Breaking News

Year: 2022

జై గణేశా.. జై జై గణశా!!

కొలువుదీరిన గణపయ్య

సామాజికసారథి, చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గణనాథుడిని ప్రతిష్టించారు. జై గణేశా.. జై జై గణేశా!! అనే నామస్మరణ మార్మోగింది. యువజన సంఘాల సభ్యులు పూజలో పాల్గొన్నారు. అనంతరం ప్రసాదం అందజేశారు. ఆపదలు తొలగించే గణాధిపతి సామాజికసారథి, మందమర్రి (మంచిర్యాల): దేవుళ్లలో ప్రథముడు, జ్ఞానం పరిపూర్ణత అదృష్టానికి ప్రతీక విజ్ఞానం తొలగించే గణనాథుడి ఆశీస్సులు ప్రతిఒక్కరి జీవితంలోనూ ఉండాలని, సుఖసంతోషాలు శాంతి శ్రేయస్సుతో నిండిపోవాలని, ఆటంకాలను పోగొట్టి […]

Read More
ఘనంగా వీడ్కోలు సన్మాన సభ

ఘనంగా వీడ్కోలు సన్మాన సభ

సామాజికసారథి, మందమర్రి (మంచిర్యాల): మందమర్రి సింగరేణి పర్సనల్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ గ్రేడ్-ఏ విధులు నిర్వహించి బుధవారం పదవి విరమణ పొందిన సీఎస్ కనాన్ ను మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఇన్​చార్జ్​ జీఎం కృష్ణారావు బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1983 లో సింగరేణి సంస్థలో జనరల్ మజ్దూర్ గా మందమర్రి ఏరియా వర్క్ షాపులో ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయికి ఎదిగి క్రమశిక్షణతో, నిబద్ధతతో […]

Read More
కొలువుదీరిన గణనాథుడు

కొలువుతీరిన గణనాథుడు

సామాజికసారథి, సుల్తానాబాద్ : వినాయక చవితి నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని బుధవారం సుల్తానాబాద్ మండల కేంద్రంలో ప్రధాన కూడళ్లలో భక్తులు ఏర్పాటు చేసిన మండపాల్లో బుధవారం గణనాథుడు కొలువుదీరాడు. వేదపండితులు సూచించిన శుభముహూర్తానికి భక్తులు ప్రత్యేక పూజలుచేసి గణనాథుడి మండపంలో ప్రతిష్టించారు. అంతకుముందు వినాయకులను కొనుగోలు చేసిన భక్తులు మండపాల వరకు శోభాయాత్ర నిర్వహించారు. దీంతో సుల్తానాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారులపై సందడి నెలకొంది. దాదాపు అన్నివార్డుల్లో ఏర్పాటుచేసిన మండపాల వల్ల వార్డుల్లో పండగ వాతావరణం నెలకొంది.

Read More
వినాయకుడికి ఎమ్మెల్యే చిరుమర్తి పూజలు

వినాయకుడికి ఎమ్మెల్యే చిరుమర్తి పూజలు

సామాజిక సారథి, నకిరేకల్: నకిరేకల్ పట్టణంలోని పలు వార్డులలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గణపతి మండపాల వద్ద విఘ్నేశ్వరుడికి బుధవారం మొదటిరోజు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా వాటిని వినాయకుని దీవెనలతో అధిగమిస్తూ, సకల జన సంక్షేమమే లక్ష్యంగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను […]

Read More
మెడికల్​కాలేజీ భూములపై రాజకీయాలు

మెడికల్ ​కాలేజీ భూములపై రాజకీయాలు

సామాజికసారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: రాజకీయ లబ్ధి కోసమే అసత్య ప్రచారాలు చేస్తున్న బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ జనసమితి నాయకులు మెడికల్ కాలేజీ విషయంలో మాట్లాడం సిగ్గుచేటని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి అభిమాన్య, తెలంగాణ మాలమహానాడు నాయకులు ఎద్దుల వెంకటేశ్, కొమ్ము మోహన్, వీరేశం, శ్రీనివాస్, రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బాలరాజు, మైనారిటీ నాయకులు రహీం, ఎస్టీ నాయకులు ఆశన్న అన్నారు. శుక్రవారం వారు మీడియాతో […]

Read More
మునుగోడుపై బీఎస్పీ కీలక నిర్ణయం

మునుగోడుపై బీఎస్పీ కీలక నిర్ణయం

సామాజికసారథి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికపై బహుజన సమాజ్​పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్ ​కుమార్ ​కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు పార్టీ శ్రేణులను కార్మోన్యుకులు చేశారు. పార్టీనేతలు 8 మందికి కీలక పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహరచన చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. తన టూర్​లో భాగంగా […]

Read More
‘కీచకుడు’ కటకటాల పాలు

‘కీచకుడు’ కటకటాల పాలు

9 మందిపై పోలీసుల కేసు సామాజికసారథి’ వరుస కథనాలతో కదిలిన పోలీసు యంత్రాంగం సామాజికసారథి, బిజినేపల్లి: కారుకొండ గ్రామంలో గౌరమ్మ అనే మహిళపై అత్యాచారం.. ఆపై ఆమెను మోసగించి బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్న కేసులో ప్రధాన నిందితుడు మిద్దె బాలస్వామిని మంగళవారం రిమాండ్​కు తరలించినట్లు నాగర్ కర్నూల్ సీఐ హనుమంతు యాదవ్ మీడియాకు తెలిపారు. ఆయనతో పాటు మరో 9 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులంతా ఒకే కుటుంబ చెందిన […]

Read More
టీఆర్ఎస్​నుంచి మిద్దె బాలస్వామి బహిష్కరణ

సర్పంచ్​ తండ్రి ఆగడాలు.. టీఆర్ఎస్ ​నుంచి బహిష్కరణ

‘సామాజికసారథి’ కథనంపై ఉలిక్కిపాటు నిజనిర్ధారణ కమిటీ వేసిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి సామాజికసారథి, నాగర్​కర్నూల్ ప్రతినిధి: నాగర్​కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని కారుకొండ గ్రామంలో ఓ పేద కుటుంబంపై అరాచకం సాగిస్తున్న టీఆర్ఎస్ నాయకుడు, సర్పంచ్​మిద్దె శ్రీశైలం తండ్రి బాలస్వామిని పార్టీ నుంచి బహిష్కరించారు. కొడుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని గ్రామంలో అరాచకాలు సాగిస్తున్నాడు. ఈ విషయమై గతంలో ‘సామాజికసారథి’లో ‘కారుకొండలో కీచకుడు’ శీర్షికన కథనం కూడా వెలువడింది. తాజాగా శనివారం ‘వివాహితపై కన్నేసి.. డబ్బును కాజేసి’ శీర్షికన […]

Read More