Breaking News

క్రైమ్

మద్యం దొంగలు అరెస్ట్​

సారథిన్యూస్​, రామగుండం: మద్యం దొంగతనం చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. రామగుండం పోలీస్​ కమిషనరేట్​ పరిధిలోని పెద్దపల్లి జిల్లా అప్పనపేట శివారులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా పట్టుబడింది. నిందితుల వద్ద నుంచి 3 బైక్​లు, 2 ట్రాలీ ఆటోలు, రూ. 3,66,800 విలువైన మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్​ జిల్లాకు చెందిన శేఖర్​, కుమ్మాటి రాజు, కుర్ర అంజయ్య ముఠాగా ఏర్పడి పలు చోట్ల మద్యం దుకాణాలను […]

Read More

చాక్లెట్​ ఆశచూపి..

సారథిన్యూస్​, నిజామాబాద్:​ చాక్లెట్​ ఆశచూపి ఓ వృద్ధుడు ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్​ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎడపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నారాయణ ( 55) అనే వ్యక్తి ఎనిమిదేళ్ల ఇద్దరు చిన్నారులపై అత్యాచారం చేశాడు. ఇద్దరు చిన్నారులకు గత 15 రోజులుగా చాక్లెట్ ఆశ చూయించి పాడుబడ్డ ఇంట్లో లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇంట్లో చెప్తే చంపుతానని బెదిరించాడు. కడుపునొప్పి తాళలేక చిన్నారులు కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. దీంతో […]

Read More

యూపీలో రెచ్చిపోయిన రౌడీలు

లక్నో: ఉత్తర్​ప్రదేశ్​లో ఓ రౌడీ ముఠా రెచ్చిపోయింది. అరెస్ట్​ చేసేందుకు వచ్చిన ఎనిమిది మంది పోలీసులను రౌడీలు కాల్చిచంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని కాన్పూర్​కు చెందిన రౌడీ షీటర్​ వికాస్​ దూబే పలు కేసుల్లో నిందితుడు. అతడిని అరెస్ట్​ చేసేందుకు పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున కాన్పూర్​ సమీపంలో అతడు నివాసం ఉంటున్న డిక్రూ గ్రామానికి వెళ్లారు. వికాస్​ ఇంటి సమీపంలోని ఓ ఇంటిమీద కాపుకాసిన రౌడీలు పోలీస్​ బృందంపై విక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు. […]

Read More

గుట్టుగా గుట్కా విక్రయాలు

సారథి న్యూస్, హుస్నాబాద్: కరీంనగర్​ జిల్లా అక్కన్నపేట పోలీస్​స్టేషన్​ పరిధిలోని రామవరం గ్రామంలో 30 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో గుట్కాప్యాకెట్లు నిలువ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన వెంకటేశం, రవితేజ ఇంట్లో గట్కా ప్యాకెట్లు దొరికాయి. సంపత్​ అనే వ్యాపారి వీరికి గుట్కా ప్యాకెట్లు విక్రయించినట్టు పోలీసుల విచారణలో తేలింది. ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read More

వ్యభిచారముఠా అరెస్ట్​

సారథిన్యూస్​, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పోలీసులు తనిఖీ చేసి వ్యభిచార ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పాల్వంచలోని ఓ ఇంజిరింగ్​ కళాశాల సమీపంలోని ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీచేసి ముగ్గురు మహిళలతోపాటు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.

Read More

ఫ్రెండ్​కు మార్కులు ఎక్కువొచ్చాయని..

న్యూఢిల్లీ: చిన్న, చిన్న విషయాలకే టీనేజ్​ పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం పరిపాటిగా మారింది. తల్లిదండ్రుల పిల్లలను చేరదీయకపోవడం, వారికి మానసిక స్థైర్యం కల్పించకపోవడంతో ఇటువంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్​లోని కాన్పూర్​లో ఓ బాలిక.. తనకంటే స్నేహితురాలికి ఎక్కువ మార్కులు వచ్చాయన్న కారణంతో ప్రాణం తీసుకున్నది. కాన్పూర్‌లోని ధమిఖేడకు చెందిన‌ శ్రావణ్‌ కుమార్ కుమార్తె అనిశా ఓ ప్రైవేట్​ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నది. ఇటీవల విడుదలైన సీబీఎస్​ఈ ఫలితాల్లో 82 శాతం మార్కులు వచ్చాయి. కాగా తన […]

Read More

ఏసీబీకి చిక్కిన అధికారి

సారథిన్యూస్​, రంగారెడ్డి: లంచం తీసుకుంటూ ఓ అధికారి ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ కో​​​- ఆర్డినేటర్​గా పనిచేస్తున్న రఘునాథ్​ ఆరోగ్యశ్రీలో ఓ డెంటల్​ హాస్పిటల్​ను రెన్యువల్​ చేసేందుకు రూ. 30, 000 డిమాండ్​ చేశాడు. 25,000 వేలకు బేరం కుదిరింది. అనంతరం హాస్పిటల్​ యాజమాన్యం ఏసీబీని ఆశ్రయించింది. రంగంలోకి దిగిన అధికారులు సోమవారం రఘునాథ్​.. లంచం తీకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Read More

మంటల్లో చిక్కుకొని కరోనా రోగులు మృతి

ఈజిప్ట్​ దేశంలోని అలెగ్జాండ్రియా దేశంలోని ఓ ఆస్పత్రిలో మంటలు చెలరేగి ఏడుగురు కరోనా రోగులు మృతిచెందారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు. పొగతో ఊపిరాడక కరోనా రోగులు మృతి చెందినట్లు అధికారులు తేల్చారు. ఆసుపత్రిలోని ఎయిర్ కండీషనర్ నుంచి మంటలు చెలరేగి అగ్నిప్రమాదం జరిగిందని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఈజిప్ట్ సివిల్ ప్రొటెక్షన్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లనే అగ్నిప్రమాదం సంభవించిందని […]

Read More