Breaking News

నేషనల్ రూరల్ కబడ్డీకి మెదక్ టీం

నేషనల్ రూరల్ కబడ్డీకి మెదక్ టీం

సామాజిక సారథి, రామాయంపేట: నేషనల్ రూరల్ కబడ్డీ ఈవెంట్స్ లో  మెదక్ జిల్లా టీం ఛాంపియన్ లుగా నిలిచారు. ఈ నెల 3,4,5  తేదీలలో మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ లోని ప్రీతి సుధాజి ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో  మహారాష్ట్ర రూరల్ గేమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్ లో ఆదివారం మెదక్ టీం ఛాంపియన్ లుగా నిలిచినట్లు కెప్టెన్ రాకేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారికి హర్యానా నేషనల్ ఇన్ స్ట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ కోచ్ ప్రదీప్ కత్రియా చేతుల మీదుగా అందించారు. రెజ్లింగ్ లో సిల్వర్ మెడల్ నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామానికి చెందిన బండారి వంశీ గౌడ్ నేషనల్ లెవల్ లో సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. నేషనల్ రూరల్ కబడ్డీ ఛాంపియన్ టీంలో ఇతను కూడా ఒక మెంబర్