సామాజిక సారథి, వరంగల్ ప్రతినిధి: ఆన్ లైన్ లో క్రికెట్, పేకాట బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు హన్మకొండ పోలీసులు తెలిపారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ హన్మకొండ విజయ నగర్ కాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్ (40)మహారాష్ట్ర అభయ్ విలాస్ యవాత్మల్ జిల్లా కు చెందిన అభయ్ విలాస్ రావు పెట్కర్ సోమవారం హన్మకొండ కేయూసీ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ.2.5 కోట్ల నగదు, బ్యాంకు ఖాతాలు ఏటీఎం […]
కార్తీక దీపోత్సవానికి వచ్చి గుండెపోటుతో హఠాన్మరణం సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం స్వామి సేవలో జీవితం అంకితం చేశారు: సుప్రీం సీజేసీ జస్టిస్ఎన్వీ రమణ తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. కార్తిక దీపోత్సవంలో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్లిన ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సోమవారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు రాగా, దవాఖానకు తరలించే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. డాలర్ శేషాద్రి 1978 నుంచి శ్రీవారి సేవలో పాల్గొంటున్నారు. […]
ఎస్పీ రమణ కుమార్ సామాజిక సారథి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది చౌరస్తా వద్ద సోమవారం ఉదయం 6గంటలకు లారీలో అక్రమంగా తరలిస్తున్న 600కిలోల ఎండు గంజాయిని స్వాధీన పర్చుకున్నామని జిల్లా ఎస్పీ రమణకుమార్ తెలిపారు. సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రమణ కుమార్ పూర్తీ వివరాలను వెల్లడించారు. సోమవారం ఉదయం తమకు వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ, టాస్క్ ఫోర్స్ […]
సామాజిక సారథి ఎఫెక్ట్.. సామాజిక సారథి, చిలప్ చెడ్: మెదక్ జిల్లా చిలప్ చెడ్ మండలం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంతారం ధాన్యం కొనుగోలు సెంటర్లో రైతులను దోపిడీ చేస్తున్న విధానంపై ఈనెల 26న ‘సామాజికసారథి’లో ‘వడ్ల తూకవేస్తున్నారు’ శీర్షికన కథనం వచ్చింది. నెలరోజులుగా రైతుల పడిగాపులు, సంచికి రూ.పది చొప్పున వసూలు చేస్తున్నారనే విషయాలు వెలుగుచూశాయి. దీనికి స్పందించిన ఐకేపీ అధికారులు లారీలను సక్రమంగా వచ్చేలా ఏర్పాట్లు చేశారు. రైతుల వడ్ల కుప్పలను సోమవారం సంచుల్లో […]
సామాజిక సారథి, చిలప్ చెడ్: ప్రముఖ మార్కెటింగ్ పరిశోధన సంస్థ బిజినెస్ మైండ్ తెలుగు ఐకాన్ అండర్ 30, 2021 లో ‘ హుమెన్ అండ్ సుస్టేనేబల్ ఆగ్రి స్టార్ట్ ఆఫ్’ తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా’ సూర్ గ్రో ఫామ్స్’ ప్రతినిధులు శివంపేట్ మండలం గోమారం గ్రామానికి చెందిన అచ్యుత్ రెడ్డి, చిలప్ చెండ్ సర్పంచులు పోరన్ అధ్యక్షురాలు లక్ష్మిదుర్గారెడ్డి తనయుడు నారన్నగారి రామ్ నారాయణరెడ్డిలకు అవార్డు వచ్చిందన్నారు. ఈ అవార్డు హైదరాబాద్ లో హెచ్ ఐసీసీ […]
సామాజిక సారథి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో కేబినెట్ భేటీ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై కేబినెట్లో చర్చించనున్నారు. కరోనా పరిస్థితులు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు.
కల్లాలబాట పట్టిన దళారులు సామాజిక సారథి, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశులు పేరుకుపోతున్నాయి. అయితే ప్రభుత్వ కేంద్రాలు ప్రారంభించిన ఇంకా ఎక్కడా కొనుగోలు ప్రారంభించకపోవడంతో ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న దళారులు దందాకు తెరలేపారు. నేరుగా కాంటాలతో కల్లాలబాట పట్టిన దళారులు. రైతుల పొలాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. తేమ అధికంగా ఉన్నా […]
షోకాజ్ నోటీసు జారీ చేసిన వీడని నిర్లక్ష్యం ఈవో పనితీరుపై సర్వత్రా విమర్శలు సామాజిక సారథి, పెద్దశంకరంపేట: గత జూలై 5వ తేదీన పల్లె ప్రగతి పనులను పరిశీలించడానికి పెద్ద శంకరంపేట మండలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన జిల్లా కలెక్టర్ హరీష్ పెద్దశంకరంపేట పారిశుధ్యంపై పేట పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రత్యేకంగా 161జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రియాంక కాలనీలో మురికి కాలువలో నుండి మురికి నీరు రోడ్డుపై […]