Top News
సామాజికసారథి, నాగర్ కర్నూల్: గత ప్రభుత్వ హయాంలో కొందరు నాయకులు, అధికారులు కలిసి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ప్రాజెక్టుల్లో లేనిది ఉన్నట్లు చూపి లక్షలు మెక్కేశారు. అలాంటిదే ఓ ఉదంతం నాగర్ కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకెళ్తే.. గత ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సాగు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా పలు రిజర్వాయర్లను నిర్మించాలని తలపెట్టింది. అందుకోసం సర్కారు భూములతో పాటు రైతుల నుంచి కూడా […]
సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి నూతన ఎస్సైగా కె.శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఆయన మహబూబ్ నగర్ సీసీఎస్ లో పనిచేశారు. బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై నాగశేఖర్ రెడ్డి వీఆర్ కు వెళ్లారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై కె.శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి సమస్య ఉన్నా తనను నేరుగా సంప్రదించాలని కోరారు. పైరవీకారులను ఆశ్రయించవద్దని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలంతా […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్, ఎన్జీవోస్ ప్రతినిధులతో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బుధవారం సమీక్షించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈనెల 22న తేదీన నిర్వహించబోయే సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీంపై అవగాహన సదస్సుకు సరైన ప్రణాళికలతో సిద్ధం కావాలని అధికారులకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సూచించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమీకృత గురుకులానికి తొలి అడుగుపడింది. నాగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటుకు సర్వం సన్నద్ధమైంది. కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్లు, కాలేజీల్లో చదవలేని పేద విద్యార్థులు ఇక్కడే నాణ్యమైన ఉన్నతవిద్య వరకు అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 22 సమీకృత గురుకులాలకు ఈ నెల11న శంకుస్థాపన చేయనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాలలను ఒకే క్యాంపస్ లో నిర్వహించడం.. అన్ని […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: బిజినేపల్లి మండల పరిధిలోని పాలెం గ్రామంలో గత వారం రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ లీడర్ గా వచ్చి ఫొటోలు దిగుతుండటం పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. అలాంటి వ్యక్తితో పార్టీకి నష్టం జరుగుతుందని కార్యకర్తలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని పిలవకుండా వారే వచ్చి ఫొటోలు దిగుతున్నారని తేల్చిచెప్పారని డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ముక్తార్ అన్నారు. మంగళవారం […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే కేసీఆర్ పరిపాలన కాలంలో రాజకీయంగా పడిన ఇబ్బందులను ఇప్పటికీ నాటి విపక్షమైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గుర్తుచేసుకుంటుంటారు. కేసులు, ఇతరత్రా విషయాల్లో ఇబ్బందులు గురిచేసేవారని చెబుతుంటారు. అధికారమార్పిడి జరగడంతో కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఇదిలాఉండగా, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ హయాంలో రాజకీయంగా జరిగిన కొన్ని సంఘటనలను ఉదాహరిస్తూ ఈనెల […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్: అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు మైండ్ గేమ్ షురూ చేశారు. అడ్డగోలు వ్యవహారాలతో ‘ఛీ’ అనిపించుకుంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ కార్యకర్తలను ముఖ్యంగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అనుచరులను తీవ్రంగా వేధించారు. ఎన్నో ఏండ్ల తర్వాత నాగర్ కర్నూల్ నియేజకవర్గంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా డాక్టర్ రాజేశ్ రెడ్డి విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణుల సుదీర్ఘనిరీక్షణ ఫలించింది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అనుచరులుగా […]
సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి భార్యపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆర్మీ మాజీ జవాన్ ను స్థానికులు చెప్పులతో చితకబాదారు. పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందు అతడి ఇంటి ముందు ఆ గ్రామ మహిళలు, యువకులు ఆందోళన చేపట్టారు. స్థానికుల కథనం.. పాలెం గ్రామానికి చెందిన ఆర్మీ మాజీ జవాన్ దుగ్యాల వెంకటయ్య.. ఓ మాజీ ప్రజాప్రతినిధి […]