సారథి న్యూస్ నారాయణఖేడ్: మహిళా ఎంపీటీసీపై దాడి జరిగిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో చోటుచేసుకున్నది. దెగుల్ వాడి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీ సుశీలమ్మపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సొసైటీ మెంబర్ కుపేందర్ రెడ్డి అయన కుటుంబ సభ్యులు దాడి చేశారు. మహిళా అన్ని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడి దాడి చేసినట్లు ఎంపీటీసీ సుశీలమ్మ ఆరోపించారు. సొయా విత్తనాల కోసం రైతులకు టోకెన్లు అందిస్తున్న సమయంలో మాటమాట పెరిగి దాడికి దారి […]
సారథిన్యూస్, గోదావరిఖని: కల్లు తీసేందుకు వెళ్లిన ఓ గీతకార్మికుడికి.. మోకు మెడకు చుట్టుకొని ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గుర్రంపల్లి గ్రామంలో విషాదం నింపింది. గుర్రంపల్లికి చెందిన మామిడి రాజు ప్రతిరోజు మాదిరిగానే కల్లు తీసేందుకు మోకు సాయంతో తాటిచెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో మోకు.. మెడకు చుట్టుకున్నది. దీంతో ఉపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన తోటి గీతకార్మికులు మృతదేహాన్ని చెట్టుపైనుంచి కిందకు దించారు.
సారథిన్యూస్, గోదావరిఖని: సెల్ఫీ సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసింది. గోదావరిఖనికి చెందిన యశ్వంత్(22) ఓ కళాశాలలో పాల్టెక్నిక్ డిప్లమో చదువుతున్నాడు. సోమవారం సరదాగా పెద్దపల్లి జిల్లాలోని సబ్బితం జలపాతం వద్దకు వెళ్లాడు. అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
సారథి న్యూస్, హుస్నాబాద్: భూ తగాదాలతో ఓ వ్యక్తి కన్నతండ్రినే హతమార్చాడు. ఈ దారుణఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గండిపల్లిలో చోటుచేసుకున్నది. హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం..గండిపల్లికి చెందిన లూనావత్ సోమ్లా నాయక్ (74)కు కొంత కాలంగా కుమారుడు సమ్మయ్యతో భూమివిషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం సోమ్లానాయక్ తన పొలం దగ్గరకు వెళ్తుండగా కుమారుడు సమ్మయ్య అడ్డగించాడు. భూమి విషయంలో ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన […]
సారథి న్యూస్, బిజినేపల్లి: ట్రాక్టర్.. రోటవేటర్ కిందపడి ఆరేండ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహదేవునిపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకున్నది. మహాదేవుని పేటకు చెందిన రైతు బక్క చిన్న మాసయ్య పొలంలో రోటవేటర్తో దుక్కిదున్నుతున్నాడు. ఈ క్రమంలో పొలం వద్దకు వచ్చిన అతడి కుమారుడు ప్రవీణ్కుమార్(6) వెనుక నుంచి పరిగెత్తుకుంటే వెళ్లి రోటవేటర్ లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గమనించి ట్రాక్టర్ ఆపగా అప్పటికే ప్రవీణ్ […]
సారథి న్యూస్, రామడుగు: ప్రమాదవశాత్తు ఓ బాలుడు బావిలో పడి చనిపోయాడు. ఈ విషాదకర సంఘటన సోమవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామంలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన మల్లేశం కొడుకు రేవంత్(9) ఆదివారం మధ్యాహ్నం సైకిల్ తొక్కుతూ వెళ్లి ఇంటి ముందున్న బావిలో పడ్డారు. కొడుకు కనిపించడం లేదని వెతికిన తల్లిదండ్రులకు బావిలో శవమై కనిపించాడు. బావి యజమానిపై కేసు నమోదుచేసినట్లు ఎస్సై అనూష తెలిపారు.
సారథి న్యూస్, హైదరాబాద్: బంజారాహిల్స్ భూ వివాదం కేసులో షేక్పేట తహసీల్దార్ సుజాత సోమవారం అరెస్ట్ అయ్యారు. ఖలీద్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభ్యం కావడంతో ఆమెను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెను మూడు రోజులుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్ సెక్టార్ ఎస్సై రవీంద్ర నాయక్ను ఇప్పటికే అధికారులు […]
సారథి న్యూస్, హుస్నాబాద్: ఈత సరదా ఇద్దరి నిండు ప్రాణాలను బలితీసుకుంది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో చోటుచేసుకుంది. ఏసీపీ మహేందర్ కథనం.. బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన పొన్నాల అనిల్ (17), మానకొండూరు మండలం రంగంపేటకు చెందిన నంగునూరు కుమార్(18) బంధువుల ఇంటికి వచ్చారు. శనివారం ఉదయం కోహడ మండలం శనిగరం ప్రాజెక్టులో ఈత కొట్టేందుకు వెళ్లి ఊపిరాడక చనిపోయారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ తెలిపారు.