![యూనివర్సిటీలపై ఎందుకింత నిర్లక్ష్యం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/12/05HSB18.jpg?fit=1280%2C853&ssl=1)
సామాజిక సారథి, నిజామాబాద్: తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటై 15ఏళ్లు గడుస్తున్నా సమస్యల నుంచి మాత్రం బయటపడటం లేదని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. యూనివర్సిటీలో సరిపడా బోధన సిబ్బంది లేక సమస్యలతో సతమతమవుతున్నారని, వందలాది మంది పేదవిద్యార్థులు చదివే యూనివర్సిటీలో విద్యాబోధన సరిగ్గాలేదన్నారు. ఆస్పత్రి నిర్మించినా నిరూపయోగంగా ఉండటంపై విస్మయం వ్యక్తం చేశారు. డాక్టర్లను నియమించక పోవడం శోచనీయమన్నారు. వర్సిటీ వీసీ తక్షణమే చర్యలు చేపట్టి హెల్త్ సెంటర్ ను ప్రారంభించాలని డాక్టర్ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.