Breaking News

క్రైమ్

భూ వివాదంలోనే రామచంద్రారెడ్డి హత్య

సారథి న్యూస్​, షాద్​నగర్​: ఈనెల 19న రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కిడ్నప్ నకు గురై కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామ శివారులో విగతజీవిగా పడి ఉన్న రామచంద్రారెడ్డి హత్య కేసులో నిందితులను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. భూవివాదమే ప్రాణం తీసినట్లు పోలీసులు తేల్చారు. సోమవారం వివరాలను షాద్ నగర్ ఏసీపీ సురేందర్ వెల్లడించారు. ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, ప్రతాప్ రెడ్డికి కొంతకాలంగా […]

Read More

మంచి భర్తగా ఉండలేక..

ఢిల్లీ: కుటుంబ సమస్యలతో ఓ స్పెషల్​ బ్రాంచ్​ పోలీస్​ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను మంచి భర్తగా, మంచి కుటుంబసభ్యుడిగా ఉండలేకపోతున్నానని చనిపోయేముందు ఓ సెల్ఫీ వీడియోను తీసుకున్నాడు. హర్యానాలోని జాజర్‌కు చెందిన సందీప్‌ కుమార్‌ వసంత విహార్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ సమస్యలతో తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకున్నాడు. తోటి సిబ్బంది గమనించి ఆస్పత్రికి తరలించే లోపే తుదిశ్వాస విడిచాడు. సందీప్ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ […]

Read More

ప్రేమించలేదని పగబట్టాడు

సారథిన్యూస్​: అతడో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​.. తన ఆఫీసులోనే పనిచేసే ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అతడి ప్రేమను.. ఆమె తిరస్కరించడంతో కక్ష పెంచుకొని లోకాంటో అనే యాప్​లో యువతికి చెందిన ఫొటోలను అసభ్యకరంగా ఎడిట్​ చేసి పోస్ట్​ చేశాడు. దీంతో ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ టెకీ కటకటాలు లెక్కిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలు.. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్​ కు చెందిన అందె వంశీ(25) హైదరాబాద్​లోని ఓ సాఫ్ట్​వేర్​ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. […]

Read More

రైతు బలవన్మరణం

సారథి న్యూస్​,పెద్దపల్లి: రెవెన్యూ అధికారుల తన భూమిని రికార్డుల్లో ఎక్కించకపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్​ తహసీల్దార్​ కార్యాలయం ఎదుట చోటుచేసుకున్నది. తనకున్న ఎకరం 20 గుంటల భూమిని తన పేరు మీద నమోదు చేయవలసిందిగా వీణవంక మండలం రెడ్డిపల్లికు చెందిన మందల రాజారెడ్డి అనే రైతు కొంతకాలంగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నా అధికారులు పట్టించుకోకపోవంతో మనస్తాపంతో పురుగుల మందు […]

Read More

తాగి డ్యూటీకొచ్చిన ఖాకీలు సస్పెండ్​

సారథి న్యూస్​, సూర్యాపేట: మద్యం సేవించి విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డుపై వేటుపడింది. సూర్యాపేట జిల్లా పెన్​పహాడ్​ పోలీస్​స్టేషన్​ను శుక్రవారం అర్ధరాత్రి ఎస్పీ భాస్కరన్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో అతిగా మద్యం సేవించారని తేలడంతో ముగ్గురు పోలీస్ సిబ్బందిని ఎస్పీ సస్పెండ్ చేశారు.

Read More

కాంగ్రెస్ నేత రామచంద్రారెడ్డి దారుణహత్య

సారథి న్యూస్​, షాద్​నగర్​: కాంగ్రెస్ సీనియర్ నేత, జడ్చర్ల మాజీ సింగిల్​ విండో చైర్మన్ రామచంద్రారెడ్డి అలియాస్ పెట్రోల్ పంపు రామచంద్రారెడ్డి శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కిడ్నాప్, హత్యకు గురయ్యారు. కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామ సమీపంలో రామచంద్రారెడ్డిని ఆయన బంధువైన అన్నారం ప్రతాప్ రెడ్డి మరొకరు కలిసి హత్య చేసినట్లు షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఏసీపీ వి.సురేందర్ వెల్లడించారు. తెలిపారు. ఈ హత్యకు సంబంధించిన ప్రాధమిక పూర్వాపరాలను […]

Read More

నవ దంపతుల దుర్మరణం

ఏలూరు టౌన్‌: రోడ్డు ప్రమాదం నవదంపతులను బలిగొన్నది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకున్నది. ప్రమాదంలో డ్రైవర్‌ కూడా మృతిచెందగా, వధువు సోదరుడు తీవ్రగాయాలతో బయటపడ్డాడు. విశాఖ జిల్లా సబ్బవరానికి చెందిన యడ్లపల్లి వెంకటేష్‌కు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని గోవాడకు చెందిన ఆలపాటి మానస నవ్యతో ఈ నెల 14న రాత్రి గోవాడలో వివాహం జరిగింది. వివాహం అనంతరం గురువారం వధువు సోదరుడు భరత్‌తో కలిసి నవ దంపతులు […]

Read More

పది మందిని బలిగొన్న రోడ్డుప్రమాదం

సారథిన్యూస్​, ఖమ్మం: రోడ్డుప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఏపీలోని కృష్ణాజిల్లా జగ్గయపేట మండలం వేదాద్రి సమీపంలో చోటుచేసుకున్నది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద గోపవరం గ్రామానికి చెందిన ఓ కుటుంబం బంధువులతోకలిసి వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ట్రాక్టర్​లో వెళ్తున్నారు. వేదాద్రి సమీపంలో ట్రాక్టర్​ను ఎదురుగా వచ్చిన బొగ్గులారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరోముగ్గురు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పెదగోపవరంతోపాటు అదే మండలానికి చెందిన […]

Read More