Top News
. వనపర్తి జిల్లా రేవల్లి హత్య కేసు వివరాల పై ప్రత్యేకంగా ఆరా. 2020 లోనే సీరియల్ కిల్లర్ కు సహకరించిన వనపర్తి జిల్లా పోలీసులు. కాసుల కక్కుర్తితో సీరియల్ కిల్లర్ పై దృష్టిపెట్టని పోలీసులు. ఇదే అదునుగా మరింత రెచ్చిపోయిన సీరియల్ కిల్లర్. 2022 లో నాగర్ కర్నూల్ జిల్లాలో మరి కొందరి బలి సామాజిక సారథి, నాగర్ కర్నూల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ హత్యల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. […]
సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో పేకాట మూడుపూలు, ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. పోలీసు అధికారులకు ముడుపులు ఇచ్చి జూదరులు మరీ పత్తాలాట ఆడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల శనివారం వట్టెం వద్ద పట్టుబడిన జూదరులను నాగర్ కర్నూల్ డీస్పీ, సీఐ నిగా పెట్టి పట్టుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో పేకాట ముఠాలు రాజ్యమేలుతున్నాయి. ఆట ఆడటానికి కొంత చొప్పున వేసుకుని ఓ పోలీసుకు మరీ కప్పం కడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద […]
పోలీసుల అదుపులో ఇద్దరు యువకులుసామాజికసారథి, నాగర్ కర్నూల్:నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం గుడ్ల నర్వ గ్రామంలో గంజాయి కలకలం రేగింది. ఇద్దరు యువకులు సిగరెట్లలో గంజాయి నింపుకొని సేవిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు శనివారం నాగర్ కర్నూల్ సీఐ కనకయ్య గౌడ్ తెలిపారు. కాగా నాగర్ కర్నూల్ జిల్లాలో చాపకింద నీరులా గంజాయి వాడకం విస్తరిస్తోంది. మొదట నాగర్ జిల్లా కేంద్రంలో మొదలైన గంజాయి వాడకం క్రమక్రమంగా […]
టి యు డబ్ల్యూ జే -హెచ్ 143 జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర రావు..సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలను ఉచిత విద్యను అందించడానికి సర్కులర్ జారీ చేయాలని పియుడబ్ల్యూజే హెచ్ 143 జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర రావు, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు కానాపురం ప్రదీప్ ఐజేయు జాతీయ నాయకుడు జెమినీ సురేష్ ల ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారిని శుక్రవారం కలిసి వినతిపత్రం […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: అధికారుల తప్పిదాలు కొన్నిసార్లు సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా అచ్చంగా ఇలాంటిదే మరి. వివరాల్లోకెళ్తే.. ఓ ఇంటిలో సాధారణంగా నాలుగు లైట్లు. ఓ మూడు ఫ్యాన్లు, మొబైల్ ఛార్జర్స్.. ఎలక్ట్రికల్ ఇస్త్రీ పెట్టే, కూలర్, లేదంటే ఏసీ ఉంటుంది. వంటింట్లో కరెంట్ హీటర్, మిక్సింగ్ గ్రౌండర్ వాడుతుండటం మనందరికీ తెలిసిందే. అయితే వీటన్నింటికీ కలిపి ఎంత లేదన్నా రూ. వెయ్యి నుంచి రూ.2వేలకు కరెంట్ బిల్లు దాటదు. […]
సామాజికసారథి, బిజినేపల్లి: పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు.. తాళం వేసిన ఇళ్లను, ఇంట్లో అందరు ఉండగానే టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. అటు ఇటు చూసి అందినకాడికి దోచుకెళ్తున్నారు. బిజినేపల్లి మండలం పాలెంలో మూడు రోజుల క్రితం జరిగిన చోరీలతో విస్తుగొల్పుతున్నాయి. గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ జగన్ ఇంట్లో దొంగలు పడి 3 తులాల బంగారు నగలు, రూ.20వేల నగదును ఎత్తుకెళ్లారు. అంతలోనే ఓ మాజీ ఆర్మీ జవాన్ ఇంటి తలుపులు, బీరువాను విరగ్గొట్టి రూ.50వేల నగదును […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: సాధారణ రైతు కుటుంబంలో పుట్టినబిడ్డ రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించాడు. మంగళవారం విడుదలైన బీఈడీ(టీజీ ఎడ్ సెట్) ఎంట్రెన్స్ లో నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన యువకుడు ఎం.నవీన్ కుమార్ స్టేట్ 1 ర్యాంక్ సాధించాడు. బీఈడీ ఎంట్రెన్స్ (హాల్ టికెట్ నం.2415307073) 150 మార్కులకు 118 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన వెంకటస్వామి, విజయమ్మకు […]
సామాజికసారథి, బిజినేపల్లి: త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి మంగళవారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారికి మాజీఎంపీ పి.రాములు, సీనియర్ నాయకులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, జనుంపల్లి రాంచంద్రారెడ్డి, సేవికాసమితి విభాగ్ కార్యవాహిక బి.దేదీప్యశ్రీ, బుసిరెడ్డి శకుంతల, నాగర్ కర్నూల్ నియోజకవర్గం రెడ్డి సేవాసమితి అధ్యక్షుడు ద్యాసాని లింగారెడ్డి, క్యాడెట్ బి.సాయిసుధాంశురెడ్డి తదితరులు పాల్గొన్నారు.