Breaking News

బిజినెస్ మింట్ లో అవార్డు

బిజినెస్ మింట్ లో అవార్డు

సామాజిక సారథి, చిలప్ చెడ్: ప్రముఖ మార్కెటింగ్ పరిశోధన సంస్థ బిజినెస్ మైండ్ తెలుగు ఐకాన్ అండర్ 30, 2021 లో ‘ హుమెన్ అండ్ సుస్టేనేబల్ ఆగ్రి స్టార్ట్ ఆఫ్’ తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా’ సూర్ గ్రో ఫామ్స్’ ప్రతినిధులు శివంపేట్ మండలం గోమారం గ్రామానికి చెందిన అచ్యుత్ రెడ్డి, చిలప్ చెండ్ సర్పంచులు పోరన్ అధ్యక్షురాలు లక్ష్మిదుర్గారెడ్డి తనయుడు నారన్నగారి రామ్ నారాయణరెడ్డిలకు అవార్డు వచ్చిందన్నారు. ఈ అవార్డు హైదరాబాద్ లో హెచ్ ఐసీసీ నోవోటేల్ ఫైవ్ స్టార్ హోటల్లో ఐటీ తెలంగాణ సెక్రటరీ రంజాన్, ఆర్టీఐ మాజీ చీఫ్ కమిషనర్ వెంకటేశ్వర్లు, టెక్ మహీంద్రా వీపీ రాజేష్ దుడ్డు, జీఎంఆర్ కార్గో సీఈవో సౌరబ్ కుమార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సూర్ గ్రో ఫామ్స్ ప్రతినిధులు అచ్యుతరెడ్డి, నారన్నగారి రాంనారాయణరెడ్డికి అవార్డు రావడంపట్ల తల్లితండ్రులు, గోమారం, చిలప్ చెడ్ గ్రామస్తులు, పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.