Breaking News

హైదరాబాద్

సాగునీటి ప్రాజెక్టులపై సీబీఐ విచారణ

సాగునీటి ప్రాజెక్టులపై సీబీఐ విచారణ

కేంద్రానికి లేఖ రాస్తానన్న డీకే అరుణ సారథి న్యూస్, హైదరాబాద్: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. పాలమూరు- రంగారెడ్డి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుల డిజైన్లను మార్చారని, అండర్ గ్రౌండ్ పంప్ హౌస్ సరైంది కాదని ఇంజినీర్ల బృందం తెలిపిందన్నారు. అయినప్పటికీ […]

Read More
అర్ధరాత్రి కుండపోత

అర్ధరాత్రి కుండపోత

సారథి న్యూస్, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి సుమారు రెండుగంటల పాటు ఏకధాటిగా వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో ఆకాశమంతా దద్దరిల్లింది. చెరువులు, కుంటలు ఏమయ్యాయి. లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, మహబూబ్​నగర్, వనపర్తి, నల్లగొండ, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. భారీవర్షానికి హైదరాబాద్ లోని ఎల్బీనగర్ నుంచి […]

Read More
వరద బాధితులు భయపడొద్దు

వరద బాధితులు భయపడొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: మూడు రోజుల క్రితం కురిసిన అకాలవర్షాలకు తీవ్రంగా నష్టపోయిన అడ్డుగుట్ట డివిజన్ లోని చంద్రబాబు నాయుడు నగర్ కు చెందిన ముప్పు బాధితులను డిప్యూటీ స్పీకర్​తిగుళ్ల పద్మారావుగౌడ్​పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి, బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రకృతి ప్రళయం కారణంగా చాలా ప్రాంతాలను అతలాకుతలం చేసిందన్నారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

Read More
పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి

పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో వరుసగా నాలుగో రోజు వరద ప్రభావిత ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పరిశీలించారు. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో వరదల్లో చనిపోయిన పలువురికి రూ.ఐదులక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు. పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టిసారించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. అంటురోగాలు ప్రబలకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు […]

Read More
హైదరాబాద్​లో మళ్లీ భారీవర్షం

హైదరాబాద్​లో మళ్లీ భారీవర్షం

హైదరాబాద్‌: రాజధాని నగరం హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో మరోసారి భారీవర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో నగర వాసులను వణికించింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్‌, కర్మాన్‌ఘాట్‌, మీర్‌పేట, ఉప్పల్‌, రామంతపూర్‌, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. పాతబస్తీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కాగా, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఇది ఏర్పడిన 24 గంటల […]

Read More
సీఎం కేసీఆర్​ఉన్నత స్థాయి మీటింగ్​

సీఎం కేసీఆర్​ ఉన్నత స్థాయి మీటింగ్​

సారథి న్యూస్, హైదరాబాద్​: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని చర్చిస్తారు. తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలు తీసుకుని రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్సిపల్, వ్యవసాయ, ఆర్అండ్ […]

Read More
గూడు చెదిరింది..

గూడు చెదిరింది..

సారథి న్యూస్, నెట్​వర్క్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రమంతా అతలాకుతలమైంది. భాగ్యనగరం ఒక్కసారిగా స్తంభించిపోయింది. మూసీ ఉగ్రరూపం దాల్చింది. సరూర్​నగర్​చెరువు ఉప్పొంగింది. వరద ప్రళయమే సృష్టించింది. వరద ఉధృతికి కార్లు కొట్టుకొచ్చాయి. ఆ గల్లీ.. ఈ గల్లీ.. ఏది చూసినా జలసంద్రమైంది. అలాగే రాష్ట్రంలో పలు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరి చేలు నీట మునిగిపోయాయి. రోడ్లు, వంతెనలు వరద ఉధృతికి ధ్వంసమయ్యాయి.

Read More
సాగులో స్వయం సమృద్ధి సాధించాలి

సాగులో విప్లవాత్మక మార్పులు రావాలి

సారథి న్యూస్, హైదరాబాద్: కూరగాయలు, పండ్లు, పూల తోటల సాగులో గుణాత్మక మార్పులు రావాలని, ఇందుకోసం ఉద్యానవన శాఖ సుశిక్షితం, బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రంలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలు, మంచి వర్షపాతం, వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు ఉన్నారని అన్నారు. ఈ సానుకూలతలను వినియోగించుకుని పండ్లు, కూరగాయలు, పూల సాగులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని సూచించారు. ప్రగతి భవన్ లో బుధవారం ఉద్యానవన శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష […]

Read More