులను అలరిస్తూనే వారి కోరికలు నెరవేర్చుతున్నాడు.28 నుంచి ఉత్సవాలుఏటా మార్గశిర మాసంలో జరిగే ఉత్సవాలకు పెద్దసంఖ్యలో తరలివచ్చే భక్తులు తమ […]

Read More
భూమి పేర చేయడం లేదని..

భూమి పేర చేయడం లేదని..

పురుగు మందు తాగి అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం మానవపాడు తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళన సారథి న్యూస్, మానవపాడు: భూమిని తమ పేర చేయడం లేదని, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా న్యాయం జరగడం లేదని ఇద్దరు అన్నదమ్ములు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట కలకలం రేపింది. బాధిత రైతుల కథనం మేరకు.. మండలంలోని చెన్నిపాడు గ్రామానికి చెందిన రైతులు శేషిరాజు, నాగరాజుకు […]

Read More