Breaking News

Month: November 2021

పౌష్టికాహారంపై అవగాహన

పౌష్టికాహారంపై అవగాహన

సామాజిక సారథి, వలిగొండ: గర్భిణీ స్త్రీలు నాలుగో నెల నుండి తొమ్మిదో నెల వరకు 180 ఐరన్ మాత్రలు తీసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని సర్పంచ్ లు బొల్ల లలిత శ్రీనివాస్, చేగూరి భిక్షపతి అన్నారు. శుక్రవారం వలిగొండ మండల కేంద్రంతో పాటు టేకులసోమారం అంగన్ వాడీ కేంద్రాలలో బాలింతలకు పౌష్టికాహారం, పరిపూర్ణ ఆరోగ్యం అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సింహారెడ్డి, అంగన్వాడీ టీచర్ లు బి. సోమేశ్వరి, కె దుర్గ, ఆశా వర్కర్ వసంత, […]

Read More
రాజ్యాంగమే రక్ష

రాజ్యాంగమే రక్ష

డాక్టర్​బీఆర్​అంబేద్కర్‌ అద్భుతమైన రచన చేశారు కరోనా వ్యాక్సిన్‌ అందరూ తీసుకోవాల్సిందే రాజ్‌భవన్‌ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్‌ తమిళసై సామాజిక సారథి, హైదరాబాద్‌: రాజ్యాంగం వల్లే భారత్​బలంగా ఉందని గవర్నర్‌ తమిళిసై అన్నారు. అంబేద్కర్‌ దేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో జరిగిన 72వ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్‌ తమిళిసై, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రశాంత్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]

Read More
పంచాయతీ అనుమతులు ఇక చెల్లవు

పంచాయతీ అనుమతులు ఇక చెల్లవు

సామజిక సారథి, తుర్కయంజాల్: పంచాయతీ అనుమతితో ఇక తుర్కయంజాల్ మున్సిపాలిటీ లో నిర్మాణాలు కొనసాగుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని ఇక నుంచి అనుమతులు చెల్లవని కమిషనర్ ఎం ఎన్ ఆర్  జ్యోతి స్పష్టం చేశారు. గ్రామా పంచాయతీ అనుమతితో నడుస్తున్న నిర్మాణాలు అన్నింటిని ఆపివేయాలని మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ లో ఏ నిర్మాణం చేపట్టాలన్నా తప్పకుండా మున్సిపాలిటీ అనుమతులు  పొందాలని సెట్ బ్యాక్ వదిలి  అనుమతులు పొందిన వరకే నిర్మాణాలు […]

Read More
యాదాద్రికి ఎమ్మెల్యే మర్రి బంగారు కానుక

యాదాద్రికి ఎమ్మెల్యే మర్రి బంగారు కానుక

సామాజిక సారథి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురానికి స్వర్ణం తాపడం కోసం నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి రెండు కిలోల బంగారాన్ని విరాళంగా అందజేశారు. సీఎం కేసీఆర్​ సమక్షంలోనే ఆయన గతంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఆ హామీ మేరకు బంగారాన్ని ఆలయానికి అప్పగించారు. శుక్రవారం కుటుంబసమేతంగా లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం పలికారు. అంతకుముందు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం […]

Read More
అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి విరాళం

అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి విరాళం

సామాజిక సారథి,రామడుగు:  మండలంలోని వెదిరలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో  భాగంగా కమిటీ సభ్యులు గోదావరిఖని వన్ టౌన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గంగాధర రమేష్ ను కలిసి విరాళం అందించాల్సిందిగా గ్రామస్థులు కోరారు. సిఐ రమేష్ తన సొంత ఊరి కోసం లక్ష రూపాయల చెక్కును శుక్రవారం అందించారు. ఇక్కడ అంబేద్కర్ విగ్రహ కమిటీ చైర్మన్ నాగుల రాజశేఖర్, వైస్ చైర్మన్ అంజన్ కుమార్, కమిటీ […]

Read More
వైరాలో కదంతొక్కిన విద్యార్థులు

వైరాలో కదంతొక్కిన విద్యార్థులు

సామాజిక సారథి‌, వైరా:  సచివాలయాలు,  దేవాలయాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న సీఎం కేసీఆర్  పేద విద్యార్థులకు బాకీ పడ్డ బోధనా రుసుము ఉపకార వేతనాల చెల్లింపుకు సంవత్సరాలుగా నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని పీడీఎస్యూ  అధ్యక్షుడు ఎం.అజాద్ ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా వైరాలో శుక్రవారం పీడీఎస్ యూ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడుతూ కొవిడ్ […]

Read More
అదనపు ఎస్పీ సృజనకు వీడ్కోలు

అదనపు ఎస్పీ సృజనకు వీడ్కోలు

సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: జిల్లా అదనపు ఎస్పీగా సృజన ఎస్పీగా పదోన్నతి పొంది బదిలీపై డీజీపీ కార్యాలయానికి వెళ్తున్న సందర్భంగా శుక్రవారం ఎస్పీ రమణకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లాకు నూతనంగా అదనపు ఎస్పీగా బదిలీపై వచ్చిన నితిక పంత్ కు ఘన స్వాగతం పలికారు. పోలీస్ క్యలాణ మంటపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ రమణకుమార్ హాజరయ్యారు.  కార్యక్రమంలో నూతన అదనపు ఎస్పీ నితిక పంత్, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాస్ […]

Read More
సంక్షేమ పథకాలతోనే పల్లెలు అభివృద్ధి

సంక్షేమ పథకాలతోనే పల్లెలు అభివృద్ధి

సామాజిక సారథి, ఐనవోలు/ హన్మకొండ: తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పల్లెలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఐనవోలు మండలం లోని పంతిని గ్రామంలో రూ.12.60లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠ దామాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలతో పల్లెలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. పంతిని నుంచి చెన్నారం గ్రామానికి రూ.2.50కోట్ల వ్యయంతో బీటీ రోడ్ మంజూరయ్యిందని, త్వరలో పనులు పూర్తి […]

Read More